Telangana Budget 2022: ప్రభుత్వం.. దళిత బంధుత్వం!
దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో హుజూరాబాద్ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగనుంది.
బడ్జెట్లో దళితబంధుకు భారీగా నిధులు
1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలు
నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున అవకాశం
ఈనాడు - హైదరాబాద్
దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది. ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో హుజూరాబాద్ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగనుంది. పథకం కింద.. ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా, ఇష్టమైన పని ఎంపిక చేసుకుని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో రూ.10 లక్షలు ఇస్తోంది. వచ్చే ఏడాదికి 2 లక్షల మందికి లబ్ధిచేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. హుజూరాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామం, నాలుగు ప్రయోగాత్మక మండలాలు, రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఇప్పటికే దాదాపు 35 వేల దళిత కుటుంబాలు ఎంపికయ్యాయి. హుజూరాబాద్, వాసాలమర్రి లబ్ధిదారులకు యూనిట్లు మంజూరవుతున్నాయి. తాజా బడ్జెట్లో మరో 1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలయ్యేలా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు లబ్ధిపొందని కుటుంబాలకు ముందు ప్రాధాన్యమివ్వాలని పథకం ప్రకటించిన సమయంలో భావించినప్పటికీ, ఎలాంటి పరిమితులు లేకుండా దళిత కుటుంబాలందరికీ అవకాశమివ్వాలని నిర్ణయించారు.
సంక్షేమ శాఖలకు రెట్టింపు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 2022-23 బడ్జెట్లో ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఈ శాఖల బడ్జెట్ గత ఏడాదితో పోల్చితే దాదాపు రెట్టింపైంది. ఇందులో సింహభాగం రూ.17,700 కోట్లను దళిత బంధు పథకానికి ఇచ్చింది. ఎస్సీ సంక్షేమానికి భారీగా పెంచగా, మిగతా సంక్షేమశాఖల బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా మార్పుల్లేవు. గురుకులాలకు కేటాయింపులు పెద్దగా పెరగలేదు.
* 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి ప్రభుత్వం రూ.31,466.53 కోట్లు కేటాయించింది.
* కార్మిక, ఉపాధి కల్పన శాఖకు బడ్జెట్లో రూ.511.36 కోట్లు కేటాయించింది. ఐటీఐల ఉన్నతీకరణ, కొత్త ఐటీఐల అభివృద్ధికి స్వల్పంగా రూ.4.5 కోట్లు ఇచ్చింది. నైపుణ్య శిక్షణ కోసం రూ.2.6 కోట్లు ప్రకటించింది.
గురుకులాలకు..
బడ్జెట్లో ఎస్సీ గురుకులాలకు రూ.1063.79 కోట్లు, గిరిజన గురుకులాలకు రూ.492.74 కోట్లు కేటాయించింది. సంక్షేమ శాఖల్లో అత్యధికంగా 281 గురుకుల విద్యాలయాలున్న బీసీ సొసైటీకి నిధులు స్వల్పంగా పెంచి రూ.330 కోట్లు కేటాయించింది. మైనార్టీ సొసైటీలో 204 గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా మారాయి. అయినా, ఈ సొసైటీకి గత ఏడాదితో సమానంగా రూ.222.92 కోట్లు కేటాయించింది.
బోధనానికి 2,539.33 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ప్రభుత్వం రూ.2,539.33 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఏటా 13.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బడ్జెట్లో నిధులు పెంచారు.
* కల్యాణలక్ష్మికి గత ఏడాదితో సమానంగా ఈ సారి రూ.2,750 కోట్లు ఇచ్చింది.
* విదేశీవిద్య పథకం అమల్లో మైనార్టీ సంక్షేమశాఖకు ప్రాధాన్యం లభించింది. ఈ పథకం కింద మైనార్టీలకు రూ.100 కోట్లు, బీసీలకు రూ.66 కోట్లు, ఎస్సీలకు రూ.45 కోట్లు, ఎస్టీలకు రూ.10 కోట్లు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల రుణం సేకరణ నిమిత్తం బాండ్లను వేలం వేయనున్నట్లు రిజర్వుబ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న వీటిని వేలం వేయనున్నట్లు వివరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?