Drone: గాల్లో డ్రోన్లు గాల్లోనే..!
డ్రోన్ల దాడులను ఎదుర్కొనే రెండు వినూత్న సాంకేతికతలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. నిషేధిత ప్రాంతాల్లోకి యూఏవీలు చొచ్చుకొస్తుండడం, బాంబు
నూతన సాంకేతిక పరిజ్ఞానానికి శ్రీకారం
రెండింటిని అభివృద్ధి చేసిన డీఆర్డీవో
హైదరాబాద్లోని చెస్ ల్యాబ్లో పరిశోధనలు
ఈనాడు, హైదరాబాద్: డ్రోన్ల దాడులను ఎదుర్కొనే రెండు వినూత్న సాంకేతికతలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. నిషేధిత ప్రాంతాల్లోకి యూఏవీలు చొచ్చుకొస్తుండడం, బాంబు దాడుల దృష్ట్యా వీటిని కూల్చే సాంకేతికతపై డీఆర్డీవో కొంతకాలంగా పనిచేస్తోంది. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్), మరో ల్యాబ్తో కలిసి యాంటీ డ్రోన్ టెక్నాలజీలను తక్కువ వ్యవధిలో అభివృద్ధి చేసింది. ఇప్పటికే వీటిని ప్రాథమికంగా పరీక్షించి చూశారు. డ్రోన్లను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాలు విజయవంతం కావడంతో భారత సైన్యం ముందు ఈ సాంకేతికతను ప్రదర్శించారు. మరిన్ని పరీక్షల అనంతరం త్రివిధ దళాలకు యాంటీ డ్రోన్ సాంకేతికతను అందజేయనున్నారు.
చిన్నవే కానీ.. ఎన్నో సవాళ్లు
భారీ క్షిపణులను, విమానాలను, చివరికి శాటిలైట్లను కూల్చే సాంకేతికత ఉన్న భారత్కు చిన్నపాటి డ్రోన్లను అడ్డుకోవడం నిజంగా సవాలే. మన భూభాగం, గగనతలంలోకి చొచ్చుకొచ్చే శత్రుదేశాల క్షిపణులను, విమానాలను రాడార్ల సాయంతోనే గుర్తించి ధ్వంసం చేస్తుంటారు. డ్రోన్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటూ తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి కాబట్టి రాడార్లు గుర్తించడం కష్టం. వీటికోసం లేజర్ ఆయుధాలు, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ (డీఈడబ్ల్యూ)పై డీఆర్డీవో ముందుగానే పరిశోధనలు మొదలుపెట్టింది. హైదరాబాద్ కేంద్రంగానే ఎలక్ట్రానిక్ వార్ఫేర్పై ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి కొత్త సాంకేతికతలపై పరిశోధనలు మొదలెట్టారు. చాలారకాల ప్రయోగాలు చేపట్టారు.
ఎలా అడ్డుకుంటాయి?
డ్రోన్లు గాల్లో ఎగిరేటప్పుడు ప్రత్యేకమైన శబ్దం వస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో ఆపరేటర్ వీటిని ఎక్కడో దూరంగా ఉండి నడిపిస్తుంటారు. ఇందుకోసం ఆర్ఎఫ్ఐడీ చిప్లతో జత చేస్తారు. వీటిలో ఒకటి కమాండ్ అండ్ కంట్రోల్ లింక్లను జామ్ చేయడం ద్వారా డ్రోన్లను పనిచేయకుండా చేస్తుంది... రెండోది లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ద్వారా డ్రోన్ల ఎలక్ట్రానిక్స్ను దెబ్బతీస్తుంది. మొదటిది 3 కి.మీ. పరిధి లోపల ఉన్న డ్రోన్లను గుర్తించి జామ్ చేయగలిగితే.. కిలోమీటరు నుంచి రెండున్నర కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను లేజర్ ఆయుధం దెబ్బతీయగలదని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. డైరెక్టడ్ ఎనర్జీ వెపన్స్తో అధిక శక్తితో డ్రోన్లను ఆకాశంలోనే మసి చేసేయగలవు. ఒక్కొక్కటిగా వచ్చినా.. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వచ్చినా ఎదుర్కొనేందుకు, కూల్చివేసేందుకు కావాల్సిన సాంకేతికతను డీఆర్డీవో సిద్ధం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ