5 State Election Result: దండలెవరికి?దండనెవరికి?
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న శాసనసభల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే.
నేడే 5 అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు
కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు
దిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న శాసనసభల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. బెంగాల్లో తృణమూల్-భాజపా మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోరు సాగిందని, మమతకు కాస్త మొగ్గు ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. తమిళనాడులో డీఎంకే, కేరళలో వామపక్ష కూటమి, అస్సాంలో ఎన్డీయే అధికారం దక్కించుకోవచ్చని అవి పేర్కొన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. వివిధ కారణాల వల్ల ఈసారి ఈ బ్యాలెట్లు గతసారి కంటే నాలుగురెట్లకు పైగా పెరిగాయి. వీటి లెక్క పూర్తయ్యాక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరవబోతున్నారు. కరోనా తీసుకువచ్చిన సమస్యలను, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను గమనంలో తీసుకుని ఓట్ల లెక్కింపు బల్లల అమరిక నుంచి అన్నింటా అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నానికి ఓటర్ల తీర్పు సరళి, సాయంత్రం 5 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. లెక్కింపును 1100 మంది పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్సైట్, యాప్లలో తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎవరి అంచనాలు వారివి
కేరళలో ఈసారీ వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్)దే గెలుపు అని, మునుపెన్నడూలేని రీతిలో ఇది జరగబోతోందని సర్వేలు తేచ్చినా విపక్ష యూడీఎఫ్ కూటమి మాత్రం ఆశలు విడిచిపెట్టలేదు. తమిళనాడులో అన్నాడీఎంకే- డీఎంకే మధ్యనే గట్టి పోరు సాగినట్లు తెలుస్తోంది. ఈసారి అధికారం డీఎంకే వశమయ్యే అవకాశాలు ఎక్కువని అంచనాలు తేల్చాయి. కన్యాకుమారి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితమూ ఆదివారం వెలువడనుంది. అస్సాంలో కమలదళ కూటమి ముందంజలో ఉంటుందని ఓటర్ల నాడిని ఉటంకిస్తూ వివిధ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందనేది ఎగ్జిట్ పోల్స్ మాట. కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల తీరు గురించి ఓటర్ల మదిలో ఏముందనేది ఆదివారం నాటి ఫలితాల ద్వారా కొంతవరకు తెలుస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో మొత్తం క్రియాశీలక కేసుల్లో 78.22% వరకు కేవలం 11 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో కేరళ, తమిళనాడు, బెంగాల్ ఉన్నాయి.
బెంగాల్పైనే ఆసక్తి
ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మిగతావాటి కంటే బెంగాల్పై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి విజయం సాధిస్తారా, మోదీ-అమిత్షాల నేతృత్వంలో విస్తృతంగా సాగిన ప్రచారం ఫలిస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. మమత తన రాజకీయ జీవితంలో ఇంతటి సవాల్ను ఎన్నడూ ఎదుర్కోని విషయం తెలిసిందే.
కరోనా నెగెటివ్ అయితేనే కేంద్రాల్లోకిఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించాలంటే అభ్యర్థులు, వారి తరఫు ఏజెంట్లు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ అని ఫలితం వచ్చినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది. లేదంటే కరోనా టీకా రెండు మోతాదులూ తీసుకున్నట్లు రుజువు సమర్పించాలి. దీని కోసం శనివారమూ పలువురు టీకాలు తీసుకున్నారు. విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 294 స్థానాలకు గానూ 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 108 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్నిచోట్లా శానిటైజ్ చేసిన తర్వాతే ఈవీఎంలు, వీవీప్యాట్లను తెరవనున్నారు. లెక్కింపు జరుగుతుండగా కనీసం 15సార్లు ప్రతీ కేంద్రాన్నీ శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాస్కులు, ముఖ కవచాలు, శానిటైజర్లను విస్తృతంగా అందుబాటులో ఉంచుతారు. లెక్కింపు బల్లల మధ్య తగినంత దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక గదిలో గతంలో 14 బల్లలు ఉండేవి. ఈసారి ఏడుకు మించకుండా చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా