KCR: అందరికీ బంధువవుతాం
‘ఎంతో గుండె ధైర్యంతో తెలంగాణ సాధించామని, ఇప్పుడు అదే దమ్ముతో ఎంత ఖర్చైనా వెనకాడకుండా దళితబంధు పథకం అమలు చేస్తున్నామని, దానిని సంపూర్ణంగా విజయవంతం చేస్తామని’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఏడేళ్లలో రూ. 23 లక్షల కోట్ల సంపద పేదలకు పంచుతాం
నర్సింహులు అణగారిన ప్రజల గొంతుక
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు
తెరాసలో చేరిన మోత్కుపల్లి
తెలంగాణ తెచ్చాక నేను పక్కకు జరుగుదామనుకున్నా.. అయితే కొత్త రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే ఎలా ఉంటుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో నేనే పగ్గాలు చేపట్టా. ఏడ్చేటోడు ఎప్పుడూ ఏడుస్తుంటాడని లెక్క చేయకుండా తెలంగాణను ఓ దారిలో పెట్టా. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.
- సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ‘ఎంతో గుండె ధైర్యంతో తెలంగాణ సాధించామని, ఇప్పుడు అదే దమ్ముతో ఎంత ఖర్చైనా వెనకాడకుండా దళితబంధు పథకం అమలు చేస్తున్నామని, దానిని సంపూర్ణంగా విజయవంతం చేస్తామని’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దయనీయస్థితిలో ఉన్న బలహీనవర్గాలను ఆదుకోడానికి తెచ్చిన ఈ పథకాన్ని, తన ప్రాణం పోయినా ఆపేది లేదన్నారు. ఒక్క దళితబంధుతోనే ఆగిపోబోమని, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు, ఈబీసీ, ఇతర వర్గాల పేదలకు కూడా వర్తింపజేస్తామన్నారు. దళితబంధుకు రూ. 1.73 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని, వచ్చే ఏడేళ్లలో ఇతర వర్గాలకు రూ. 23 లక్షల కోట్ల సంపద పంచుతామన్నారు. తెరాసకు రాజకీయం ఒక యజ్ఞమని, మిగతావాళ్లకు ఒక ఆట అని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని, ఒకసారి గెలుస్తుండొచ్చు, ఒకసారి ఓడుతుండొచ్చు కానీ తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కల్యాణలక్ష్మి వచ్చాక ఎవరైనా కట్నం అడిగితే దవడ వాచేలా కొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాసయే గెలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్లో తెరాసలో చేరారు. సీఎం ఆయనకు గులాబి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు రావని అన్నారు. నేను గొడవపడ్డాను. తెలంగాణ వస్తే అభివృద్ధి జరగదని చిత్రీకరించారు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమం ప్రారంభించాం.
రాష్ట్రంలో ఎస్సీల వద్ద అతి తక్కువగా 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. జనాభాలో అత్యల్పంగా.. 9 శాతం ఉన్న ఎస్టీల వద్ద 22 లక్షల ఎకరాల భూమి ఉంది.
దళితబంధు యజ్ఞం
దళితబంధుకు రూ. 1.7 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ పెట్టుబడి రూ. 10 లక్షల కోట్లు సంపాదిస్తుంది. వచ్చే ఏడేళ్లలో రూ. 23 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అందులో రూ. 1.7 లక్షల కోట్లు పెద్ద ఖర్చుకాదు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి. దళితబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలుంటాయి. పథకాన్ని అవే అమలు చేస్తాయి.
ఎన్నికల కోసం కాదు
దళితబంధు ఆలోచన నాదే. దాన్ని ఎన్నికల కోసం తేలేదు. కొందరికి అవగాహన లేక గందరగోళం చేస్తున్నారు. ఇందులో పార్టీలు లేవు. రాజకీయాలు లేవు. దళితుడు అయితే సరిపోతుంది. దళితబంధును ఆరు నూరైనా ముందుకు తీసుకుపోతాం. బంతిలో కూర్చుంటే.. అందరికీ వంతు వస్తుంది. కులంతో పనిలేదు. పేదరికమే లెక్క. రెడ్డి, వెలమ, బ్రాహ్మణులలో పేదలు లేరా?
కల్యాణలక్ష్మి గురించి ఒకాయన నాతో మాట్లాడుతూ.. ‘కేసీఆరే లక్ష ఇస్తున్నారు. నువ్వేమి ఇస్తామని పెళ్లిచూపుల సందర్భంగా అడుగుతున్నారని’ తెలిపాడు. వాడి పళ్లు ఊడేలా దవడ మీద కొట్టమని చెప్పా.
మోత్కుపల్లికి తగినస్థాయి కల్పిస్తాం
మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి, అణగారిన ప్రజల గొంతుకగా ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరం ఎన్నో ఏళ్లు కలిసి పనిచేశాం. మా స్నేహం రాజకీయాలకు అతీతమైంది. ఆయనకు కరోనా వచ్చినప్పుడు వైద్యులతో మాట్లాడాను. రూ.కోటి ఖర్చయినా ఫర్వాలేదని చెప్పాను. దళితబంధు అమలుకు నిర్ణయించాక ఆయనకు ఫోన్ చేశాను. సమావేశాలకు మోత్కుపల్లి హాజరయ్యారు. రేపు యాదాద్రికి వెళ్తున్నాను. అక్కడికి కూడా ఆహ్వానించాను. రాజకీయాల్లో ఎన్నేళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదు. ఏం సాధించామన్నదే ముఖ్యం. మోత్కుపల్లి సేవలను సద్వినియోగం చేసుకుంటాం’’ అని సీఎం అన్నారు.
తెలంగాణలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారమవుతున్నాయి. రైతులు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయి. మళ్లీ ఊళ్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణకు కావాల్సినవి ఎన్నో ఉన్నాయి. అట్టడుగువర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి.
కేసీఆర్లాంటి సీఎంను చూడలేదు: మోత్కుపల్లి
ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ ‘‘రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్న సీఎం కేసీఆర్. ప్రజలకు కావాల్సింది పేదలను ఆదుకునే నాయకుడు. నా అనుభవంలో కేసీఆర్ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారు. దళితబంధు తెచ్చారు. రైతుబంధు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు తెచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి గొప్ప కార్యక్రమాలు పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ