అందరికీ ఆసుపత్రుల అవసరం లేదు
దేశంలో కరోనా బాధితులందరికీ ఆసుపత్రుల అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. 85% మందికి సాధారణ మందులతోనే వైరస్ తగ్గిపోతుందని, మిగతా 15% మంది వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆసుపత్రులకు రావడం మేలన్నారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం సాధ్యం కాదన్నారు.
అది ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు
85% మందికి సాధారణ మందులతోనే తగ్గిపోతుంది
ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా
ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా బాధితులందరికీ ఆసుపత్రుల అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. 85% మందికి సాధారణ మందులతోనే వైరస్ తగ్గిపోతుందని, మిగతా 15% మంది వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆసుపత్రులకు రావడం మేలన్నారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం సాధ్యం కాదన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘చాలామందిలో అనవసర భయాందోళనలు నెలకొన్నాయి. పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేనివారు, ఆక్సిజన్ స్థాయులు సక్రమంగానే ఉన్నవారు మున్ముందు ఇబ్బంది పడకూడదని ఆసుపత్రులకు వెళ్తే... అక్కడ రద్దీ పెరుగుతుంది. చికిత్స అవసరమైనవారు ఇబ్బందిపడాల్సి వస్తుంది. భయాందోళనలతో ఇంట్లో మందులు నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్లో కొరత ఏర్పడుతుంది. తొలిరోజు నుంచే మందులన్నీ వాడితే మున్ముందు సీరియస్ కాదనుకుంటారు. దానివల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. మొదటిరోజు నుంచే ఆక్సిజన్ పెట్టుకుంటే మున్ముందు దాని అవసరం రాదన్న ఉద్దేశంతో కొందరు ఇంట్లోనే సిలిండర్లు పెట్టుకొని అనవసరంగా వాడుతున్నారు. ఇదేమీ మంచి అలవాటు కాదు. 94పైన ఆక్సిజన్ స్థాయి ఉంటే అన్ని అవయవాలకూ ప్రాణవాయువు అందుతోందని లెక్క. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 94-95 స్థాయిలో ఆక్సిజన్ ఉన్నవారు కృత్రిమంగా ఆక్సిజన్ పెట్టుకొని దాన్ని 97-98 స్థాయికి తీసుకెళ్లాలనుకోవడం సరికాదు. ప్రాణవాయువును దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఆక్సిజన్ స్థాయిని నిత్యం 95పైన ఉంచాలనుకోవద్దు. 92, 93 స్థాయిలో ఉన్నా, ఇబ్బందులేమీ రావు.
వృథా అవుతోంది...
సిలిండర్లు పెట్టుకున్నవారు భోజన సమయంలో మాస్కు పక్కనపెట్టి, అలాగే వదిలేస్తున్నారు. ఆ సమయంలో ఆక్సిజన్ను బంద్ చేయకపోవడం వల్ల వృథా అవుతోంది. ప్రాణవాయువును న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉన్నవాళ్లు ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని అనిపించినప్పుడు బోర్లా పడుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ప్రాణవాయువు స్థాయి పెరుగుతుంది.
రెమ్డిసివిర్తో ప్రయోజనాలు లేవు...
రెమ్డెసివిర్ వల్ల పెద్దగా ప్రయోజనాలేమీ లేవు. చైనా, అమెరికా, డబ్ల్యూహెచ్వోలు నిర్వహించిన అధ్యయనాల్లో సానుకూల ఫలితాలు రాలేదు. రెమ్డెసివిర్ దొరక్కపోతే భయాందోళనలు అక్కర్లేదు. కరోనా సోకిన 85% మందిలో తేలికపాటి లక్షణాలే ఉంటున్నాయి. దగ్గు, జర్వం, జలుబుకే లక్షణాలు పరిమితమవుతాయి. సాధారణ మందులతో అవి క్రమంగా తగ్గిపోతాయి. ఆక్సిజన్ స్థాయి తగ్గి, జ్వరం తీవ్రమై... నీరసం, మగత, తీవ్రంగా వాంతులు అవుతుంటే అప్పుడు ఆసుపత్రిలో చేరే విషయమై నిర్ణయం తీసుకోండి. భయాందోళనల కారణంగా ఇంట్లో ఉండకుండా అందరూ ఆసుపత్రుల్లో చేరతామంటే అంతమందికి సేవలందించే స్థాయి ప్రపంచంలోని ఏ మౌలిక వసతుల వ్యవస్థకూ లేదు. కేసులు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి’’ అని గులేరియా పేర్కొన్నారు.
ఇంట్లో ఉన్నా మాస్కు ధరించాలి: వీకే పాల్
మహిళలు నెలసరి సమయంలోనూ టీకా తీసుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. ‘‘రెండు వ్యాక్సిన్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. అందువల్ల దొరికింది తీసుకోవాలి. ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నవారు ఐవర్మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐదు రోజులకు మించి దగ్గు ఉంటే బ్యుడెనెసైట్ తీసుకోవచ్చు. అవసరమైన వారికి మాత్రమే పడకలు ఉపయోగపడేలా చూడాలి. లేకపోతే డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో ఉన్నా, అందరూ మాస్కులు ధరించడం మేలు. పాజిటివ్ వచ్చినవారిని ఇంట్లో ఏకాంతంగా ఉంచే పరిస్థితి లేకుంటే బయట కేంద్రాలకు పంపండి. ఆసుపత్రుల కోసం చూడొద్దు’’ అని ఆయన సూచించారు.
మాస్కులు ధరించకుంటే 90% ముప్పు: లవ్ అగర్వాల్
మాస్కు ధరించకుండా ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా మాట్లాడుకుంటే... వైరస్ సోకే ముప్పు 90% ఉంటుందని వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. ఇద్దరూ మాస్కులను సక్రమంగా ధరిస్తే వైరస్ నుంచి చాలామటుకు రక్షణ లభిస్తుందన్నారు. ‘‘భౌతికదూరం పాటించకుంటే... ఇన్ఫెక్షన్ సోకిన ఒక్క వ్యక్తి నుంచి నెలలో 406 మందికి వైరస్ సోకుతుంది. అదే 50% భౌతిక దూరం పాటిస్తే... 15కి, 75% భౌతిక దూరంతో 2.5కి బాధితుల సంఖ్య పరిమితమవుతుంది’’ అని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు