PM Modi Cabinet: భారీ ప్రక్షాళన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ఇదివరకున్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతి కల్పించారు. కొత్తగా 36 మందిని కొలువులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన 2019 మే 31న 57 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. ...
రెండేళ్ల తర్వాత కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు
పాత మంత్రుల్లో డజను మందికి ఉద్వాసన
ఏడుగురికి పదోన్నతి..
కొత్తగా మరో 36 మంది
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు
ప్రతిభ, పనితీరు, సామాజిక వర్గాల ఆధారంగా అవకాశాలు
విద్యావంతులకు ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం
మంత్రివర్గంలో 25 రాష్ట్రాలకు చోటు
ఈనాడు - దిల్లీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ఇదివరకున్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతి కల్పించారు. కొత్తగా 36 మందిని కొలువులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన 2019 మే 31న 57 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. రాజీనామాలు, మరణాల కారణంగా ఆ సంఖ్య 53కి తగ్గిపోయింది. గత రెండేళ్లలో మంత్రుల పనితీరు, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం భారీ మార్పులు చేశారు. పనితీరు సరిగా లేని, క్రియాశీలకంగా వ్యవహరించని డజను మంది మంత్రులను పక్కనపెట్టారు. సహాయ మంత్రులుగా ఉంటూనే పనితీరుతో మెప్పించినందుకు నలుగురు స్వతంత్ర మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించి వారి శ్రమను గౌరవించారు. వీరిలో జి.కిషన్రెడ్డి, కిరణ్ రిజీజు, ఆర్.కె.సింగ్, హర్దీప్సింగ్ పురి, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, అనురాగ్ ఠాకుర్ ఉన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ 43 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం.. కొవిడ్ నిబంధనల వల్ల పరిమిత అతిథుల మధ్య సుమారు గంటన్నరపాటు సాగింది. ఎక్కువ మంది మంత్రులు హిందీలో, కొద్దిమంది ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
రవిశంకర్, జావడేకర్, నిశాంక్లకు నిరాశ
మంత్రివర్గ విస్తరణ వేళ పలువురు మంత్రులకు ప్రధాని ఉద్వాసన పలికారు. మొత్తం 12 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ప్రధాని సిఫార్సు మేరకు వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాజీనామాలు చేసినవారిలో నలుగురు సీనియర్ మంత్రులు- రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్, రమేశ్ పోఖ్రియాల్లతో పాటు సదానందగౌడ, సంతోష్ గంగ్వార్, దేబశ్రీ చౌధురి, బాబుల్ సుప్రియో, విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, జల్శక్తి శాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా, ఉన్నారు. కర్ణాటక గవర్నర్గా నియమితులైన సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి థావర్చంద్ గహ్లోత్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
పక్కాగా పనితీరు అంచనా
మంత్రుల పనితీరు అంచనాకు పక్కా చర్యలు చేపట్టారు. ప్రధాని కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక యూనిట్ ద్వారా అమాత్యుల కదలికలు, మాటలు, వాటి ద్వారా ఎదురైన పరిణామాలను అంచనావేశారని తెలిసింది. అతి దూకుడుగా వ్యవహరించినవారిని, అతి నెమ్మదిని ప్రదర్శించినవారిని బయటికి పంపించేశారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రులు స్పందించిన తీరుకు ఎక్కువ మార్కులు వేసినట్లు ప్రస్తుత కూర్పును బట్టి అర్థమవుతోంది. దక్షిణాదిలో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకూ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లైంది. ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలనూ దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ కూర్పు పూర్తిచేశారు. ముందునుంచి వినిపిస్తున్న రీతిలోనే మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్యకు కేబినెట్ బెర్తు లభించింది. కొత్తగా మంత్రివర్గంలోకి ఏడుగురు మహిళలను తీసుకున్నారు.
ఓబీసీలే 27 మంది
మొత్తం 77 మంది మంత్రుల్లో ఓబీసీల సంఖ్య 27. ఎస్సీలు 12, ఎస్టీలు 8, మైనార్టీలు ఐదుగురు ఉన్నారు. మిగిలిన 25 మంది విభిన్న సామాజిక వర్గాలవారు. నలుగురికి సీఎంలుగా పనిచేసిన నేపథ్యం ఉంది. కేబినెట్లో 25 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించినట్లయింది.
15 మంది కేబినెట్.. 28 మంది సహాయ మంత్రులు
ప్రమాణ స్వీకారం చేసినవారిలో 15 మందికి కేబినెట్ హోదా, మిగిలిన 28 మందికి సహాయ మంత్రుల హోదా అప్పగించారు. పాత, కొత్త కలిపితే మొత్తం కేబినెట్ మంత్రుల సంఖ్య 30కి చేరింది. కొత్త మంత్రుల్లో 33మంది లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 8మంది రాజ్యసభ నుంచి వచ్చారు. అస్సాం మాజీ సీఎం సోనోవాల్, తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్.మురుగన్ ఇంకా ఏ సభలోనూ సభ్యులుగా లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!