Corona Third Wave: ఇక ఆంక్షల్లేని జీవితం గడపొచ్చు
రాష్ట్రంలో కరోనా మూడోదశ ముప్పు ముగిసిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రజలు ఆంక్షలు లేని సాధారణ జీవితాన్ని గడపొచ్చని స్పష్టం చేశారు.
మూడో ముప్పు ముగిసినట్లే!
విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు
కరోనా కనుమరుగు కాలేదనేది మరవొద్దు
మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాల్సిందే
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మూడోదశ ముప్పు ముగిసిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రజలు ఆంక్షలు లేని సాధారణ జీవితాన్ని గడపొచ్చని స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించుకోవచ్చని సూచించారు. అయితే కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగు కాలేదనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అప్రమత్తం చేశారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ నిబంధనలను పాటిస్తూనే అన్ని కార్యకలాపాలూ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. భక్తులు మేడారం జాతరకు వెళ్లొచ్చని తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం ప్రజారోగ్య సంచాలకులు విలేకరులతో మాట్లాడారు.
సాధారణ ఫ్లూగా రూపాంతరం!
‘‘వచ్చే వారం, పదిరోజుల్లో రోజుకు వంద కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితి వస్తుంది. మూడోదశలో ఒమిక్రాన్ బీఏ-2 ఉపరకం వేరియంటే 70 శాతం నమోదైంది. 4 వారాల కిందట 5 శాతం నమోదైన పాజిటివిటీ రేటు ఇప్పుడు 2 శాతానికి తగ్గిపోయింది. 7 రోజుల్లోనే కోటి ఇళ్లలో జ్వర సర్వేలు చేపట్టి, లక్షల మందికి ఔషధ కిట్లను అందించాం. ఒమిక్రాన్ తీవ్రమైనదే అయినా.. టీకాలను సకాలంలో అధికులకు పంపిణీ చేసి.. సమర్థంగా ఎదుర్కోగలిగాం. అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో 40-50 శాతం కూడా వ్యాక్సినేషన్ జరగకపోవడంతో అక్కడ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపింది. భవిష్యత్లో ఎన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా.. ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేశాం. వచ్చే కొన్ని నెలలపాటు కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు తక్కువ. రాబోయే రోజుల్లో కరోనా సాధారణ ఫ్లూగా రూపాంతరం చెందే అవకాశాలే అధికం. కొత్త వైరస్లు వస్తూ.. కాలానుగుణ ఫ్లూ మాదిరిగా వస్తూపోతూ ఉంటుంది. కొవిడ్ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. భవిష్యత్లో అన్ని వేరియంట్లను తట్టుకునే టీకాలు అందుబాటులోకి వస్తాయి. కొవిడ్ చికిత్సానంతర సమస్యలు రెండో దశతో పోల్చితే మూడోదశలో తక్కువే. ఈ ఏడాది జనవరి 31 వరకూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తర్వాత పొడిగిస్తూ ఉత్తర్వులివ్వలేదంటే.. ఎత్తివేసినట్లే. విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రత్యక్ష తరగతులతోనే విద్యార్థులకు ఉపయోగం. మేడారం జాతరకు వచ్చే లక్షల మంది భక్తుల కోసం తాత్కాలికంగా 150 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశాం’’ అని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు.
కొత్తగా 1,061 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,061 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,79,971కి పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 4,102 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా 69,892 నమూనాలను పరీక్షించారు. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 274 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 2,36,317 కొవిడ్ టీకాలను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు