KCR Press Meet: ఎ‘వరి’ది దగా..?
‘‘భాజపా నేతలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతుల బతుకులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని అంటూ రైతులు తమ పొలంలోనే కూలీలుగా బతకాలా? అని ప్రశ్నించారు. రైతుల కోసం పార్లమెంటు దద్దరిల్లేలా చేస్తామని, ధాన్యం కొనుగోలులో రాష్ట్రం కోటా కోసం ధర్నా చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తనతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు, దిల్లీలో ధర్నా చేస్తామని వెల్లడించారు. వేలాదిమందితో వెళ్తామని, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు. పంజాబ్లో నూరుశాతం ధాన్యం సేకరణ చేసి, తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు.
ధాన్యంపై కేంద్ర వైఖరి ఒకటి... రాష్ట్ర భాజపా నేతలు చెప్పేది మరొకటి
కేంద్రమే వద్దంటే దాన్ని పండించాలంటున్నారు
అవసరమైతే దిల్లీలో ధర్నా.. నేను కూడా వెళ్తా
రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించే వరకు ఊరుకోం
చమురు ధరలపై కేంద్రమే సెస్సులు రద్దు చేయాలి
వ్యాట్ మేం పైసా పెంచలేదు.. ఎలా తగ్గించమంటారు?
బండి సంజయ్ పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తాం
కేసీఆర్ను టచ్ చేసి... బతికి బట్టకడతారా?
కేంద్రం, భాజపా నేతలపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
ఈనాడు - హైదరాబాద్
ధాన్యం కొనుగోలు చేయవద్దని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను చూపుతున్న సీఎం కేసీఆర్
కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించేవరకు పోరాడతాం. పెట్రోలు, డీజిల్ సెస్లు విరమించుకోవాలి. మిమ్మల్ని పండుకోనివ్వం, నిలబడనివ్వం. వానాకాలం పంట తీసుకునేవరకు నిద్రపోనివ్వం. ఎవరి మెడలు వంచాలో ప్రజల ముందు పెడదాం. తెలంగాణ హక్కులు, దేశప్రయోజనాల కోసం కేంద్రంతో నిరంతరం పోరాడతాం.
బండి సంజయ్ చాలా రోజులుగా అతిగా మాట్లాడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా నిందిస్తున్నారు. నా స్థాయి కాదు కాబట్టే నేను పట్టించుకోలేదు. ఇన్నిరోజులు ఓపిక పట్టాను. కేసీఆర్ను జైలుకు పంపిస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను జైలుకి పంపి నువ్వు బతికి బట్టకడతావా?.. కేసీఆర్ను టచ్ చేసి చూడు తెలుస్తుంది. అంత అహంకారమా? సంజయ్ కళ్లు నెత్తికెక్కి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? ఇకపై మీ ఆటలు సాగవు.
‘‘భాజపా నేతలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతుల బతుకులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని అంటూ రైతులు తమ పొలంలోనే కూలీలుగా బతకాలా? అని ప్రశ్నించారు. రైతుల కోసం పార్లమెంటు దద్దరిల్లేలా చేస్తామని, ధాన్యం కొనుగోలులో రాష్ట్రం కోటా కోసం ధర్నా చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తనతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు, దిల్లీలో ధర్నా చేస్తామని వెల్లడించారు. వేలాదిమందితో వెళ్తామని, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు. పంజాబ్లో నూరుశాతం ధాన్యం సేకరణ చేసి, తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. కేంద్రం ఏ ఆదేశాలు ఇస్తుందో మరోవారం చూస్తామని చెప్పారు. దేశంలో రాజకీయ మార్పు కోసం అగ్గిపెడతామని, ఎక్కడ పెట్టాలో తమకు తెలుసని అన్నారు. ఆదివారం ఆయన మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘పెట్రోలు, డీజిల్తో ధరలు, ఖర్చులు భారీగా పెరిగాయి. పేదల జేబులు కొట్టారు. ఇకనుంచి క్షమించం. పెట్రోలు, డీజిల్పై కొండంత పెంచి పిసరంత తగ్గించారు. దేశవ్యాప్తంగా ఉపఎన్నికల్లో భాజపాను ప్రజలు తిరస్కరించారనే భయంతో కేంద్రం పెట్రోలుపై రూ.5, డీజిల్పై రూ.10 తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయని కేంద్రం అసత్యాలు చెప్పి. గత ఏడేళ్లలో పెట్రో ధరలు అమాంతం పెంచేసింది. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై రూపాయి కూడా వ్యాట్ పెంచలేదు. మమ్మల్ని ఎలా తగ్గించమంటారు? కేంద్రం రాష్ట్రాలకు వాటా దక్కనీయరాదనే కుట్రతో పెట్రోలు, డీజిల్పై పన్నులను రద్దు చేసి, సెస్సులను విధించింది. వాటిని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై కేంద్రంతో పోరాటమే. ఉత్తరాది రైతులకు మద్దతుగా ఉద్యమిస్తాం. కేంద్రాన్ని నిద్ర పోనీయం.
రాష్ట్రాలు తగ్గించాలని ధర్నాలా?
పెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్రం అబద్ధం చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఏడేళ్లలో గరిష్ఠంగా 105 డాలర్లు దాటలేదు. పన్ను రూపంలో వసూలు చేస్తే రాష్టాలకు 41 శాతం వాటా ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్రాల నోరుకట్టి సెస్ అని చెప్పింది. ప్రజల మీద భారం వేయడం, అబద్ధాలు చెప్పడం పచ్చిమోసం. ఇటీవల ఉప ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టారని కంటితుడుపుగా తగ్గించి ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలని ధర్నాలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో బాధ్యత విస్మరిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని రైతులు వరి మాత్రమే పండించాలని, మెడలు వంచి కొనిపిస్తామని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓవైపు.. కొనబోమని కేంద్రం లేఖలు ఇస్తుంటే.. ఇక్కడి నాయకుడేమో పండించాలని రైతులను అయోమయంలో పడేస్తున్నారు. ఆయన మాటలు నమ్మి వరి వేస్తే రైతులు దెబ్బతింటారు. ఈ ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పలేదు. బాయిల్డ్ రైస్ కొనేదిలేదని కేంద్రం చెప్పింది. అడ్డందిడ్డం మాట్లాడేవారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు. బండి సంజయ్కి దమ్ముంటే వారం రోజుల్లో 1.5 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకుని రావాలి. నేను, మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి రాష్ట్రం మొత్తం వరి పండించేలా చూస్తాం. తెలంగాణలో వరి వేయద్దని దిల్లీ భాజపా చెబుతుంటే.. ఇక్కడి సిల్లీ భాజపా వేయాలంటోంది. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించబోం. వారిని గందరగోళానికి గురి చేస్తే సంజయ్ ఆట కట్టిస్తాం. ఒకవైపు పంజాబ్లో ధాన్యం కొంటామని చెబుతున్న కేంద్రం, తెలంగాణలో సేకరణ చేయకపోవడం దారుణం. కేంద్రం రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోంది.
దిల్లీ చుట్టూ తిరిగినా...
కేంద్రం ధాన్యం తీసుకోబోమని మెలికలు తిరుగుతోంది. మంత్రులు, అధికారులు దిల్లీకి వెళ్లి ఒప్పించి, ఎఫ్సీఐతో ఎంవోయూ చేసుకున్నా నిరాకరిస్తోంది. రాష్ట్రాలు నిల్వ చేయలేవు. ఎగుమతి చేసే అధికారం లేదు. అన్నిటికీ కేంద్రం వద్దకు వెళ్లాలి. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రంపై ఉంది. నెల క్రితం నేనే స్వయంగా దిల్లీకి వెళ్లి ఆశాఖ మంత్రితో మాట్లాడా. ఎంవోయూ తిరస్కరించడం మంచిది కాదని చెప్పా. కనీసం ఈ ఏడాది ఎంత కొంటారో అంతేవేసి మిగతాది పంట మార్పిడి చేస్తామని చెప్పినా. తొలుత పంట మార్పిడి చేయండి అని చెప్పి తప్పుకొన్నారు. తెలంగాణలో యాసంగి పంట బాయిల్డ్ రైస్. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకోనంటోంది. తొలుత 50 లక్షల టన్నుల బాయిల్డ్రైస్ కొనుగోలుకు లేఖ ఇచ్చి, 24 లక్షల టన్నులు తీసుకుంది. మిగతావి తీసుకోబోమని చెబుతున్నారు. దిల్లీ వెళ్లి మిగతా ధాన్యం పరిస్థితి ఏమిటని అడిగితే.. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాతపూర్వకంగా రాసివ్వాలని అడిగారు. బలవంతం మీద లెటర్ రాసిచ్చాం. ఇంకా 5 లక్షల టన్నుల గత యాసంగి పంట ఇంకా మిగిలింది. గత ఏడాదికి పక్కన పెడితే ఈ ఏడాదికి ఎంత ఇస్తారో చెప్పాలంటే, తరువాత మాట్లాడుతామన్నారు. ఇక్కడే ఉండి మాట్లాడతానంటే.. మరుసటిరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంత తీసుకుంటారని అడిగితే.. ఇప్పటికీ ఎంత తీసుకుంటారో చెప్పలేదు. రాష్ట్రంలో రైతులు వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి వేశారు. కోతలు మొదలయ్యాయి. వానాకాలం పంటే 1.7 కోటి టన్నుల వడ్లు.. బియ్యంగా మార్చితే 1.10 కోట్ల టన్నుల రైస్ రెడీగా ఉంది. దీన్ని తీసుకునే దిక్కులేదు. కేంద్రమంత్రి రెండురోజుల్లో చెబుతానని చెప్పలేదు. రైతుల బతుకు ఆగం చేసేందుకు వరి పండించాలంటున్నారు. ధాన్యం తీసుకుని రైతులు రోడ్లపై ధర్నాలు చేయాలి. నీ రాజకీయ పబ్బం గడవాలా? ఈ మాటలు విని వరి వేస్తే దెబ్బతింటం. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. రాష్ట్రంలో రైతులను ఏడేళ్లుగా కాపాడింది ఎవరో తెలుసు. వానాకాలం పంట తీసుకుంటారో లేదో తెలియకున్నా కొనుగోళ్లు ప్రారంభించాం. దిల్లీలో ధాన్యం కొనరు. కానీ యాసంగిలో వరి వేయమంటారు. ఇది మోసం కాదా?
దేశాన్ని సాకుతున్నాం...
దేశాన్ని సాకుతున్నది తెలంగాణ. మేం ఇచ్చే డబ్బుమీద దిల్లీ నడుస్తోంది. కేంద్రం నుంచి గడిచిన ఏడేళ్లలో రూ. 42వేల కోట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధిహామీ, జాతీయ హెల్త్మిషన్, సర్వశిక్ష అభయాన్ కింద నిధులు వస్తాయి. మిగతా ఒక్క రూపాయి ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. కానీ మంత్రుల మీద, సీఎంల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
అడుగడుగునా తరిమికొడతాం...
గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. భాజపా ఎంపీలు చేసిన ఒక్క మంచిపని అయినా ఉన్నదా? కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి రూ. 10 పని చేశారా? కేంద్రం నుంచి ఏమీ చేయకుండా మెడలు విరుస్తామంటూ పిచ్చికూతలు కూస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదు. అడుగడుగునా తరిమికొడతాం. మీ చిల్లర రాజకీయాల కోసం రైతుల బతుకులు నాశనం చేస్తే కేసీఆర్ ఊరుకోరు. నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం అంటే కుదరదు. ఏ విచారణ చేస్తారో మేం సిద్ధం. మేం ఉద్యమాలు చేసినవాళ్లం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సినవి చేయకున్నా సహకరిస్తున్నాం. అయినా దిగజారి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర అధ్యక్షుడు లేఖ ఇచ్చారని అప్పటి మంత్రి జావడేకర్ స్వయంగా చెప్పారు’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
రాజకీయాలు అన్నాక గెలుస్తాం. ఓడతాం.. ఎన్నిక వస్తది.. పోతది. ఉత్తమ్ నియోజకవర్గంలో గెలవలేదా? సాగర్ ఎన్నికల్లో మీకు (భాజపా) డిపాజిట్ కూడా రాలేదు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మీరు ఓడిపోయారు. అంటే దేశంలో మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లా?
ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకువచ్చినోళ్లం. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం. తెలంగాణకు ఒక గమ్యం, లక్ష్యం ఉన్నాయి. అక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. దేశంలో ఎక్కడైనా దళితబంధు అమలు చేశారా? కనీసం మీ రాష్ట్రాల్లో రూ. 2,000 పింఛను ఇచ్చే ముఖం ఉందా?
తెలంగాణ పెట్రోలు, డీజిల్ ధరలు రూపాయి కూడా పెంచలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకున్నా పెరిగాయంటూ కేంద్రం అబద్ధాలు చెప్పి సెస్ రూపంలో ధరలు పెంచింది. రాష్ట్రాలకు అన్యాయం చేసింది. పెట్రోలు ధరలు పెంచినవారే తగ్గించాలి.
శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా చెప్పా. రైతులు ఏ పంటలు వేయాలో నవంబరులో ప్రకటిస్తామన్నాం. రైతులు వరి వేస్తే నష్టపోతారని, ఏ పంటలు వేస్తే బాగుంటుందో సమీక్షించాం. నువ్వులు, ఆవాలు, పల్లీ వంటివి వరికన్నా లాభం వచ్చే పంటలు. రైతులు నష్టపోకూడదని, వారిని కాపాడుకోవాలని ఇతర పంటలు వేయాలని చెప్పాం.
ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటున్న బండి సంజయ్ దమ్ముంటే నా మీద కేసు పెట్టాలి. కేంద్రం నుంచి వచ్చే జీవోలు వీరికి అర్థం కావు. కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి రాష్ట్రానికి ఏం చేశారు? భాజపా నేతలకు చిన్నాపెద్దా ఏమీ లేదా? ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఏడేళ్లలో కేంద్రం చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? కిషన్రెడ్డి కేంద్రమంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలి. నేను కూడా కేంద్రమంత్రిగా చేశా.. హుజూరాబాద్లో కిషన్రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయా?
* మిమ్మల్ని ఇప్పటి వరకు క్షమించాం- ఇక నుంచి క్షమించం. మీ చరిత్ర అంతా ప్రజలకు తేటతెల్లం చేస్తాం
* రైతులను ముంచి ఓట్లు డబ్బాలో వేసుకోవాలనేది భాజపా పన్నాగం. దాన్ని నడవనివ్వను. భాజపా.. బీకేర్ఫుల్
* తెలంగాణకు నీళ్లు వద్దా? కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు డ్రామాలేమిటి? కేంద్రమంత్రి షెకావత్ ఇచ్చిన మాట ప్రకారం ట్రైబ్యునల్కు ఎందుకు పంపరు?
* నేను కష్టపడి తెలంగాణ తెచ్చాను. అల్లాటప్పాగాళ్లు దాన్ని ఆగం చేస్తుంటే ఊరుకోను.
* అరుణాచల్ప్రదేశ్లో చైనా ఊళ్లకు ఊళ్లే కడుతోంది దేశ సరిహద్దు కాపాడటంలో భాజపా విఫలమైంది.
రాష్ట్రమంతా దళితబంధు
రాష్ట్రమంతటా దళితబంధు నూరుశాం అమలు చేస్తాం. భాజపా నాయకులకు చట్టాలపై కనీస అవగాహన లేదు. ఎస్సీ, ఎస్టీలంటే భాజపాకు గౌరవం లేదు. దళిత, గిరిజనులపై అత్యాచారాల నిరోధానికి తెచ్చిన చట్టాన్ని ఒకాయన పనికిరాని చట్టం అని అన్నాడు. మీ ఏడేళ్ల పరిపాలనలో ఒక్క మంచిపని ఉందా? దళితులు, గిరిజనులు, బీసీలు, రైతులు, నిరుద్యోగులకు ఏం చేశారు? రూ. 15 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? ఏ మాటపై భాజపా నిలబడింది? సందర్భం వచ్చినపుడు భావోద్వేగాలు రెచ్చగొడతారు. అంతర్జాతీయ, మతరపమైన ఉద్వేగాలు సృష్టిస్తారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కన్నా జీడీపీ తక్కువగా ఉంది. చేతగాక, చేయలేక అడ్డగోలు పరిపాలనతో ఈ పరిస్థితి తీసుకువచ్చారు. ఏడేళ్లలో రూ. 70-80 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఓవైపు సరిహద్దులో చైనా గ్రామాలు నిర్మిస్తోంది. ఎల్ఐసీని ఎందుకు ప్రైవేటీకరిస్తారు? కొవిడ్ టైమ్లో గంగానదిలో శవాలు తేలాయి. బావుల వద్ద మీటర్లు పెట్టాలని ప్రభుత్వాలపై వత్తిడి తీసుకువస్తున్నారు. లేదంటే ఆర్ఈసీ రుణాలన్నీ బంద్ చేస్తామంటున్నారు. ఇక మేం కేంద్రంలోనూ, ఇక్కడా భాజపా వెంట పడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్