Firing on Asaduddin Owaisi: అసదుద్దీన్ వాహనంపై కాల్పులు
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్తుండగా... హాపుర్-గాజీయాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్గేటు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది.
తుపాకులతో దుండగుల బీభత్సం
యూపీలో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా ఘటన
గాజియాబాద్, అబిడ్స్, గోల్కొండ, న్యూస్టుడే: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ వెళ్తుండగా... హాపుర్-గాజీయాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్గేటు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. తనపై పెద్ద కుట్ర జరిగిందని, అల్లా దయవల్ల తాను బయటపడ్డానని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. వారం రోజుల్లోనే యూపీ తొలిదశ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన జరిగింది.
‘‘మేరఠ్లోని కిథౌర్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ బయల్దేరాను. మా కాన్వాయ్లో నాలుగు కార్లు ఉన్నాయి. హాపుర్-గాజియాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా... ఛాజర్సీ టోల్గేట్ వద్ద నా వాహనంపై ముగ్గురు-నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వారు ఆయుధాలను అక్కడే వదిలి పారిపోయారు. తూటాలు దూసుకెళ్లడంతో నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. అయితే మాకెవరికీ గాయాలు కాలేదు. అల్లా దయవల్ల మేమంతా క్షేమం’’ అని అసదుద్దీన్ ట్విటర్లో వెల్లడించారు. దిల్లీ చేరుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కారుపై కాల్పులు జరిపిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు సమాచారం అందించారన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టి, దీని వెనుక ఎవరు ఉన్నారన్నది తెలుసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆయన విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర దర్యాప్తు బాధ్యత మోదీ, యోగి ప్రభుత్వాలదేనన్నారు. ఈ అంశంపై తాను లోక్సభ స్పీకర్ను శుక్రవారం కలవనున్నట్టు చెప్పారు.
మాజిద్ హుస్సేన్ చొరవ...
అసదుద్దీన్ కాన్వాయ్లో వెనుక కారులో ఉన్న హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ కాల్పుల సమయంలో వేగంగా స్పందించారు. ఆయన సూచనతో కారు డ్రైవరు కాల్పులు జరుపుతున్న ఓ దుండగుడిపైకి వాహనాన్ని వేగంగా ఉరికించారు. దీంతో అతడి కాలికి గాయమై, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్టు చెబుతున్నారు.
ఒకరిని అరెస్టు చేశాం: అదనపు డీజీపీ
ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు యూపీ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్, హాపుర్ జిల్లా ఎస్పీ దీపక్ భుకేర్లు వెల్లడించారు. అతడి నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. పరారైన మిగతా నిందితులు ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.
నాపై పెద్ద కుట్ర జరిగింది: ఒవైసీ
ఘటన నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ గురువారం రాత్రి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘నాపై పెద్ద కుట్ర జరిగింది. అయినప్పటికీ, అల్లా దయతో క్షేమంగా బయటపడ్డా. ప్రజలు, మజ్లిస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ప్రజలు... తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా ఉండాలి. నాపై జరిగిన దాడికి కారకులెవరన్నది తేల్చాల్సిన బాధ్యత యూపీ, కేంద్ర ప్రభుత్వాలపైనే ఉంది. కాల్పుల తీరును చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగినట్టు అర్థమవుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఒవైసీపై దాడి జరిగిందన్న వార్త తెలియగానే హైదరాబాద్లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం వద్దకు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
* అసదుద్దీన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయనపై కాల్పులు జరపడం పిరికి చర్యగా పేర్కొన్నారు. అసద్ సురక్షితంగా బయటపడడంపై సంతోషం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్