KCR: ముందస్తు యోచన లేదు
శాసనసభకు 2023 చివర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఘన విజయం సాధిస్తుందని, 98కి పైగా స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడుతుందని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేదని తెలిపారు...
ప్రభుత్వాన్నీ, పార్టీనీ పరుగులు పెట్టిస్తాం
ఈ సారీ మనదే అధికారం
హుజూరాబాద్లో గులాబీ జెండాయే
10 లక్షల మందితో విజయగర్జన
తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్ష సమావేశంలో కేసీఆర్
ఈనాడు - హైదరాబాద్
శాసనసభకు 2023 చివర్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఘన విజయం సాధిస్తుందని, 98కి పైగా స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడుతుందని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరిగితే నష్టమనే భావనతో గతంలో ముందస్తుకు వెళ్లామని, ఈసారి అలాంటి అవసరం లేదన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని తెరాస ప్రభుత్వం ఏడేళ్లలోనే సాధించి చూపిందని చెప్పారు. వచ్చే 26 నెలలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. పార్టీని, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచి కేంద్రంలోనూ క్రియాశీలకపాత్ర పోషిస్తామన్నారు. ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా నవంబరు 15న 10 లక్షల మందితో వరంగల్లో విజయగర్జన సభను నిర్వహిస్తామని.. తమపై మొరిగేవారి నోళ్లు మూయిస్తామని స్పష్టం చేశారు. ఆ సభకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్ష సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి..‘‘తెరాస ఏడేళ్ల పాలన అద్భుతంగా సాగింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెరాస.. రాజకీయ పార్టీగా లక్ష్యాలను పూర్తి చేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం ముక్తి మోర్చా పేరిట శిబుసొరేన్ ఉద్యమ సంస్థను ప్రారంభించగా.. దానికి ఆదరణ లభించలేదు. దీంతో సొరేన్ దానిని పార్టీగా మార్చి రాష్ట్రాన్ని సాధించారు. ఆ అనుభవాన్ని కరీంనగర్ సభలో ఆయన నాకు చెప్పడంతో తెరాస పంథాను మార్చాం. రాజకీయ వ్యవస్థతో గాంధేయమార్గంలో, అంబేడ్కర్ స్ఫూర్తితో శాంతియతంగా ఉద్యమించి, వ్యూహాత్మకంగా తెలంగాణ సాధించాం.
నా మదిలో ఎన్నో ఉన్నాయి
అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానాను బలోపేతం చేశాం. అన్నదాతలకు అండగా నిలిచాం. కరెంటు వెలుగులు తెచ్చాం. సంక్షేమాన్ని సంపూర్ణం చేశాం. ఎస్సీల కోసం దళితబంధు తెచ్చాం. ఈ పథకానికి వెచ్చించేది రూ. 1.70 లక్షల కోట్లే. వచ్చే ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. దాంతో అన్ని వర్గాలకు ఆదరువవుతాం. ఇంకా నా మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కరోనా వల్ల రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని నష్టపోవడంతో కొన్ని వీలు కాలేదు. ఎప్పటికైనా అన్ని వర్గాల ఆర్థిక సాధికారిత సాధిస్తాం. త్వరలో రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ వారి కోసం గురుకులాలు ప్రారంభిస్తాం.
హుజూరాబాద్లో పాగా వేస్తాం
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. భాజపాపై 12.5 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు అన్ని సర్వేలు తేల్చాయి. ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుంది. 26 లేదా 27న ప్రచారానికి రావాలని స్థానిక నేతలు కోరారు. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం.
సింహగర్జనను మించాలి
వరంగల్లో జరిగే విజయగర్జన సభ కరీంనగర్లో 2001లో నిర్వహించిన సింహగర్జన సభను మించాలి. తెరాసపై ప్రజాభిమానాన్ని దేశం మొత్తం చాటేలా జరగాలి. ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు ఉండాలి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సభకు హాజరయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. సభకు వచ్చేవారికి పార్టీపరంగా బస్సులు ఏర్పాటు చేస్తాం. అన్ని కండిషన్లో ఉండే బండ్లే పెట్టాలి. డొక్కు బండ్లను తేవొద్దు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రూట్ మ్యాప్ ఇవ్వాలి.
పిలిచినవారే ప్లీనరీకి రావాలి
తెరాస 60 లక్షలమందికి పైగా కార్యకర్తలతో దేశంలోనే అత్యుత్తమ పార్టీల్లో ఒకటిగా ఉంది. ఇటీవలే పార్టీ గ్రామ, మండల కమిటీ ఎన్నికలయ్యాయి. 6,500 మంది ఎన్నికయ్యారు. వారిని ప్లీనరీకి ఆహ్వానిస్తున్నాం. పిలవని వారెవ్వరూ రావద్దు. పార్టీ అధ్యక్ష ఎన్నికల అనంతరం 8 నెలల పాటు కమిటీలన్నింటికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. త్వరలో హైదరాబాద్, వరంగల్లోనూ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తాం. అవి కార్పొరేట్ తరహాలో ఉంటాయి. తెరాసకు రూ.403 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. ఏటా రూ. రెండుకోట్ల వడ్డీ వస్తుంది. పార్టీకి లోటు లేదు’’ అని సీఎం చెప్పారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్సభాపక్ష నేత నామా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కేంద్రంలో చక్రం తిప్పుతాం
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదు. మనం అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా ఉంటాం. కేంద్రంలో అధికారం కోసం ఇతర పార్టీలకు మన అవసరం ఉంటుంది. అప్పుడు మనమే చక్రం తిప్పుతాం
- ముఖ్యమంత్రి కేసీఆర్
ఈసారి పూర్తికాలం ఉంటాం
పార్లమెంటు ఎన్నికలతో కలిపి శాసనసభ ఎన్నికలు జరిగితే నష్టపోతామనే ఉద్దేశంతో పోయినసారి ముందస్తుకు వెళ్లాం. ఈసారి శాసనసభ గడువు ముగిసే వరకు ఎన్నికలుండవు. గత ఎన్నికల మాదిరే ఈసారీ ఎమ్మెల్యేల పనితీరుపై గ్రేడింగ్ తీయించాం. ఇందులో చాలామంది ఏ -గ్రేడులో ఉన్నా... కొంతమంది బీ, సీ- గ్రేడుల్లో ఉన్నారు. వారు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలి. గతంలో సీ-గ్రేడ్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో వారిని మార్చి కొత్తవారికి టికెట్లు ఇచ్చాం. మీరు అనుభవజ్ఞులు, మీతో నాకు అనుబంధం ఉంది. కొత్తవారు వస్తే వారిని తయారు చేయడానికి సమయం పడుతుంది. మిమ్మల్ని వదులుకోవాలనుకోవడం లేదు. గ్రేడ్ పెంచుకోడానికి కృషి చేయాలి.
కేసీఆర్ తరఫున ఆరు సెట్ల నామినేషన్లు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ తొలిరోజు ఆదివారం ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మహమూద్అలీ, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్రెడ్డికి అందజేశారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్ష నేతలు నామా నాగేశ్వరరావులు ఎంపీల తరఫున నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల నేతలు విడివిడిగా మరో నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు.
కర్నె ప్రభాకర్కు అనుమతి నిరాకరణ
తెరాస శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుండగా.. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్కు వచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కనుక ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో పోలీసులు అనుమతించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్