చౌక ధరలో కరోనా మందు బిళ్ల!
దేశంలో కరోనా రోగులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత, అధిక ధరలు, మరోవైపు నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో రెమ్డెసివిర్కు ప్రత్యామ్నాయంగా మందు బిళ్ల రూపంలో ఉండే చౌకైన ఔషధం కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వచ్చే
రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ప్రత్యామ్నాయం
3-6 నెలల్లో అందుబాటులోకి
గాలి నుంచి ఆక్సిజన్ సేకరించే వెంటిలేటర్ సాంకేతికత నెలలో సిద్ధం
‘ఈనాడు ముఖాముఖి’లో ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
దేశంలో కరోనా రోగులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత, అధిక ధరలు, మరోవైపు నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో రెమ్డెసివిర్కు ప్రత్యామ్నాయంగా మందు బిళ్ల రూపంలో ఉండే చౌకైన ఔషధం కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. గాలి నుంచి ఆక్సిజన్ సేకరించే వెంటిలేటర్ల సాంకేతికత సిద్ధమవుతోందన్నారు. ఇంకా వైద్యుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ మాస్క్ తయారీతో పాటు కరోనా నిరోధానికి ఐఐసీటీ చేపట్టిన వివిధ పరిశోధనలు, వాటి ప్రయోజనాలపై మంగళవారం ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో తొలిసారి వివరించారు.
రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో లేదు. దీనికి ప్రత్యామ్నాయం లేదా?
కరోనా చికిత్సలో రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ప్రత్యామ్నాయంగా మందుబిళ్ల రూపంలో ఔషధం తయారీకి అమెరికా సంస్థ మెర్క్ ఒక ఫార్ములా రూపొందించింది. దీనిని ఉపయోగించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ)-తిరువనంతపురం ఓ ఔషధాన్ని తయారు చేస్తోంది. దీనిని అతి తక్కువ ధరకు దేశం అంతటా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫేజ్ 2 పరిశోధన జరుగుతోంది. ఆ తరువాత దశ పరిశోధనలు పూర్తయి అమెరికా నుంచి అనుమతి లభిస్తే మూడు లేక ఆరు నెలల్లో ఈ మందు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
గాలి నుంచి ఆక్సిజన్ సేకరించి అందించే వెంటిలేటర్ మాస్క్లపై దృష్టిపెట్టారు. ఈ ప్రయోగం ఎంతవరకు వచ్చింది?
గాలి నుంచి ఆక్సిజన్ను సేకరించి శుద్ధి చేసి రోగికి అందించే వెంటిలేటర్ల తయారీపై దెహ్రాదూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ సంస్థ, చంఢీగఢ్లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ కలిసి దృష్టిపెట్టాయి. ఈ ప్రయోగంలో ఐఐసీటీ కూడా భాగమైంది. నెల రోజుల్లో ఈ టెక్నాలజీ సిద్ధమవుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలానే రెడ్డీస్ పౌండేషన్ ఆర్థిక సహాయంతో సరికొత్త మాస్క్ టెక్నాలజీని రూపొందించాం. ఈ మాస్క్ మల్టీలేయర్గా ఉంటుంది. దీనిపై ప్రతేకంగా తయారు చేసిన కెమికల్ వాడాం. మాస్క్పై కరోనా వైరస్ పడితే ఈ కెమికల్ వెంటనే నాశనం చేస్తుంది. 90 సార్లు ఈ మాస్క్ను ఉతికి ఉపయోగించవచ్చు. వివిధ సంస్థలతో ఇలాంటివి లక్ష తయారుచేసి గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయించాం. ఏ సేవా సంస్థ ముందుకు వచ్చినా ఈ టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
వైద్యులకు తోడ్పాటుగా ఉండేందుకు సరికొత్త మాస్క్ల తయారీ ఎంతవరకు వచ్చింది?
రోగులకు చికిత్స అందించే క్రమంలో సాధారణ మాస్క్లతో రక్షణ లభించక అనేకమంది వైద్యులు, సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు కంపెనీతో కలిసి వైద్యుల కోసం ప్రత్యేక మాస్క్ల తయారీ టెక్నాలజీ మీద దృష్టిపెట్టాం. అనేక లేయర్లతో ఉండే ఈ మాస్క్ మధ్యలో ఆక్సిజన్ ఫిల్టర్కు చిన్న ఫ్యాన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ వ్యవస్థ గాలిలో ఆక్సిజన్ను మాస్క్ లోపలికి పంపిస్తుంది. దీంతో ఇది ధరించినవారికి ఆక్సిజన్ సులభంగా అందుతుంది. వారం రోజుల్లో ఈ టెక్నాలజీ సిద్ధమవుతుంది.
కరోనా వ్యాక్సిన్ల రూపకల్పనలో భారత్బయోటెక్, సీరం సంస్థలకు ఐఐసీటీ ఎలాంటి తోడ్పాటు అందించింది?
భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ ప్రభావాన్ని పెంచేందుకు ఓ సహాయ ఔషధ (అడ్జువెంట్) సాంకేతికతను రూపొందించి అందజేశాం. భారత్బయోటెక్ ఈ టెక్నాలజీని రెండు సంస్థలకు అందజేసి వాటి నుంచి ఆ రసాయనాన్ని పొందుతోంది. దీనిని వ్యాక్సిన్లో కలపడం వల్ల దాని ప్రభావం చాలా రోజులు ఉంటుంది. కొవిషీల్డ్ టీకా తయారు చేస్తున్న సీరం సంస్థ ఇదే కెమికల్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. సీరం సంస్థ కోరితే ఈ టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ఏ రకంగా తోడ్పాటు కావాలన్నా అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ