National Politics: దిల్లీయే లక్ష్యం..!
ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు వేర్వేరు పార్టీలకు చెందినవారు. ఇప్పుడు వారందరి నోట వినిపిస్తున్న మాట కేంద్రంలో ‘ప్రత్యామ్నాయం’. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, పశ్చిమ బెంగాల్ సీఎం
ముగ్గురు ముఖ్యమంత్రుల సరికొత్త రాజకీయం
కేంద్రంపై గళమెత్తుతున్న కేసీఆర్, స్టాలిన్, మమత
సామాజిక న్యాయ సమాఖ్యలో చేరాలని తమిళనాడు సీఎం ఆహ్వానం
మోదీ సర్కారును కలిసికట్టుగా ఓడిద్దామంటున్న బెంగాల్ సీఎం
భాజపాయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయంపై కేసీఆర్ దృష్టి
దిల్లీ, చెన్నై-న్యూస్టుడే
ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు వేర్వేరు పార్టీలకు చెందినవారు. ఇప్పుడు వారందరి నోట వినిపిస్తున్న మాట కేంద్రంలో ‘ప్రత్యామ్నాయం’. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతానికి విడివిడిగానే సాగిస్తున్న రాజకీయం ఇది. ఎవరికి వారు తమదైన శైలిలో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మున్ముందు ఇది ఎలాంటి మలుపు తిరగనుంది? 2024 నాటికి జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా? కేంద్రంలోని మోదీ- అమిత్ షా ద్వయానికి ప్రాంతీయ నేతల కూటమి ధీటుగా నిలుస్తుందా? 2019 సార్వత్రిక ఎన్నికల నాటి లోపాల్ని అధిగమిస్తూ.. ఈసారి గేరు మార్చి గమ్యస్థానం చేరగలుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ ప్రాబల్యం కోల్పోతున్న నేపథ్యంలో వీరి వ్యాఖ్యలు, ఎత్తుగడలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
కలిసిరావాలని నేతలకు స్టాలిన్ పిలుపు
దేశంలో సామాజిక న్యాయ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న ‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలంటూ పలు పార్ట్టీల నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం పలికారు. సోనియాగాంధీ, కేసీఆర్, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, కేజ్రీవాల్, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్, సీతారాం ఏచూరి, అసదుద్దీన్ ఒవైసీ సహా 37 మందికి లేఖలు రాశారు. ‘అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు చూడాలనుకున్న సమ సమాజాన్ని నిర్మించగలం. సామాజిక న్యాయానికి రిజర్వేషన్ ఒక్కటే సరిపోదు. ప్రతి అడుగులోనూ కొన్ని ప్రత్యేక అధికారాలు ఉండాలి. మండల్ కమిషన్ ఏర్పాటుకు చూపిన అదే సంకల్పం, ఉద్దేశాన్ని ప్రస్తుతం కూడా చూపించాలి...’ అని దానిలో పేర్కొన్నారు. ఆయా పార్టీల నుంచి అర్హులైన వ్యక్తులను సమాఖ్యలో ప్రతినిధులుగా నియమించాలని కోరారు.
హామీ ఇస్తే బెంగాల్ దాటి వస్తా: మమత
‘పార్టీని జాగ్రత్తగా చూసుకుంటామని నాకు మీరు హామీ ఇస్తే.. నేను రాష్ట్రం వెలుపల నా పనిపై ఎక్కువ దృష్టి సారించగలను. దేశవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ను విస్తరించగలను’ అని మమత బుధవారం పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కోల్కతాలో కార్యకర్తలకు చెప్పారు. ప్రాంతీయ పార్టీలంతా ఓ తాటిపైకి వచ్చి 2024 లోక్సభ ఎన్నికల్లో భాజపాని ఓడించాలని పిలుపునిచ్చారు. ‘మా లక్ష్యం.. భాజపా పరాజయమే. పశ్చిమ బెంగాల్లో సీపీఎంను ఓడించినట్లే జాతీయ స్థాయిలో భాజపాను మట్టి కరిపించగలం’ అని చెప్పారు. భాజపాపై వ్యతిరేక పోరాటంలో ఏ పార్టీ అయినా అందరితో కలవకుండా అహంకారం ప్రదర్శిస్తూ కూర్చుంటే చేసేదేమీ లేదన్నారు. తమ పార్టీ ఒంటరిగానైనా కమలంతో అమీతుమీ తేల్చుకుంటుందని స్పష్టం చేశారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సీనియర్ నేత సుబ్రతా బక్షి జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు.
త్వరలో దిల్లీకి కేసీఆర్
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశిస్తున్న సీఎం కేసీఆర్ కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలను కలిసిన ఆయన.. తన ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేయబోతున్నారు. ఇందుకోసం త్వరలో దిల్లీకి వెళ్లనున్నారు. ఇలాంటి కూటమి కోసం 2019 ఎన్నికల నుంచే ఆయన ప్రయత్నిస్తున్నారు. స్టాలిన్తో సమావేశమైనప్పుడు, కేరళ సీఎం పినరయి విజయన్ సహా వామపక్ష నేతలు హైదరాబాద్ వచ్చినప్పుడూ కూటమి ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా