Congress Jung Siren: ఉద్రిక్తంగా కాంగ్రెస్ జంగ్ సైరన్
ఎక్కడికక్కడ అరెస్టులు... ప్రధాన మార్గాల మూసివేత.. ముఖ్య నాయకుల గృహ నిర్బంధాల మధ్య కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరుద్యోగ సమస్యలను...
రేవంత్రెడ్డి సహా ముఖ్య నేతల గృహ నిర్బంధం
వలయాలను ఛేదించుకుని ఎల్బీనగర్ చేరిన కార్యకర్తలు
లాఠీఛార్జిలో పలువురికి గాయాలు
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పీసీసీ పిలుపు
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే, జూబ్లీహిల్స్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, నాగోలు, గాంధీభవన్: ఎక్కడికక్కడ అరెస్టులు... ప్రధాన మార్గాల మూసివేత.. ముఖ్య నాయకుల గృహ నిర్బంధాల మధ్య కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ తలపెట్టింది. తొలి కార్యక్రమంగా శనివారం దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ నుంచి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వరకు ర్యాలీకి పీసీసీ పిలుపునిచ్చింది. దిల్సుఖ్నగర్ కూడలిలో భారీ బందోబస్తు కారణంగా.. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. కొత్తపేటలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను సరూర్నగర్వైపు మళ్లించారు. కాంగ్రెస్ నాయకులు మెట్రో రైళ్లలో వచ్చే అవకాశం ఉందని భావించి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ను పూర్తిగా మూసివేశారు. అయినప్పటికీ కొందరు విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధాలు, అరెస్టులు, బారికేడ్లను దాటుకుని సాయంత్రానికి భారీసంఖ్యలో కాంగ్రెస్, యూత్కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, నాయకులు ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకున్నారు. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. మల్లు రవి కిందపడ్డారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ సహా పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రేవంత్ ఇంటి వద్దా తోపులాట
గాంధీభవన్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి జూబ్లీహిల్స్లోని ఇంటికి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జంగ్ సైరన్ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకుని భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇంటి వద్దనే బైఠాయించి రేవంత్ నిరసన తెలిపారు. ఆయనకు మాజీ మంత్రి షబ్బీర్అలీ వచ్చి మద్దతు పలికారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులనూ గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్, గాంధీ విగ్రహాల ఎదుట కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మల దహనానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో దుర్మార్గ పాలన: రేవంత్రెడ్డి
రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. గృహనిర్బంధం సందర్భంగా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఏడాదికి పదివేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నా ఎందుకు భర్తీ చేయడం లేదో.. ఫీజు రీఇంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. శ్రీకాంతాచారి త్యాగ పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిని నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడిగా వర్ణించారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్, కేటీఆర్లు శత్రువులు, తీవ్రవాదులుగా భావిస్తున్నారని ఆరోపించారు. తమ తొలి అడుగును అడ్డుకున్నప్పటికీ.. మలి అడుగు పాలమూరులో వేయబోతున్నామని చెప్పారు. ఆ రోజు అడ్డుకోవాలని చూస్తే తమ తడాఖా చూపిస్తామన్నారు. గాంధీజీ స్ఫూర్తితోనే శనివారం మౌనంగా ఉన్నామన్నారు.
* పోలీసుల తీరును నిరసిస్తూ ఎల్బీనగర్ వద్ద మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మాచిరాజుపల్లికి చెందిన విద్యార్థి దిల్లీ కల్యాణ్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కార్యకర్తలు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. సరూర్నగర్ స్టేడియం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. కార్యక్రమాల్లో నేతలు మధుయాస్కీ, సంపత్, దాసోజు, మహేశ్కుమార్గౌడ్, మహేశ్వర్రెడ్డి, బి.వి.శ్రీనివాస్, శివసేనారెడ్డి, రితీష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..