Gas Rate: బండ బాదుడు!
వినియోగదారులకు ఊపిరాడనివ్వకుండా చేస్తూ మరోసారి ఎల్పీజీ వంటగ్యాస్ ధరతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలనూ బుధవారం పెంచేశారు. సిలిండర్పై మరో రూ. 15 భారం మోపారు. లీటరు పెట్రోలుపై మరో 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర గత జులై నుంచి ఇంతవరకు 4 దఫాలుగా మొత్తం రూ. 90 పెంచడం గమనార్హం. తాజాగా దిల్లీ, ముంబయి నగరాల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 899.50కి చేరగా కోల్కతాలో రూ. 926కి పెరిగింది. హైదరాబాద్లో రూ.952కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుండటంతో చాలా నగరాల్లో ‘రాయితీ’ గాల్లో కలిసిపోయింది.
వంటగ్యాస్ సిలిండర్పై మరో రూ. 15 పెంపు
పెట్రోలు, డీజిల్ ధరలూ పైపైకి..
దిల్లీ, ఈనాడు, హైదరాబాద్: వినియోగదారులకు ఊపిరాడనివ్వకుండా చేస్తూ మరోసారి ఎల్పీజీ వంటగ్యాస్ ధరతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలనూ బుధవారం పెంచేశారు. సిలిండర్పై మరో రూ. 15 భారం మోపారు. లీటరు పెట్రోలుపై మరో 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర గత జులై నుంచి ఇంతవరకు 4 దఫాలుగా మొత్తం రూ. 90 పెంచడం గమనార్హం. తాజాగా దిల్లీ, ముంబయి నగరాల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 899.50కి చేరగా కోల్కతాలో రూ. 926కి పెరిగింది. హైదరాబాద్లో రూ.952కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుండటంతో చాలా నగరాల్లో ‘రాయితీ’ గాల్లో కలిసిపోయింది.
5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 502కి చేరింది. ఈ ఏడాది జులైలో వంటగ్యాస్ సిలిండర్పై రూ. 25.50 పెంచారు. అనంతరం ఆగస్టు 17, సెప్టెంబరు 1 తేదీల్లో రూ. 25 చొప్పున పెరిగింది. తాజాగా మళ్లీ పెంచడంతో వినియోగదారులపై మోయలేని భారంగా మారింది. రాయితీ, రాయితీయేతర సిలిండర్లపైనా తాజాగా ధర పెంచారు.
గరిష్ఠ స్థాయికి ‘పెట్రో’ ధరలు
అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల గరిష్ఠస్థాయికి చేరాయి. తాజా పెంపుతో లీటరు పెట్రోలు ధర దిల్లీలో రూ. 102.94కి, ముంబయిలో రూ. 108.96కి పెరిగింది. లీటరు డీజిల్ ధర ఈ నగరాల్లో వరుసగా రూ. 91.42, రూ. 99.17కి చేరింది. సెప్టెంబరు 24 నుంచి ఇంతవరకు డీజిల్పై మొత్తం రూ. 2.80 (లీటరుకు) పెరిగింది. అలాగే సెప్టెంబరు 28 నుంచి ఇంతవరకు పెట్రోల్పై మొత్తం రూ. 1.75 పెంచారు.
రూ. వేల కోట్లలో భారం
హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై బుధవారం 29 పైసలు పెరిగి రూ. 107.09కి, డీజిల్పై 38 పైసలు పెరిగి రూ.99.75కి చేరుకుంది. రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో డీజిల్ ధర లీటరు రూ.వంద దాటింది. గడిచిన వారం రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరిగాయి. గతంలో నెలకు ఒకదఫా మాత్రమే ధరలో పెంపుదల ఉండేది. 2017 జూన్ ఆరో తేదీ నుంచి రోజువారీగా ధరల మార్పు విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లకు పైగా ఈ విధానమే అమలులో ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా బుధవారం 107.09కు చేరింది. లీటరు డీజిల్ ధర రూ 80.60లు ఉండగా క్రమంగా పెరుగుతూ బుధవారం రూ. 99.75లకు చేరింది. ఆ లెక్కన గడిచిన 9 నెలల్లో హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై రూ. 20.03 పెరిగింది. డీజిల్పై రూ. 19.15 పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలుపై సుమారు 59 శాతం, డీజిల్పై సుమారు 52 శాతం పన్నులు వసూలు చేస్తున్నాయి. రోజూ కొన్ని పైసల చొప్పున ధర పెంచుతుండటంతో భారం అంతగా తెలియనప్పటికీ జనవరి నుంచి చూస్తే రూ. వేల కోట్లలో చేతి చమురు వదిలిందన్నది వాస్తవం.
త్వరలో సబ్సిడీకి మంగళం?
వంట గ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే... అది కూడా నామమాత్రంగా రూ. 40.71 సబ్సిడీ ఇస్తోంది. ఏడాదికిపైగా ఇదే మొత్తం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఆ మొత్తానికి కూడా మంగళం పాడేందుకు రంగం సిద్ధం అవుతోంది. దీనిపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ యోచన చేస్తోందని ఉన్నతాధికారి ఒకరు బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఆ ప్రతిపాదన ఎప్పటికి కార్యరూపంలోకి వస్తుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
9 నెలల్లో రూ. 205 పెంపు
గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లపై తొమ్మిది నెలల్లో రూ. 205.50 పెంచారు. తాజాగా సిలిండరుపై రూ. 15 పెంచటంతో హైదరాబాద్లో ధర రూ.952లకు చేరుకుంది. వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరుపై రూ.33 పెంచటంతో ఆ ధర రూ.1,905కు పెరిగింది. రాష్ట్రంలో సుమారుగా 1.15 కోట్ల గృహావసరాల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున 65 నుంచి 70 శాతం వినియోగదారులు ప్రతి నెలా సిలిండరును కొనుగోలు చేస్తారు.
ధరలు తగ్గించండి ఉయ్యాలో..
బతుకమ్మల మధ్య ఈ గ్యాస్ బండేమిటనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం బుధవారం వంటగ్యాస్ ధర పెంచడంతో నిరసన తెలపడానికి హుజూరాబాద్ మహిళలు ఈ మార్గం ఎంచుకున్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా పాటపాడుతూ అక్కడి శివాలయంలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ధరలు తగ్గించాలని విన్నవించారు.
-న్యూస్టుడే, హుజూరాబాద్ గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ