CM KCR: ప్రత్యామ్నాయంపై త్వరలో స్పష్టత
దేశాన్ని గాడిలో పెట్టి సరైన దిశలో నడిపేందుకు గట్టి ప్రయత్నం మొదలైందని, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. త్వరలోనే తామంతా కలిసి ఏ ఎజెండాతో, ఎలా ముందుకు వెళ్లాలో, దేశాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా తీసుకెళ్లాలనే దానిపై వ్యూహం ఖరారు చేస్తామన్నారు
దేశానికి సరైన దిశ చూపేలా గట్టి ప్రయత్నం
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో భేటీ
ప్రాంతీయ పార్టీల సత్తా చూపుదామన్న సోరెన్
దేశానికి స్వాత్రంత్యం వచ్చి 75 సంవత్సరాలైనా జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ప్రపంచదేశాలతో పోలిస్తే చాలా విషయాల్లో మనం వెనకబడిపోయాం. పొరుగున ఉన్న చైనా సహా ఎన్నో ఆసియా దేశాలు ప్రగతిని సాధించినా భారత్లో అది కనిపించడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం దేశాన్ని సరైన పంథాలో నడిపించడం లేదు. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉంది.
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: దేశాన్ని గాడిలో పెట్టి సరైన దిశలో నడిపేందుకు గట్టి ప్రయత్నం మొదలైందని, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. త్వరలోనే తామంతా కలిసి ఏ ఎజెండాతో, ఎలా ముందుకు వెళ్లాలో, దేశాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా తీసుకెళ్లాలనే దానిపై వ్యూహం ఖరారు చేస్తామన్నారు. భాజపా, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్, మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ లాంటివి ఖరారు కాలేదని, ఇప్పుడే తొందరపడి ఏ పేరూ పెట్టవద్దన్నారు. ఝూర్ఖండ్ రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్తో కలిసి కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మేమిద్దరం జాతీయ రాజకీయాలపై చర్చించాం. చర్చలు ఫలప్రదమయ్యాయి. త్వరలోనే మరోసారి కలిసే అవకాశం ఉంది. పురోగామి భారత్ను నిర్మించడంలో అందరి పాత్రను కోరుతున్నాం. ప్రస్తుతమున్నదాని కంటే ఎన్నోరెట్లు మెరుగైన భారత్ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయాలనేదే మా ఆకాంక్ష. దేశంలో ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలుస్తున్నాం. ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించలేం. ఒకరిద్దరితో అయ్యే పని కూడా కాదు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక దారి దొరుకుతుంది. ఏ దారిలో వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఫ్రంట్ను ఏర్పాటు చేయాలా లేక మరోటా అనే విషయాన్ని మున్ముందు తెలియజేస్తాం. స్వచ్ఛమైన మంచి మనసుతో చెబుతున్నాం. ప్రస్తుతం ఉన్న భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయాలన్నదే మా ఆకాంక్ష’’ అన్నారు.
ప్రాంతీయ పార్టీల సత్తా చాటుదాం: కేసీఆర్
ఇద్దరు సీఎంలు దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భాజపా వ్యతిరేక కూటమి రూపకల్పన వంటి అంశాలపై చర్చించారు. భాజపాయేతర రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ఏడున్నరేళ్లుగా ఎలాంటి సాయం చేయడం లేదని, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని తెలిపారు. ‘‘రైల్వేలోనూ సహాయ నిరాకరణ చేస్తోంది. కరోనా టీకాలు, వలస కూలీలకు సాయంలో కేంద్రం విఫలమైంది. తెలంగాణ నుంచి ఝార్ఖండ్ కూలీలను మేం ప్రత్యేక రైళ్లలో తరలించాం. తాజాగా ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను తరలించడంలోనూ కేంద్రం చొరవ చూపడం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో సీఎంలను కలిసినప్పుడు కేంద్రంపై సమరభేరి మోగించాలనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. దీనిపై భాజపాకు తగిన శాస్తి చేయాలి. దీనికి ఝార్ఖండ్ కలిసి రావాలి’’ అని కేసీఆర్ అన్నారని తెలిసింది.
అప్పుడే తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు?.. సోరెన్
సోరేన్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలు దారుణం. తమ హయాంలో మూడు రాష్ట్రాలు ఇచ్చామని చెబుతున్న మోదీ. 2000లోనే ఎందుకు తెలంగాణ ఇవ్వలేదో కూడా చెప్పాలి. రాష్ట్రంలో భాజపా అధికారం కోల్పోగానే.. ఝార్ఖండ్పై కక్ష సాధిస్తోంది. మా రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు ఇవ్వడం లేదు. మోదీ దీనికి ఏం సమాధానం చెబుతారు? ఆయనకు ప్రాంతీయ పార్టీల సత్తా ఏమిటో చూపుదాం’’ అని సోరెన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
అమర జవాన్ల కుటుంబాలకు సాయం
సరిహద్దులో చైనాతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ సాయం అందించారు. ఝార్ఖండ్కు చెందిన కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రతకు 10 లక్షల చెక్ను హేమంత్ సోరెన్తో కలిసి అందజేశారు. మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు 10 లక్షల చెక్ను అందించారు.
శిబుసొరెన్ ఆశీర్వాదం
తెలంగాణ ఉద్యమాన్ని 2001లో ప్రారంభించామని, ఆ సమయంలో ప్రథమ ప్రత్యేక అతిథిగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు, హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ హాజరయ్యారయ్యారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సోరెన్ తెలంగాణ ప్రజలకు వెన్నంటి నిలిచారని, వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణ మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారన్నారు.
ఝార్ఖండ్లో ఘనస్వాగతం
దిల్లీ నుంచి శుక్రవారం ఉదయం ఝార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్న కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. తొలుత గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా విగ్రహం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ఝార్ఖండ్ సీఎం నివాసానికి వెళ్లారు. కేసీఆర్ ఆయన సతీమణి శోభ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత బృందాన్ని హేమంత్ సోరెన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హేమంత్, ఆయన తండ్రి ఝార్ఖండ్ ముక్తిమోర్చా వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శిబు సొరెన్ కేసీఆర్కు జ్ఞాపికను అందజేశారు. కేసీఆర్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఝార్ఖండ్ పర్యటన ముగించుకుని రాంచీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?