CM KCR: పెడ ధోరణిలో కేంద్రం
ఆహార్యంతో ప్రభుత్వాలకు ఏం సంబంధం..? ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తే ఏంటి..? హిజాబ్ పేరుతో గొడవపెట్టే సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాటితో దేశంలో విపరీత పరిణామాలు
రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తోంది
ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
ఉక్రెయిన్ విద్యార్థులను ఇక్కడ చదివిస్తాం..ఖర్చు భరిస్తాం
సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి వేతనాలు
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీ ఉద్యోగాలు
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.3 వేలకు పెంపు
వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం
వీఆర్ఏలను లష్కర్లుగా నియమిస్తాం
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఆహార్యంతో ప్రభుత్వాలకు ఏం సంబంధం..? ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తే ఏంటి..? హిజాబ్ పేరుతో గొడవపెట్టే సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాటితో దేశంలో విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాబోతోంది.
బడ్జెట్ అనేది ప్రజాధనం. ఓట్లు, సీట్లకే పరిమితమైతే అరాచకం అవుతుంది. ఇటీవల కొందరు పిగ్మీలు దూరిపోయి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా చేస్తున్నారు. 2014లో యూపీఏ ప్రభుత్వంపై నిందలు మోపి భాజపా వచ్చింది. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు భాజపా పాలనలో దేశం పతనం అయింది. ఆనాడు 8 శాతంగా ఉన్న వృద్ధిరేటు నేడు ఆరుకి పడిపోయింది’’ -సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్ : ‘‘రాష్ట్రాల సమాఖ్య అనేది రాజ్యాంగంలో కీలకం. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తోంది. కేంద్రం విధానం విచిత్రంగా ఉంది. బలమైన కేంద్రం.. బలహీన రాష్ట్రం అనే విధానాన్ని అవలంబిస్తోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య. ఈ పెడధోరణి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీస్తుంది. కచ్చితంగా వాంఛనీయం కాదు. కేంద్రం తీరుపై అన్ని శాసనసభలు చర్చించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్ పద్దులపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన నాలుగురోజుల విశ్రాంతి అనంతరం శాసనసభకు హాజరై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో వివిధవర్గాలకు పలు వరాలు ప్రకటించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తారు. ఒక రాష్ట్రానికి కేటాయించిన తర్వాత అక్కడే పదవీవిరమణ పొందుతారు. వారు ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కొందరైతే ఆ రాష్ట్రంతో భావోద్వేగ బంధం ఏర్పర్చుకుంటారు. అలాంటి అధికారుల్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటామని కేంద్రం కుట్ర చేస్తోంది. అఖిలభారత సర్వీస్ అధికారుల్ని అభద్రతకు లోనుచేస్తోంది. ఈ విషయంలో మీ గొంతు కోస్తామని రాష్ట్రాలనే అభిప్రాయం అడుగుతోంది.
కేంద్రం పనితీరు దిగజారింది
కేంద్రం పనితీరు దిగజారిందని ఆ ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. నేటికి కేంద్రం రూ.152 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్లో 25శాతం మాత్రమే అప్పులు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. కేంద్రం అదే నీతిని పాటించాలి కదా? కానీ 58.5 శాతం అప్పు చేసింది. తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి వంటి అంశాల్లో కేంద్రం పనితీరు తెలంగాణ స్థాయిలో లేదు. అప్పుల్లో తెలంగాణాది దేశంలో 24వ స్థానం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అప్పుల వాయిదాలు ఎప్పటికప్పుడు పక్కాగా చెల్లిస్తున్నాం. ఆర్బీఐ నివేదికలే తెలంగాణ పథకాల్ని మెచ్చుకుంటున్నాయి. అవినీతిని అణచివేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. బడ్జెట్ బాగాలేకపోతే ప్రజలే తీర్పు ఇస్తారు.
సభలో సీఎం వివిధ వర్గాల వారికి ప్రకటించిన వరాలు
* ఉక్రెయిన్లో 20 వేల పైచిలుకు విద్యార్థులు చిక్కుకున్నారు. తెలంగాణ నుంచే వారిలో 740 మంది ఉంటే వీరిలో 710 మంది ఎంబీబీఎస్ చదవడానికే వెళ్లారు. ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలంటే రూ.కోటికిపైగా ఖర్చవుతున్నందున అంత భరించలేక పలువురు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకే ఉక్రెయిన్లో చదవడానికి వెళుతున్నారు. యుద్ధం వల్ల విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్కు పోయే పరిస్థితి లేదు. వారి చదువు ఇక్కడ కొనసాగించే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి రాస్తాం. వారి చదువుకు ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. యుద్ధం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్లో ఇబ్బందులు పడుతుంటే కొందరు కేంద్రమంత్రులు వారిని విమర్శిస్తూ ‘తిన్నది అరగక అక్కడికి ఎందుకు పోయారు’ అని మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థుల గురించి మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా ? దీనిపై మేం ఏమైనా మాట్లాడితే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు.
* సెర్ప్, మెప్మాల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం.
* ఉపాధి హామీ పథకం విభాగంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారు గతంలో సమ్మె చేశారు. భ్రమలకు పోయి సమ్మె చేయవద్దని అప్పుడే చెప్పాం. అయినా వినకుండా సమ్మె చేశారు. వాళ్ల మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది? వాళ్లందరినీ మళ్లీ ఉద్యోగాల్లో చేర్చుకుంటాం.
* ఉద్యోగాలకు పోటీ పరీక్షలన్నింటినీ ఉర్దూ భాషలో కూడా నిర్వహిస్తాం.
* పబ్లిక్ సర్వీసు కమిషన్లో మైనార్టీ వర్గానికి చెందినవారిని సభ్యుడిగా నియమిస్తాం.
* తెలంగాణ ఏర్పడినప్పుడు 3 వైద్య కళాశాలలుంటే ఇప్పుడు 33కి పెంచుతున్నాం. ప్రతీ కాలేజీలో నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటుచేస్తాం
* వరంగల్, మంథని, ఖమ్మం, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆ రైతుల వివరాలను వ్యవసాయశాఖ సేకరించి పంపితే పరిహారం ఇస్తాం.
* పాతబస్తీలో రోడ్లు వెడల్పు చేయడానికి మరో రూ.200 కోట్లు ఇస్తాం.
* మధ్యాహ్న భోజన పథకం విభాగంలో పనిచేస్తున్నవారికి ప్రస్తుతం నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. దానిని రూ.3 వేలకు పెంచుతాం.
* గ్రామ రెవెన్యూ సహాయకులను నీటిపారుదలశాఖలో లష్కర్లుగా నియమిస్తాం.
* సాదాబైనామాల వారి భూముల వివరాలను ధరణిలో నమోదుకు చర్యలు తీసుకుంటాం.
* నీటిపారుదల, వైద్యశాఖల్లో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతులిస్తాం.
డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్
ప్రస్తుత మోదీ పాలనలో 5 లక్షల సంస్థలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు యూపీఏ హయాంలో 4.7 శాతముంటే ఇప్పుడు 7.11కి పెరిగింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ర్యాంకుల్లో భారత్ 93కి చేరింది. ఆత్మనిర్భర్ అన్నారు. దేశం ఆత్మనిబ్బరం కోల్పోయింది. మతపిచ్చి కార్చిచ్చులా దహించివేస్తుంది. ఇలాంటి కేంద్ర పాలన వల్ల దశాబ్దాల తరబడి ప్రగతికి కొనసాగిన కృషి కుప్పకూలుతుంది. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ అని కొందరు కొత్త నినాదంతో ప్రచారం చేస్తున్నారు.ప్రజలు అమాయకులు కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితి ఉంది. కానీ అది ట్రబుల్ ఇంజిన్ అని సభ్యులు అంటున్నారు. కేంద్రంలో, ఉత్తర్ప్రదేశ్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా అనేక అంశాల్లో తెలంగాణకన్నా వెనుకబడి ఉంది.తలసరి ఆదాయంలో సిక్కిం తరవాత దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
111 జీఓను రద్దు చేస్తాం
గతంలో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీరు వచ్చేది. అవి కలుషితం కాకుండా ఉండటానికి 7 మండలాల్లోని 83 గ్రామాల్లో భూముల వినియోగంపై అంక్షలు పెడుతూ 111 జీఓ తెచ్చారు. కానీ వాటి నుంచి ఇప్పుడు మంచినీరు నగరానికి అవసరం లేదు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీరు నగరానికి వస్తుంది. హైదరాబాద్కు వందేళ్ల వరకు నీటి సమస్య రాదు. ఈ నేపథ్యంలో 111 జీవో అర్థరహితం. దానిని ఒకేసారి రద్దుచేస్తే ఇబ్బందులు రాకుండా అక్కడ గ్రీన్జోన్లు ఏర్పాటుచేసేలా మున్సిపల్ శాఖ చూడాలి. ఈ జీఓ రద్దుపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేశాం. నివేదిక రాగానే జీఓను ఎత్తేస్తాం.
* ఐఏఎస్ అధికారుల కమిటీ నివేదిక అందగానే మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్లోని ఆలయభూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
* ఎమ్మెల్యేలు, అధికారులు, విలేకరులకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. అది తేలగానే వారికి స్థలాలిస్తాం.
* ఏపీ, తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి నదీ జలాలను ఇతర నదులతో అనుసంధానం చేసి జలాలను తరలించే అవకాశం లేదు. సీతారామసాగర్ పూర్తయితే ఖమ్మం జిల్లాలో పుష్కలంగా నీరు అందుతుంది.
భట్టిని పార్లమెంట్కు పంపిద్దాం
ఎప్పుడూ మాపై విమర్శలు చేస్తారని భట్టి విక్రమార్కకు పేరుంది. కేంద్రప్రభుత్వం తీరుపై బాగా విమర్శలు చేస్తుండటంతో మా సభ్యులంతా ఆయన పార్లమెంట్లో మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు కేంద్రంపై కోపాన్ని శాసనసభలో చూపితే ఎలా అంటున్నారు. పార్లమెంట్కు వెళ్లి నిలదీయాలని కోరుతున్నారు. దిల్లీకి వెళ్లడం అంటే ప్రమోషనే. డిమోషన్ కాదు. తెలంగాణ అప్పుల్లో ఉందనే బెంగ భట్టి విక్రమార్కకు అవసరం లేదు. - ముఖ్యమంత్రి కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలి
లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ ప్రతినిధులు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు