కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం.. సాగర్
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 16 అవుట్లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తీర్మానం చేసింది. గెజిట్ అమలుకు అనుగుణంగా 14వ తేదీలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాన్ని పంపేందుకు
మొదటిదశలో బోర్డు కిందకు 16 అవుట్లెట్లు!
జల విద్యుత్ కేంద్రాలు అప్పగించబోమన్న తెలంగాణ
ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
ఈనాడు, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 16 అవుట్లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తీర్మానం చేసింది. గెజిట్ అమలుకు అనుగుణంగా 14వ తేదీలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాన్ని పంపేందుకు నిర్ణయించింది. రాష్ట్రాలు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తే గానీ గెజిట్ అమల్లోకి రాదు. ఈ ఉత్తర్వుల విడుదలకు ఏపీ సానుకూలత వ్యక్తం చేసింది. జల విద్యుత్ కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి తెలంగాణ నిరాకరించింది. దీంతో గడువులోపు గెజిట్ అమలుపై అనిశ్చితి నెలకొంది. మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బోర్డు 15వ సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, బోర్డు సభ్యులు రవికుమార్ పిళ్లై, ముతాంగ్, రాయ్పురే పాల్గొన్నారు. ఉప సంఘం 30 కేంద్రాలకు సంబంధించి రూపొందించిన నివేదికపై బోర్డు సమావేశంలో చర్చించారు.
రాష్ట్రాలు ఆమోదించాల్సిన ప్రాజెక్టులివే...
కేంద్ర గెజిట్లోని షెడ్యూల్-2లో పేర్కొన్న ప్రాజెక్టుల్లో మొదటి విడతగా కొన్నిటిని బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు కేఆర్ఎంబీ నిర్ణయించింది. తీర్మానంలో వాటిని పొందుపరిచింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద మొత్తం 16 డైరెక్ట్ అవుట్లెట్లను ప్రతిపాదించవచ్చని సమాచారం. గడువులోపు గెజిట్ అమలుకు వీలుగా శ్రీశైలం, సాగర్ల పరిధిలో ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను రాష్ట్రాలు అప్పగించాలని కోరుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బోర్డు పేర్కొంది.
తెలంగాణ ససేమిరా.. ఏపీ సమ్మతి
బోర్డు జాబితాలో జల విద్యుత్ కేంద్రాలు కూడా ఉండటంతో తెలంగాణ అంగీకరించలేదని తెలిసింది. కృష్ణా జలాల కేటాయింపుల అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఇప్పుడు గెజిట్ అమలు చేయడం సరికాదని పేర్కొన్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిందని పేర్కొన్నట్లు తెలిసింది. హంద్రీ నీవా, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను కూడా చేర్చాలని తెలంగాణ సూచించగా, ఏపీ అంగీకరించలేదని సమాచారం. గెజిట్ అమలుకు ఉత్తర్వులిచ్చేందుకు తాము అనుకూలంగా ఉన్నామని ఏపీ స్పష్టం చేసినట్లు తెలిసింది. తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలను చేర్చితేనే ఏపీ పరిధిలోని రెండు కేంద్రాలను బోర్డు అధీనంలోకి వెళ్లడానికి అంగీకరిస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం. సీడ్మనీపైనా రెండు రాష్ట్రాలు బోర్డు నుంచి స్పష్టత కోరినట్లు తెలిసింది.
రాష్ట్రాల ఉత్తర్వులు కీలకం
ప్రాజెక్టుల పరిధిలోని సిబ్బంది, నిధులు, భద్రత, ఆస్తుల (అసెట్స్) వివరాలు కూడా రాష్ట్రాలు అప్పగించాల్సి ఉండగా ఏపీ పూర్తిస్థాయిలో అందజేసినట్లు పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టుల నిర్వహణ (ఆపరేషన్, మెయింటెనెన్స్) మాత్రమే బోర్డు చేపడుతుంది. ప్రాజెక్టు యాజమాన్య (ఓనర్షిప్) హక్కులు ప్రభుత్వాల పరిధిలోనే ఉండనున్నాయి. ప్రాజెక్టులపై రుణాలు పొందడానికి రాష్ట్రాలకు ఆటంకాలేవీ ఉండవని తెలిసింది.
పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం: తెలంగాణ
కృష్ణా బోర్డు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాక ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ తెలిపారు. బోర్డు సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ లేవనెత్తుతున్న సమస్యను కృష్ణా జల వివాద ట్రైబ్యునల్కు పంపేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సమయంలో గెజిట్ నోటిఫికేషన్ అమలు వద్దని తెలంగాణ కోరుతోంది. శ్రీశైలం నిర్మించిందే జల విద్యుత్ కోసం. తెలంగాణ అధికారికంగానే ఉత్పత్తి చేస్తోంది. విద్యుదుత్పత్తి ఆపాలని ఏపీ అంటోంది. రాయలసీమ అవసరాలకు అనుగుణంగా సాగునీటిని తీసుకువెళ్లడం ఆ రాష్ట్రానికి అలవాటుగా మారింది. ప్రాజెక్టులు విస్తరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండా ప్రాజెక్టులను బోర్డు తీసుకోదు. నిర్వహణ నిధుల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని సమావేశంలో సూచించాం’ అని రజత్కుమార్ వివరించారు.
అనధికారిక విద్యుదుత్పత్తే కారణం: ఏపీ
శ్రీశైలం నుంచి తెలంగాణ అనధికారికంగా జల విద్యుదుత్పత్తి చేపట్టడంతో కేంద్రం గెజిట్ జారీ చేయాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జల విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ నిర్దేశించినా, వారు పట్టించుకోలేదు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేంద్రం వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జల విద్యుదుత్పత్తి కేంద్రాలు మినహా ప్రాజెక్టులను తీసుకోవాలని బోర్డును తెలంగాణ కోరింది. ఇది ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. శ్రీశైలం కేవలం విద్యుదుత్పత్తికే అయితే తెలంగాణ సాగునీటిని ఎలా తీసుకుంటోంది? బోర్డుకు ప్రాజెక్టుల సమాచారం అంతా అందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఉత్తర్వులు జారీ చేస్తుంది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ