Telangana Budget 2022: ఇది కేసీఆర్ మార్కు బడ్జెట్
‘ఇది బడుగుల జీవితాలు మార్చే.. కేసీఆర్ మార్కు బడ్జెట్’ అని ఆర్థికమంత్రి టి.హరీశ్రావు అభివర్ణించారు. సోమవారం శాసనసభలో ఆయన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 90 పేజీల ప్రసంగ పాఠాన్ని రెండు గంటల పాటు చదివారు
బడుగుల సంక్షేమమే మా లక్ష్యం
రాష్ట్రాల అధికారాలను కేంద్రం కబళిస్తోంది
సెస్ల పేరుతో దొడ్డిదోవన దండుకుంటోంది
తెలంగాణకు ఒక్క పథకానికీ నిధులివ్వలేదు
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి హరీశ్రావు
ఈనాడు - హైదరాబాద్
‘ఇది బడుగుల జీవితాలు మార్చే.. కేసీఆర్ మార్కు బడ్జెట్’ అని ఆర్థికమంత్రి టి.హరీశ్రావు అభివర్ణించారు. సోమవారం శాసనసభలో ఆయన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 90 పేజీల ప్రసంగ పాఠాన్ని రెండు గంటల పాటు చదివారు. ఇందులో దాదాపు ఆరు పేజీల వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడానికే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి హరీశ్ విపులంగా వివరించారు. తెలంగాణ అవతరించిన అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆర్థికమంత్రి చివరగా మహాభారతంలోని ఒక వాక్యంతో ముగించారు. సీఎం కేసీఆర్కు తెలంగాణ అభ్యున్నతి గురించి తపనే తప్ప వేరే చింతన లేదని చెప్పారు. ప్రగతినిరోధక శక్తులు అవరోధాలను సృష్టిస్తున్నా వాటిని ఎదుర్కోగల సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, ప్రజల శ్రేయస్సు కోసమే కృషి చేస్తామంటూ ప్రసంగాన్ని ముగించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
రాష్ట్రాల ఆదాయానికి గండి
కేంద్ర పన్నుల నుంచి న్యాయబద్ధంగా 41% రాష్ట్రాలకు రావాలి. కానీ సెస్ల పేరుతో దాన్ని కుదిస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4% మేర నిధులకు గండికొడుతోంది. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఆమోదించలేదు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులనూ ఇవ్వలేదు. వాటి కోసం ప్రయత్నిస్తాం. ఆ నిధులనూ బడ్జెట్లో పేర్కొన్నాం. ఈసారి 35 కొత్త కార్యక్రమాలకు నిధులను కేటాయించాం.
బడ్జెట్ అంటే అంకెలే కాదు
‘‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు. ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణ. కేంద్ర ప్రభుత్వం ‘కాళ్లలో కట్టె పెట్టినట్టు’ వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా వ్యవహరిస్తోంది. తెలంగాణ పురుటిదశలో ఉన్నప్పటి నుంచే దాడి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టింది. దీంతో దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయింది. ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా తాత్సారం చేసింది. విభజన హామీలను ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంటులో తెలంగాణ ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతిసారి ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని వ్యాఖ్యానిస్తూ కేంద్ర పెద్దలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో ఐటీఐఆర్ను అమలు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి విన్నవించారు. కాని చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ ఇవ్వలేదు.
రూ. 495 కోట్లు ఏపీ ఖాతాలో వేసింది
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ. 495 కోట్లను పొరపాటుగా ఏపీ ఖాతాలో వేసింది. ఏడేళ్ల నుంచి అడుగుతున్నా తిరిగి ఇవ్వలేదు. జహీరాబాద్లోని నిమ్జ్కు రూ. 500 కోట్ల కేంద్ర వాటానూ ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక గ్రాంటుగా రూ.723 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా ఇవ్వలేదు. మొత్తం అన్ని రకాల గ్రాంట్లు కలిపి రూ. 5,386 కోట్లు తొక్కిపెట్టింది. కరోనా సమయంలోనూ రాష్ట్రాలకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా దక్కాల్సిన నిధులలోనూ కోతలు పెట్టింది.
విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోం
విద్యుత్ సంస్కరణలకు లంకె పెట్టి రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టింది. రైతు వ్యతిరేకమైన ఆ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో రూ.25,000 కోట్లు సమకూర్చుకునే అవకాశాన్ని తెలంగాణ కోల్పోయింది. రైతుల మీద ఛార్జీల భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణముండగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోమని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు. 4 కోట్లమంది ప్రజల శ్రేయస్సు కోసం రూ. 25,000 కోట్లు వదులుకోడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క పథకానికీ డబ్బులివ్వలేదు. రుణం తెచ్చుకునైనా అభివృద్ధి చేసుకుందామనుకుంటే దానికీ మోకాలడ్డుతోంది’’ అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
మండలిలో...
శాసనమండలిలో సోమవారం బడ్జెట్ను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రవేశపెట్టారు. ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం మండలిని ప్రొటెం ఛైర్మన్ జాఫ్రీ గురువారానికి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి