Telangana State Budget: 7న రాష్ట్ర బడ్జెట్
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభంకానున్నాయి. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తొలిరోజే సభలో 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి లేదా మరొకరు బడ్జెట్ను ప్రవేశపెడతారు
గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్కు, ప్రభుత్వానికి దూరం పెరిగిందా!
వరస పరిణామాలతో అనేక సందేహాలు
తొలిరోజే పద్దు ప్రవేశపెట్టనున్న మంత్రులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభంకానున్నాయి. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తొలిరోజే సభలో 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి లేదా మరొకరు బడ్జెట్ను ప్రవేశపెడతారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాల్సి ఉంటుంది. మార్చి 28న యాదాద్రి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా మహా సంప్రోక్షణ జరగనుంది. ఈలోపే శాసనసభ సమావేశాలు ముగిసే వీలుంది. వాటిపై సోమవారం జరిగిన సమావేశంలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రులు హరీశ్, ప్రశాంత్రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇలా జరగడం అరుదే
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు మొదలుకావడం అరుదే. బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయసభలను సమావేశపరచి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. నిబంధనల మేరకు కొత్త శాసనసభ మొదటి సమావేశం, ఆపై ఏటా జరిగే తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించాలి. దానికిముందు శాసనసభ ప్రొరోగ్ (నిరవధిక వాయిదా) జరగాలి. తెలంగాణలో గత అక్టోబరు 8న అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. శాసనసభ వాయిదా పడింది కానీ ప్రొరోగ్ పడలేదు. దీనివల్ల సాంకేతిక అంశాలు గవర్నర్ ప్రసంగానికి అడ్డొస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈసారి నేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ సమాచారాన్ని గవర్నర్కు ముందే తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఏపీ, బెంగాల్, పుదుచ్చేరిలలో..
ఉమ్మడి రాష్ట్రంలో 1970లో ఒకసారి, 2014లో (తెలంగాణ ఏర్పడకముందు) ఒకసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి. 2020 జనవరిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగాయి. 2020-21లో బెంగాల్ శాసనసభలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2020లో కిరణ్ బేడీ గవర్నర్గా ఉన్నప్పుడు పుదుచ్చేరి బడ్జెట్ సమావేశాలు కూడా ఇలాగే జరిగాయి. కిరణ్ బేడీయే ప్రసంగాన్ని బహిష్కరించారు.
దూరం పెరగడమే కారణమా!
గవర్నర్ తమిళిసై లేకుండానే తెలంగాణ ప్రభుత్వం శాసనసభను నిర్వహించనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆమెకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే సందేహాలు తలెత్తుతున్నాయి. గణతంత్ర దినోత్సవాలకు తెలంగాణ సీఎం, మంత్రిమండలి సభ్యులు హాజరుకాకపోవడం, భాజపా ఎంపీ అర్వింద్పై దాడి గురించి గవర్నర్ ఆరా తీయడం, మేడారం జాతర సందర్భంగా గవర్నర్కు హెలికాప్టర్ను కేటాయించకపోవడం, రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్, సీఎంలు విమానాశ్రయంలో మాట్లాడుకోకపోవడం, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా ఆమోదంలో గవర్నర్ జాప్యం చేయడం వంటి పరిణామాలు ఈ వాదనకు బలం చేకూర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు గవర్నర్ లేకుండానే నడపాలని ప్రభుత్వం నిర్ణయించడం తాజా పరిణామం. శాసనసభ ప్రొరోగ్ కాకపోవడం గవర్నర్ రాకకు ప్రతిబంధకంగా మారిందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే
ఈ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమనే చెప్పాలి. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ పూర్తిస్థాయిలో అమలవుతుంది. వచ్చే సంవత్సరం.. అంటే 2023 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఆ ఏడాది మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టినా అది తొమ్మిది నెలల పాటే అమలవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్కు, సమావేశాలకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. కేటాయింపులు సైతం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.50 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ నియామకాలు, ఇతర కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు భారీగా కేటాయింపులు ఉండవచ్చని భావిస్తున్నారు.
మహిళా గవర్నర్ కాబట్టే అవమానమా?
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తి రాజ్యాంగ ప్రతినిధిని గౌరవిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. ‘మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నారా? రాష్ట్ర ప్రథమ పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?’ అంటూ నిప్పులుచెరిగారు. చట్టాల్ని గౌరవించలేని.. సంప్రదాయాల్ని పాటించలేని వ్యక్తికి నైతికంగా ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని అన్నారు. తెరాస ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేనందువల్లే గవర్నర్ ప్రసంగాన్ని లేకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టాలని సీఎం నిర్ణయించినట్లున్నారని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ