Health: ముప్పు ‘మద్య’ ఉన్నట్టే
మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని మరోసారి వెల్లడైంది. మద్యపానంతో కాలేయమే కాదు.. నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందని తాజాగా ‘ఆక్స్ఫర్డ్’ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం
మద్యంతో కాలేయంతో పాటు ఇతర అవయవాలకూ క్యాన్సర్ సోకే ప్రమాదం
ధూమపానం కూడా తోడైతే మరింత హెచ్చు
ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని మరోసారి వెల్లడైంది. మద్యపానంతో కాలేయమే కాదు.. నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందని తాజాగా ‘ఆక్స్ఫర్డ్’ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. దీనికి ధూమపానం వంటి దురలవాట్లు, జీవనశైలి అవలక్షణాలు కూడా జతకూడితే ముప్పు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా మద్యం కారణంగా ఏటా 30 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ‘ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్’ అధ్యయనం తెలిపింది. ఇందులో 4 లక్షలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. 1.50 లక్షలమంది చైనీయులపై ఈ అధ్యయనం చేశారు. ఇందులో 60 వేల మంది పురుషులు, 90 వేలమంది మహిళలు ఉన్నారు. 11 ఏళ్ల పాటు వీరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఈ అధ్యయన ఫలితాలు ఇటీవలే ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమయ్యాయి. పాశ్చాత్య దేశాలతో పోల్చితే.. ఆసియా ఖండంలోని జనాభాలో జన్యుపరమైన మార్పులున్నాయనీ, అందుకే ఆసియన్లలో మద్యం కారక ముప్పు ఎక్కువేనని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్ కోరల్లో చిక్కుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఏటా 1000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశవ్యాప్తంగా 1,18,044 క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 64,620 మంది మృత్యువాతపడ్డారు. భారత్లో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్లలో.. పురుషుల్లో 6 శాతం.. మహిళల్లో 0.5-1 శాతం వరకూ మద్యం కారణంగా సంభవిస్తున్నవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఎలా ప్రమాదకరంగా మారుతోంది?
మద్యం శరీరం లోనికి వెళ్లగానే.. జీవక్రియలో భాగంగా అది విచ్ఛినమై, ‘ఎసిటేల్ డీహైడ్’గా ఉత్పరివర్తనం చెందుతుంది. తద్వారా అతి ప్రమాదకర ‘కార్సినోజెనిక్’ రసాయనాలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా అనేక రకాల అవయవాలపై దాని ప్రభావం పడి నేరుగా క్యాన్సర్కు దారితీస్తుంది. పైగా మద్యపాన ప్రియుల్లో అత్యధికుల్లో అనుబంధంగా జీవనశైలి దురలవాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ధూమపానం, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం తదితరాలు. ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యకరమైన పోషక విలువలను శరీరం గ్రహించే తత్వం కోల్పోతుంది. దీనివల్ల కూడా క్యాన్సర్ త్వరగా రావడానికి అవకాశాలెక్కువ ఉంటాయి.
తక్కువ తీసుకున్నా ముప్పు ఎక్కువే
మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. చాలామందిలో మద్యం ఎంత తీసుకుంటే మంచిది? అనే సందేహం ఉంటుంది. నిజానికి కొద్ది మోతాదులో తీసుకున్నా ముప్పే. తీసుకోకపోవడమే మంచిది. మద్యం ఎక్కువగా తీసుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా రొమ్ము క్యాన్సర్కు దారితీస్తుంది.
- డాక్టర్ సెంథిల్ రాజప్ప, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి
ఆసియన్లకు మద్యాన్ని తట్టుకునే శక్తి తక్కువ
పాశ్చాత్యదేశాలతో పోల్చితే ఆసియన్లకు మద్యాన్ని తట్టుకునే శక్తి తక్కువ అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్లో గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే క్యాన్సర్లు ఇప్పుడు 30 ఏళ్లలోనే కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల కంటే తక్కువ మోతాదులోనే మద్యాన్ని తీసుకున్నా భారత్లో క్యాన్సర్ల బారినపడే వారి సంఖ్య ఎక్కువ. ఇందుకు జన్యుపరమైన కారణాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. మద్యం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పన్నమై, మన డీఎన్ఏపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. హెపటైటిస్ బి, సి వైరస్ వ్యాధులతో బాధపడుతున్నవారు మద్యం తీసుకుంటే చాలా త్వరగా కాలేయ క్యాన్సర్ బారినపడే ప్రమాదముంది.
- డాక్టర్ రాజేశ్గుప్తా, సీనియర్ హెపటాలజిస్ట్, ఏఐజీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ