Telangana Budget 2022: కొత్త రుణం రూ.59,672 కోట్లు.. ఒక్కొక్కరిపై అప్పు రూ.1,25,116

ఒకవైపు రాష్ట్ర ఆదాయం, వృద్ధి రేటు పెరుగుతుండగా...మరోవైపు ప్రజలపై అప్పుల భారమూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.2,85,120 కోట్ల రుణాన్ని ప్రతిపాదించింది. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ పరిధిలో

Updated : 08 Mar 2022 05:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒకవైపు రాష్ట్ర ఆదాయం, వృద్ధి రేటు పెరుగుతుండగా...మరోవైపు ప్రజలపై అప్పుల భారమూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.2,85,120 కోట్ల రుణాన్ని ప్రతిపాదించింది. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ పరిధిలో మరో రూ.59,672 కోట్ల రుణాన్ని సమీకరించుకోనుంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర రుణం రూ.3,29,980 కోట్లు అవుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు రుణాలు ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రూ.1,45,456 కోట్లకు చేరతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,75,444 కోట్లవుతుంది. అంటే ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ.1,25,116. 

ఈ ఏడాది ప్రతిపాదించిన అప్పుల్లో నీటిపారుదల శాఖకు రూ.8,940 కోట్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.7,267 కోట్లు, గృహనిర్మాణానికి రూ.1,528 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.1,472 కోట్లు, రోడ్డు రవాణాకు రూ.1,221 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.797 కోట్లు, వైద్యఆరోగ్యానికి రూ.720 కోట్లు, విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.374 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.254 కోట్లు, పంటల సందర్శనకు రూ. 221 కోట్లు, మత్స్య రంగానికి రూ.127 కోట్లు, వివిధ సాధారణ సేవలకు రూ.103 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల రుణాలకు రూ.97 కోట్లు, పాడి అభివృద్ధికి రూ.83 కోట్లు ఉన్నాయి. అంతర్గత రుణాలు రూ.8,700 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నవి రూ.438 కోట్లుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు