Hyderabad Rains: మేఘం మళ్లీ ముంచేసింది
భీకర శబ్దాలు, కుండపోత వానతో శనివారం హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. వరసగా రెండో రోజూ జడివాన నగరాన్ని ముంచెత్తింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేర్వేరు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. కేవలం నాలుగు ...
రెండో రోజూ గ్రేటర్లో కుండపోత
జలదిగ్బంధంలో వందలాది కాలనీలు
జంట జలాశయాల గేట్ల ఎత్తివేత
ఆదిలాబాద్ జిల్లాలో నలుగురి మృతి
సికింద్రాబాద్లో 9.5 సెం.మీ.
ఈనాడు, హైదరాబాద్: భీకర శబ్దాలు, కుండపోత వానతో శనివారం హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. వరసగా రెండో రోజూ జడివాన నగరాన్ని ముంచెత్తింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేర్వేరు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య అయితే మరీ నిర్దయగా దంచికొట్టింది. యూసుఫ్గూడ, కూకట్పల్లిలోని రెండు భవనాలపై పిడుగులు పడ్డాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దిల్సుఖ్నగర్లోని శివగంగ థియేటర్లోకి వరద చొచ్చుకెళ్లింది. ప్రవాహ తీవ్రతకు ప్రహరీ కూలింది. ప్రేక్షకుల ద్విచక్ర వాహనాలు 50 వరకు దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్ మైలార్గడ్డ ప్రాంతంలో శిథిల భవనం నేలకూలింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో జలమండలి అధికారులు జంట జలాశయాల గేట్లు తెరిచారు. మూసీకి వరద నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చెరువులు, నాలాలు ఉప్పొంగి పొర్లడంతో హయత్నగర్, వనస్థలిపురం, చంపాపేట, సరూర్నగర్ డివిజన్లలోని చాలా కాలనీలు నీటమునిగాయి. బాధితులను జీహెచ్ఎంసీ పునరావాస కేంద్రాలకు తరలించింది. మూసీ వరద ముప్పున్న ప్రాంతాల్లోనూ బల్దియా, పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. గ్రేటర్ వ్యాప్తంగా వందలాది కాలనీలు 48 గంటలుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. హబ్సిగూడ, వనస్థలిపురం, అస్మాన్గఢ్, చాంద్రాయణగుట్ట, జంగంమెట్ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. రాత్రి 10 వరకు చాలా రహదారులపై వాహనాలు బారులు తీరి కనిపించాయి. ఎల్బీనగర్ కూడలి నుంచి మలక్పేట వరకు, సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వరకు, కూకట్పల్లి, ఖైరతాబాద్ తదితర అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
వివిధ ప్రాంతాల్లో వర్షపాతం..
శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద 9.5, బేగంపేట విమానాశ్రయం వద్ద 8.6, ఫిరోజ్గూడలో 7.1, పాటిగడ్డలో 7, తిరుమలగిరిలో 5.8, వెస్ట్ మారేడ్పల్లిలో 5, ఎల్బీనగర్లో 4.6, బజార్హత్నూర్(ఆదిలాబాద్)లో 4.7, గోవిందరావుపేట(ములుగు)లో 4.3 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా సరూర్నగర్(హైదరాబాద్)లో 15, అమీర్పేట(రంగారెడ్డి జిల్లా)లో 14.6, నందిగామ(రంగారెడ్డి)లో 13.3 సెం.మీ. కురిసింది.
పిడుగుల వాన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షంతో పాటు భారీగా పిడుగులు పడ్డాయి. తాంసి మండలం బండల్నాగపూర్ శివారులో పత్తి ఏరడానికి వచ్చిన మహారాష్ట్ర భవానిపూర్కు చెందిన బాలిక దీపాళి(13) పిడుగుపాటుకు కన్నుమూసింది. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఓ ఎద్దు మృత్యువాత పడింది.
* బజార్హత్నూర్ మండలం బుర్కపల్లిలో వ్యవసాయ పనులకు వెళ్లిన బనియా గరన్ సింగ్(48), అతడి తమ్ముడి భార్య ఆశాబాయి(28) పిడుగుపాటుకు మృతిచెందారు. కుమురం భీం జిల్లా జైనూర్ మండలం గూడామామడా గ్రామంలో శనివారం మధ్యాహ్నం పిడుగుపడి రైతు మెట్కర్ గణపతి(35) మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపల్లి శివారులో పిడుగుపడి రెండు గొర్రెలు, ఒక మేక మృత్యువాత పడ్డాయి.
రేపటిలోగా అల్పపీడనం...
బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు ఉత్తర ప్రాంతం వద్ద గాలులతో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సోమవారంలోగా అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి.. అది తీవ్రమై నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరం వైపు వెళ్లవచ్చని అంచనా. ఆది, సోమవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM