Yadadri Temple: ముహూర్తం మార్చి 28
‘యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించాలంటే మహాకుంభ సంప్రోక్షణ చేయాలి. విద్వత్సభ, సిద్ధాంతుల సభను సమావేశపరిచిన అనంతరం చినజీయర్ స్వామి వచ్చే ఏడాది మార్చి 28న
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ
అప్పటి నుంచి స్వయంభూ దర్శనాల పునఃప్రారంభం
వారం రోజుల ముందే మహాసుదర్శన యాగానికి శ్రీకారం
విమాన గోపురానికి స్వర్ణ తాపడం
మా కుటుంబం తరఫున తొలి విరాళంగా కిలో బంగారం
సీఎం కేసీఆర్ వెల్లడి
ఈనాడు, నల్గొండ: ‘యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించాలంటే మహాకుంభ సంప్రోక్షణ చేయాలి. విద్వత్సభ, సిద్ధాంతుల సభను సమావేశపరిచిన అనంతరం చినజీయర్ స్వామి వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని ముహూర్తం నిర్ణయించారు. అంతకు వారం రోజుల ముందు మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు పునః ప్రారంభమవుతాయి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ క్రతువుకు 1.50 లక్షల కిలోల నెయ్యి వినియోగిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రసిద్ధ క్షేత్రాలు, వైష్ణవ పీఠాధిపతులు, అమెరికా తదితర దేశాల నుంచి అర్చకులు, అయిదారు వేల మంది రుత్విక్కులు, వారి సహాయకులు రానున్న దృష్ట్యా కొండ కింద ఉన్న 200 ఎకరాల్లో యాగం నిర్వహిస్తామన్నారు. ఆలయ పునఃప్రారంభం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేయాలన్న జీయర్స్వామి సూచన మేరకు ఈ ముహూర్త నిర్ణయం జరిగిందన్నారు. ‘చినజీయర్ స్వామి హైదరాబాద్ సమీపంలోని తమ ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒకే కాలంలో రెండు పెద్ద క్రతువులు నిర్వహించడం సులభం కాదు కనుక, యాదాద్రి ఉద్ఘాటన మార్చి 28న నిర్వహిస్తు’న్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో క్షేత్రానికి చేరుకున్న ఆయన పనుల పరిశీలన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
సమైక్య పాలనలో ఆధ్యాత్మికంగానూ నిర్లక్ష్యమే
‘సమైక్య పాలనలో తెలంగాణ ఆధ్యాత్మికంగానూ నిరాదరణకు గురైంది. శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారికి గతంలో ప్రాధాన్యమివ్వలేదు. స్వరాష్ట్రంలో అమ్మవారి ఖ్యాతిని ప్రాచుర్యంలోకి తెచ్చాం. మహోత్కృష్టమైన ఆలయాల్లో ఒకటైన యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేలా పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్ స్వామి సూచనలతో ఆలయ పనులు జరిగాయి. పునఃప్రారంభం తర్వాత కూడా తదుపరి నిర్మాణాలు కొనసాగుతాయి.’
125 కిలోల బంగారంతో విమాన గోపురం
‘యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించాం. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరం. ఈ పవిత్ర కార్యానికి తొలి విరాళంగా మా కుటుంబం తరఫున ఒక కిలో 16 తులాల బంగారం ఇస్తాం. చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. చినజీయర్ స్వామి పీఠం నుంచి కిలో బంగారం, మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరఫున కిలో, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరఫున కిలో, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి తన రెండు వస్త్ర సంస్థల తరఫున రెండు కిలోలు, కావేరి సీడ్స్ అధినేత భాస్కర్రావు కిలో, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్రావు కిలో బంగారం.. ఇలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నారు.’
ప్రతి గ్రామం భాగస్వామి కావాలి
‘బంగారు తాపడానికి రూ.65 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాదు. కానీ ఈ బృహత్ కార్యంలో ప్రతి గ్రామం భాగస్వామి అయి యాదాద్రి మాది అనే భావన రావాలంటే ఎంతో కొంత విరాళం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాం. రిజర్వు బ్యాంకు నుంచి 125 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని కొని స్వర్ణతాపడానికి ఉపయోగిస్తాం. ఈ క్రతువుకు ఒక కమిటీని నియమిస్తాం.’
గోదావరి నీళ్లతో స్వామివారికి అభిషేకం
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నృసింహ (బస్వాపూర్) జలాశయం పనులు చివరి దశకు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి నిర్మిస్తున్న గండిచెరువు ప్రాంతానికి నిత్యం నీరు సరఫరా అయి కరవు సమస్య తీరుతుంది. పవిత్ర గోదావరి జలాలతో స్వామి వారికి నిత్యం అభిషేకం చేస్తారు. జలాశయం వద్ద రెండు గుట్టలున్నాయి. జలాశయం కింద 250 ఎకరాలు, గుట్టలున్న 200 ఎకరాలు.. మొత్తం 450 ఎకరాలు పర్యాటక శాఖకు అప్పగిస్తాం. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో గొప్ప కట్టడాలను నిర్మిస్తాం. యాదర్షి విశ్వవిద్యాలయం, యోగా కేంద్రం ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తున్నారు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.’
రూ.2 కోట్లతో ఒక్కో కాటేజీ నిర్మాణం
‘ఆలయ నగరిలోని వెయ్యి ఎకరాల్లో రూ.2 కోట్లకు ఒక యూనిట్ చొప్పున 250 కాటేజీల నిర్మాణాన్ని 2-3 రోజుల్లో ప్రారంభిస్తాం. ఒక్కో యూనిట్లో నాలుగు కుటుంబాలు.. అంటే ఒకేసారి వెయ్యి కుటుంబాలు బస చేయొచ్చు. ఆలయ ప్రారంభ ముహూర్తంలోపే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. కాటేజీలు నిర్మిస్తామంటూ ఇప్పటికే 50 మంది దరఖాస్తులిచ్చారు. మంత్రి మల్లారెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్రెడ్డి ఒక్కో కాటేజీ నిర్మిస్తామని చెప్పారు. కొండ కింద బస్బే, దాని పక్కనే కొండపైకి వెళ్లే బస్సు ప్రాంగణం నిర్మిస్తాం. ఆర్టీసీకి రూ.ఆరున్నర కోట్లు ఈ రోజే మంజూరు చేశాం.’
పనుల బాధ్యత మంత్రులకు
‘మార్చి28లోగా అన్ని పనులు పూర్తయ్యేలా మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి జలమండలి అధికారులొస్తారు. ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీతో పాటు, వరదల సమయంలో నీళ్లు పోయేలా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అర్చకుల కోరిక మేరకు వారికి అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం. జర్నలిస్టులకూ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఇళ్ల స్థలాలు కేటాయింపుపై కార్యాచరణ రూపొందిస్తాం’ అని కేసీఆర్ వివరించారు. అంతకుముందు సీఎంకు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గొంగడి సునీత, మండలి మాజీ ఛైర్మన్ గుత్తా తదితరులు స్వాగతం పలికారు. మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు శేఖర్రెడ్డి, జనార్దన్రెడ్డి, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
బాలాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
ఈనాడు, నల్గొండ: యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్ స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి ఆయన వీఐపీ ప్రవేశద్వారం గుండా ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. వ్యూ పాయింట్ల వద్ద ఆగి అక్కడి దృశ్యాలను తిలకించారు. ధ్వజస్తంభం ఏర్పాటు కానున్న వేదికను పరిశీలించి తుది పనులపై సూచనలు చేశారు. బాహ్యవలయ రహదారి నిర్మాణంలో భాగంగా దుకాణాలు కోల్పోయిన వారికి కల్యాణకట్ట సమీపంలో వేయి గజాల చొప్పున కేటాయించి దుకాణాలు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చినజీయర్స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని ఆలయ ఈవో గీతారెడ్డికి సీఎం అందజేశారు. రామలింగేశ్వరాలయంలో అభిషేకం, అర్చన చేసిన సీఎం అక్కడే ఉన్న అతిథి గృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి భోజనం చేశారు. క్షేత్రం చుట్టూ నిర్మించిన బాహ్యవలయ రహదారిపై ప్రయాణిస్తూ కొండ కింద పూర్తయిన కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం నిర్మాణాలను పరిశీలించారు. తుది పనులపై పలు మార్పులు సూచించారు.
భారీగా బంగారం విరాళాలు
తొలి రోజే 22 కిలోలు...
హెటెరో సంస్థ 5 కిలోలు
కిలో ప్రకటించిన హరీశ్రావు, పలువురు ప్రజాప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి తొలి విరాళం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి మంగళవారం యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా సమకూరింది. హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారాన్ని విరాళమివ్వనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, ఏపీలోని కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు.
ఎన్నికల సంఘం పరిధి దాటిందనిపిస్తోంది
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించి... ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించిందేమో అనిపిస్తోంది. దళితబంధు కొనసాగుతున్న పథకం. దళితబిడ్డలెవరూ ఆవేదన చెందవద్దు. నవంబరు 4 తర్వాత అందరికీ స్వయంగా దళితబంధు నిధులను అందజేస్తా. ఎన్నికల సంఘం ఆదేశం చిన్న ఆటంకం మాత్రమే.
- సీఎం కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్