PM Modi: అవమానకరంగా ఆంధ్రా విభజన
కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం,....
పెప్పర్ స్ప్రేకొట్టి, మైకులు ఆపి చర్చలు లేకుండా చేశారు
అప్పటి స్పర్థలు ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తున్నాయి
అంజయ్యను అవమానించారు.. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు
రాజ్యసభలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వీటన్నింటికీ కాంగ్రెసే కారణమని నిప్పులు చెరిగారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారు. మైకులు బంద్ చేసి, పెప్పర్ స్ప్రే చేసి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఇది మంచి పద్ధతా? ఇదేనా ప్రజాస్వామ్యం. వాజపేయీ హయాంలోనూ మూడు రాష్ట్రాలను విభజించి ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. వాజపేయీ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తుపానూ రాలేదు. అందరూ కూర్చొని శాంతియుతంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ విషయంలోనూ అలా జరిగి ఉండొచ్చు. మేం తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ మీ అహంకారం, అధికార మత్తు దేశంలో స్పర్థలను సృష్టించింది. ఆ స్పర్థ ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తోంది. మీక్కూడా ఎలాంటి రాజకీయ ప్రయోజనం దక్కడం లేదు...’’ అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
అంజయ్యకు చేసిన అవమానాన్ని మరిచిపోయారా?
ఇదివరకు రాజీవ్గాంధీ చేతుల్లో ముఖ్యమంత్రి అంజయ్యకు అవమానం జరిగినట్లు ప్రచారంలో ఉన్న సంఘటననూ ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘‘సమాఖ్య వ్యవస్థ గురించి పెద్దపెద్ద ప్రసంగాలు చేసేవారు ఎయిర్పోర్టులో చిన్న విషయం కోసం ముఖ్యమంత్రిని తొలగించడాన్ని మరిచిపోయినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య విషయంలో ఏ జరిగిందో ఈ సభలోని వారందరికీ బాగా తెలుసు. ప్రధానమంత్రి కుమారుడికి ఎయిర్పోర్టులో చెప్పిన స్వాగతం నచ్చకపోవడంతో ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించారు. తద్వారా కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్ను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానకరరీతిలో పదవీచ్యుతుడ్ని చేశారు...’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
్య ప్రస్తుతం ఏపీ, తెలంగాణల నుంచి పసుపు ఎగుమతులు పెరగడం తమ ప్రభుత్వ కృషి ఫలితమేనన్నారు. కరోనా సమయంలో ఆయుష్ మంత్రిత్వశాఖ ద్వారా భారతీయ వైద్య పద్ధతులకు ప్రచారం కల్పించడంతో ప్రజల్లో దానిపట్ల ఆసక్తి పెరిగి పసుపు వాడకం పెరిగిందని, దాని వల్ల పసుపు ఎగుమతులు వృద్ధి చెందాయని చెప్పారు.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది ఎవరు?
ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంశాన్నీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘మొదట అవిశ్వాసం కల్పించడం, తర్వాత అస్థిరపరచడం, తర్వాత డిస్మిస్ చేయడం అన్న మూడు సూత్రాల ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించింది. ఫరూక్ అబ్దుల్లా, చౌదరీ దేవీలాల్, చరణ్సింగ్, సర్దార్ బాదల్ ప్రభుత్వాలను ఎవరు అస్థిర పరిచారు? మహారాష్ట్రలో బాల్ఠాక్రేని అవమానించడానికి ఎవరు కుటిల ప్రయత్నాలు చేశారు? కర్ణాటకలో రామకృష్ణహెగ్డే, ఎస్ఆర్ బొమ్మై ప్రభుత్వాలను ఎవరు కూలదోశారు? 50వ దశకంలో కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు? తమిళనాడులో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ప్రభుత్వం, 1980లో ఎంజీఆర్ ప్రభుత్వాలను ఎవరు పతనం చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ప్రయత్నించారు? కేంద్ర ప్రభుత్వం మాట వినడం లేదని ములాయంసింగ్ను ఇబ్బంది పెట్టింది ఎవరు?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్