Telangana Budget 2022: మెట్రోకు మెరుపులు
రాష్ట్ర బడ్జెట్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.2,377 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఇంత భారీమొత్తంలో నిధులను ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. ఏటా రూ.200-500 కోట్లనే కేటాయించేవారు. 2021-22 బడ్జెట్లో రూ.1,000 కోట్లను ప్రతిపాదించినా..
మొత్తం రూ.2,377 కోట్ల కేటాయింపు
పాతబస్తీతో అనుసంధానానికి రూ.500 కోట్లు
రాయదుర్గం-శంషాబాద్ మార్గానికి రూ.377 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.2,377 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఇంత భారీమొత్తంలో నిధులను ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. ఏటా రూ.200-500 కోట్లనే కేటాయించేవారు. 2021-22 బడ్జెట్లో రూ.1,000 కోట్లను ప్రతిపాదించినా.. రూ.200 కోట్లకు మించి మంజూరు చేయలేదు. తాజా బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లతో పాటు అదనంగా పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు, రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిపాదిత 31 కి.మీ. ఎక్స్ప్రెస్ మెట్రోకు రూ.377.35 కోట్లుగా కేటాయించారు.
పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మిగిలిపోయిన 5.5 కి.మీ. మెట్రో మార్గాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. వారసత్వ కట్టడాలు, ప్రార్థనా స్థలాలతో అవాంతరాలు చోటుచేసుకున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకునేందుకే!
కొవిడ్ కారణంగా మెట్రో రైలు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయింది. నష్టాలు రూ.2 వేల కోట్లను దాటాయి. 2022-23 బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లను ప్రతిపాదించారు. ఈ మొత్తం ఎల్ అండ్ టీని ఆదుకునేందుకేనన్న ప్రచారం ఉంది. నిధుల కేటాయింపుపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా