Railway Budget: కొత్త రైళ్లూ.. లైన్లూ లేవు
బుల్లెట్ రైలు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వంటి భారీ ప్రాజెక్టులేవీ రాలేదు. నూతనంగా రైల్వే లైన్లు మంజూరు చేయలేదు. కొత్త రైళ్లూ ఇవ్వలేదు. అత్యాధునిక, కొత్తతరం రైళ్లు అంటూ
కోచ్ ఫ్యాక్టరీ లేదు, వందేభారత్ ఊసూ లేదు
కాజీపేట పీఓహెచ్కు రూ.45 కోట్లే, చర్లపల్లికి రూ.69.99 కోట్లు
రాష్ట్రానికి తీవ్ర నిరాశ
ఈనాడు, హైదరాబాద్: బుల్లెట్ రైలు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వంటి భారీ ప్రాజెక్టులేవీ రాలేదు. నూతనంగా రైల్వే లైన్లు మంజూరు చేయలేదు. కొత్త రైళ్లూ ఇవ్వలేదు. అత్యాధునిక, కొత్తతరం రైళ్లు అంటూ వందేభారత్ పేరుతో ఊరించినా ఈ ఏడాది కేటాయింపుల్లో వాటి ఊసే లేదు.. మొత్తంగా కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రైల్వేకు గతేడాది కంటే రూ.30 వేల కోట్లు అధికమని ఆ శాఖ ఘనంగా చెప్పినా రాష్ట్రానికి ఆ మేరకు కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వే పింక్బుక్ వివరాల ప్రకారం గత బడ్జెట్లలో మంజూరై, నిర్మాణంలో ఉన్న నూతన ప్రాజెక్టుల్లో కొన్నింటికే.. డబ్లింగ్ లైన్లకు, చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్కు కొంతమేర నిధులు ఇచ్చారు. ద.మ.రైల్వే జోన్ విభజన జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్లే మిగులుతాయి. మరొకటి మహారాష్ట్రలోని నాందేడ్లో ఉంటుంది. కాజీపేట కేంద్రంగా కొత్తరైల్వే డివిజన్ ఏర్పాటుచేయాలన్న డిమాండ్పైనా స్పందన లేదు. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన సౌత్కోస్ట్ కొత్త రైల్వేజోన్కి ఈసారి రూ.40 లక్షలే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఈ సంవత్సరం ద.మ.రైల్వే జోన్ విభజన ప్రక్రియ పూర్తవుతుందా? అన్న సందేహాలున్నాయి.
ఎంఎంటీఎస్కు రూ.20 లక్షలే..
* హైదరాబాద్లో రెండో దశ ఎంఎంటీఎస్ పనులకు రూ.10 లక్షలే ఇచ్చారు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి (రాయగిరి) రెండోదశ విస్తరణ ప్రాజెక్టుకు సైతం రూ.10 లక్షలే. రెండోదశలో తమ వంతు వాటా మించి ఖర్చు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు రావాలని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రి ఎంఎంటీఎస్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి ముందుకు రావాలంటోంది.
* కాజీపేట పీరియాడికల్ ఓవర్హాలింగ్ ప్రాజెక్టుకు కేంద్రం రూ.45 కోట్లే ఇచ్చింది. 2016-17లో రూ.269.78 కోట్ల అంచనా వ్యయంతో ఇది మంజూరైంది. అయిదేేళ్ల క్రితం రూ.రెండొందల కోట్ల పైచిలుకు నిధుల్ని బడ్జెట్లో కేటాయించినా, భూసమస్య ఉందని ఆ నిధుల్ని రైల్వే వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. కానీ రూ.45 కోట్లే ఇచ్చారు. మరోపక్క అంచనా వ్యయమూ పెరిగింది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కనీసం నాలుగైదేళ్లు పట్టే అవకాశం ఉంది.
* హైదరాబాద్లో ప్రధాన టెర్మినళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలో నిర్మిస్తున్న శాటిలైట్ టెర్మినల్కు రూ.69.99 కోట్లు ఇవ్వగా, నాగులపల్లి ప్రస్తావన లేదు.
* రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు నిధుల్లో కూడా మూడోవంతు వాటా భరిస్తున్న మనోహరాబాద్-కొత్తపల్లి లైనుకు గతేడాది రూ.325 కోట్లు ఇచ్చిన రైల్వేశాఖ, ఈసారి రూ.60 కోట్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట వైపు పనులు పురోగతిలో ఉన్నాయి. సిరిసిల్ల మీదుగా కొత్తపల్లి వరకు పూర్తయితే సికింద్రాబాద్-కరీంనగర్ వరకు రైల్వేలైను అందుబాటులోకి వస్తుంది. ఇంత కీలక ప్రాజెక్టుకూ నిధుల కేటాయింపులో రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపింది.
రూ.2,480 కోట్లకు ఇచ్చింది రూ.వెయ్యి
తెలుగురాష్ట్రాల మధ్య ఎంతో డిమాండ్ ఉన్న రైల్వే లైను బీబీనగర్-గుంటూరు. ఈ మార్గంలో రెండోలైన్ నిర్మాణ అంచనా వ్యయం రూ.2,480 కోట్లయితే రూ.వెయ్యి ఇచ్చారు. దశాబ్దాల క్రితం మంజూరైన నల్గొండ-మాచర్లకూ కేటాయించింది రూ.వెయ్యే. కొండపల్లి-కొత్తగూడెం, మణుగూరు-రామగుండం లైన్లకు సైతం రూ.వెయ్యేసి చొప్పున బడ్జెట్లో మంజూరుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్