ఉదాసీనత అసలే వద్దు
ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి రెండురోజులు జ్వరం వచ్చింది. 101-102 డిగ్రీలకు తగ్గడం లేదు. యాంటిజెన్తో పాటు ఆర్టీ పీసీఆర్ పరీక్ష కూడా చేయించుకున్నాడు. రెండింటిలోనూ ‘నెగెటివ్’ అనే ఫలితం వచ్చింది. హమ్మయ్య.. కొవిడ్ లేదని ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ జ్వరం మాత్రలు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు.
ఆర్టీపీసీఆర్ సామర్థ్యం 70-80 శాతమే
లక్షణాలు ఉన్నా నెగెటివ్ వస్తే వైరస్ లేదని భావించొద్దు
వారంలోనే పరిస్థితి తీవ్రం కావచ్చు
ఆ పరీక్షను పూర్తిస్థాయిలో నమ్మడానికి వీల్లేదంటున్న నిపుణులు
ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి రెండురోజులు జ్వరం వచ్చింది. 101-102 డిగ్రీలకు తగ్గడం లేదు. యాంటిజెన్తో పాటు ఆర్టీ పీసీఆర్ పరీక్ష కూడా చేయించుకున్నాడు. రెండింటిలోనూ ‘నెగెటివ్’ అనే ఫలితం వచ్చింది. హమ్మయ్య.. కొవిడ్ లేదని ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ జ్వరం మాత్రలు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. వారం గడిచేసరికి జ్వరం తగ్గకపోగా.. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. వెంటనే ఆసుపత్రిలో చేరాడు. అక్కడ పరీక్షిస్తే రక్తంలో ఆక్సిజన్ 87-90 శాతం మధ్య చూపిస్తోంది. అక్కడ కూడా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయగా నెగెటివ్గానే తేలింది. అనుమానం వచ్చి సీటీ స్కాన్ చేయగా.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ బయటపడింది.
ఆర్టీ పీసీఆర్.. కొవిడ్ నిర్ధారణకు నమ్మకమైన, ఉత్తమమైన పరీక్ష ఇది. అందులో అనుమానం అక్కర్లేదు. ఈ పరీక్ష చేస్తే కరోనా వైరస్ సోకిందా? లేదా? అనేది స్పష్టమవుతోంది. అయితే కేవలం ఆర్టీ పీసీఆర్ చేసినంత మాత్రాన అన్నిసార్లూ కొవిడ్ పూర్తిగా తెలిసిపోతుందనుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఇందులో నెగెటివ్ వస్తే.. ఇక వైరస్ సోకలేదని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఆర్టీ పీసీఆర్ పరీక్ష సామర్థ్యం 70-80 శాతం మాత్రమే. మిగిలిన 20-30 శాతంలో వైరస్ను గుర్తించలేకపోవచ్చు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నా.. ఆర్టీ పీసీఆర్లో నెగెటివ్ వచ్చిందనే కారణంతో ఎక్కువమంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తమకు వైరస్ సోకలేదని భావిస్తూ.. లక్షణాలున్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం మరింత క్షీణించిన తర్వాత అప్పుడు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇటువంటి వారిలో 5 నుంచి 7 రోజుల్లోనే వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. అందుకే లక్షణాలు కనిపిస్తున్నప్పుడు.. ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ను పూర్తిస్థాయిలో విశ్వసించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సీటీ స్కాన్కు వెళ్లడం మంచిదని చెబుతున్నారు.
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా.. ఎప్పుడు ప్రమాదకరం?
* జ్వరం: మూడు రోజులకు పైగా జ్వరం తీవ్రంగా వస్తుంటే అనుమానించాలి. అంటే పారాసెటమాల్ వేసుకుంటున్నా కూడా శరీరం స్పందించకుండా.. 101 డిగ్రీలు ఆపైన జ్వరం కనిపిస్తుంటే వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిందే.
* ఆక్సిజన్: పల్స్ ఆక్సీమీటర్లో రక్తంలో ఆక్సిజన్ శాతం 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే కొవిడ్ కావచ్చేమోనని సందేహించాలి. రెండు మూడు గంటల్లో వేర్వేరుగా పరిశీలించినా కూడా.. 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే అది ప్రమాదానికి సంకేతమే. అది కొవిడా? కాదా? అనేది తర్వాత సంగతి. ముందు అత్యవసరంగా వైద్యసేవల కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
*రక్త పరీక్షలు: జ్వరం తగ్గడం లేదు. రక్తంలో ఆక్సిజన్ శాతం మాత్రం 94 కంటే పైనే చూపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎల్డీహెచ్, ఫెరిటిన్, సీఆర్పీ తదితర కొన్ని రక్తపరీక్షలు చేయించాలి. ఇవి రక్తంలో ఇన్ఫ్లేమటరీని సూచిస్తాయి. ఈ మూడింటిలో ఫలితాలు సాధారణం కంటే రెట్టింపు గనుక నమోదైతే.. వెంటనే అత్యవసరంగా వైద్యసేవలు పొందాలి.
*ఇటువంటి సమయాల్లో ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇంట్లోనే ఉండిపోవద్దు. సొంతంగా చికిత్స కూడా పొందొద్దు. ఈ పరిస్థితుల్లో వైద్యుని పాత్ర చాలా ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి.
సీటీ స్కాన్ ఎప్పుడు అవసరం?
తక్కువ కాలంలో.. ఎక్కువ జ్వరం ఉండి, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురిచేసే రోగం కొవిడ్. జ్వరం ఉండి కూడా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చి, కొవిడ్ కావచ్చనే సందేహం ఉన్నప్పుడు నిర్ధారణ కోసం సీటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందా? లేదా? అనేది తెలిసిపోతుంది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆక్సిజన్ శాతం బాగా పడిపోతున్నప్పుడు.. శ్వాసకోశాలు ఎంత ఎక్కువ ఇన్ఫెక్షన్కు గురయ్యాయనే అంచనాకు ఉపయోగపడుతుంది. ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ ఉన్నప్పుడు వైద్యుని సలహా లేకుండా సీటీ స్కాన్ చేయొద్దు. ఎందుకంటే అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించుకుంటే.. ఆర్థిక భారంతో పాటు 100-800 ఎక్స్రేలకు సమానమైన రేడియేషన్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఇది అవసరమో కాదో వైద్యుడే నిర్ణయించాలి. కొవిడ్కు సీటీ స్కాన్పై ఆధారపడి ఏ వైద్యుడు కూడా చికిత్స అందించరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఫలితాలపై ఆందోళన అనవసరం
ఆర్టీ పీసీఆర్, సీటీ స్కాన్ చేయించిన తర్వాత వచ్చే ఫలితంపైనా ఎక్కువమంది రోగులు ఆందోళన చెందుతుంటారు. వీటి గురించి అసలు భయాందోళనలు చెందొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఆ ఫలితాలు ఏం చెబుతున్నాయో చూద్దాం...
* ఆర్టీ పీసీఆర్లో సీటీ వాల్యూ: ‘సైకిల్ థ్రెషోల్డ్’ (సీటీ). ఇది మన శరీరంలోని వైరల్ లోడ్ గురించి చెబుతుంది. లోడ్ ఎక్కువుంటే సీటీ వ్యాల్యూ తక్కువగా ఉంటుంది. లోడ్ తక్కువగా ఉంటే సీటీ వ్యాల్యూ ఎక్కువగా ఉంటుంది. అయితే వైద్యులు సీటీ వ్యాల్యూను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించరని చెబుతున్నారు నిపుణులు. చికిత్సకు కావాల్సింది.. పాజిటివ్, నెగెటివ్ అంతే!
* సీటీ స్కాన్లో కొరాడ్స్లో గణాంకాలు: ఊపిరితిత్తుల్లో వచ్చిన ఇన్ఫెక్షన్కు స్కోరింగ్ ఇవ్వడం లాంటిది ఈ ‘కొరాడ్’. శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ మచ్చ (షేడ్) బట్టి అది కొవిడ్ కావచ్చా? కాదా? అనేది అంచనా వేసి చెబుతారు.
* సీటీ సివియారిటీ స్కోర్ ఇన్ సీటీ స్కాన్ (సీటీ ఎస్ఎస్): ఇది అన్నింటి కంటే ముఖ్యమైంది. ఇది వైరస్ తీవ్రతను సూచిస్తుంది. చికిత్స మొదలు పెట్టిన తర్వాత 5-7 రోజుల వరకూ తీవ్రత ఉంటుంది. చికిత్స అనంతరం కొంత పెరుగుతుంది. అది సీటీ స్కాన్లో కనిపిస్తుంది. అయితే సీటీ స్కాన్లో తగ్గే వరకూ ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు.
లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయొద్దు
-డాక్టర్ వి.జగదీశ్కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏఐజీ
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కొవిడ్ బారినపడిన వారి ఆరోగ్యం త్వరగా క్షీణిస్తోంది. ఎందుకంటే నెగెటివ్ అనే కారణంతో వారు చికిత్సలో జాప్యం చేస్తుంటారు. ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చి, లక్షణాలు కనిపిస్తుంటే దాన్ని పూర్తి నెగెటివ్గా భావించకూడదు. వెంటనే వైద్యసేవలకు సంప్రదించాల్సిందే. అలాగే సీటీ స్కాన్ గణాంకాలపైనా అనవసర ఆందోళన అక్కర్లేదు. ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ ఉంటే సీటీ స్కాన్తో పని లేదు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!