Huzurabad By Election: ఈటలకే జీ హుజూర్
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా... తెరాస, భాజపాల మధ్య నువ్వానేనా అన్నట్లు జరిగిన హోరాహోరీ పోరులో ఈటల ఘన విజయం సాధించారు.
హోరాహోరీ పోరులో తెరాసపై భాజపా విజయకేతనం
హుజూరాబాద్లో 23,855 ఓట్ల ఆధిక్యంతో రాజేందర్ గెలుపు
ధరావతు గల్లంతైన కాంగ్రెస్
మంగళవారం రాత్రి ఫలితం వెలువడిన అనంతరం కరీంనగర్లో నిర్వహించిన విజయోత్సవంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఈటల రాజేందర్, బండి సంజయ్
ఈనాడు డిజిటల్, కరీంనగర్: ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా... తెరాస, భాజపాల మధ్య నువ్వానేనా అన్నట్లు జరిగిన హోరాహోరీ పోరులో ఈటల ఘన విజయం సాధించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నాలుగు నెలలుగా సాగిన ఈ పోరుపై రాజకీయ వర్గాలతోపాటు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొదటినుంచీ ఈటలదే ఆధిపత్యం
మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచి ఈటల ఆధిపత్యం ప్రదర్శించారు. రెండు రౌండ్లు (8, 11) మినహా అన్నింటిలో భాజపా ఆధిక్యాన్ని కొనసాగించింది. తెరాస అభ్యర్థి సొంత గ్రామంలో కూడా భాజపా ఎక్కువ ఓట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడమే కాకుండా కేవలం 3,014 ఓట్లకే పరిమితమైంది. ఈటల రాజీనామాతో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయానికి తెరాస తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ రాజేందర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. హుజూరాబాద్, జమ్మికుంట పురపాలక సంఘాల్లోనూ పట్టును నిరూపించుకొన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామాలవారీగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఆయనకు విజయాన్ని చేకూర్చి పెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2004 నుంచి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఈటలకు ఇది ఏడో విజయం. గతంలో రెండుసార్లు రాజీనామా చేసి గెలుపొందగా, ఇప్పుడు మూడోసారి రాజీనామా చేసి విజయం సాధించారు. ఆరుసార్లు కారు గుర్తుపై గెలిచిన రాజేందర్ ఈ ఉపఎన్నికలో కమలం గుర్తుపై పోటీచేసి గెలుపొందారు.
విజయచిహ్నం చూపుతున్న ఈటల దంపతులు, భాజపా నేతలు ధర్మారావు, వివేక్
తెరాస ఆవిర్భవించిన కొంతకాలానికే ఆ పార్టీలో చేరిన ఈటల అప్పటి నుంచి కీలకనేతగా పని చేశారు. తెరాస శాసనసభ పక్ష నేతగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఆర్థిక, పౌరసరఫరాలు, ఆరోగ్య శాఖల మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఎసైన్డ్ భూములు ఆక్రమించుకొన్నారని ఆయనపై విచారణకు ఆదేశించడంతోపాటు మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో శాసనసభ స్థానానికి రాజీనామా చేసి భాజపాలో చేరి ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. సుదీర్ఘకాలం నియోజకవర్గంలో ఉన్న సంబంధాలను పటిష్ఠం చేసుకొనే ప్రయత్నం చేశారు.
తెరాస, భాజపాతో చెదిరిన కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు నుంచి ప్రచారం వరకూ కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడింది. దీన్ని తెరాస, భాజపాలు అవకాశంగా మలచుకుని పలువురు కాంగ్రెస్ నేతల్ని చేర్చుకున్నాయి. కాంగ్రెస్ స్థానిక నేతల్లో కీలకమైనవారు చాలామంది తెరాసలోనో, భాజపాలోనో చేరిపోవడంతో కాంగ్రెస్కు నియోజవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం సమస్యగా మారింది. నాయకులతో పాటు కాంగ్రెస్ ఓట్లపైనా రెండు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో 69,737 ఓట్లను పొందిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి కేవలం 3014 ఓట్లకే పరిమితమైంది.
సుదీర్ఘ ప్రచారం...అలుపెరుగని నేతలు
జూన్ 12న శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రెండు రోజుల అనంతరం 14న భాజపాలో చేరారు. అప్పటినుంచి హుజూరాబాద్లో ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అధికార తెరాస, భాజపాలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. సుదీర్ఘకాలం ప్రచారం జరిగిన ఎన్నికగా రికార్డు సృష్టించింది. నేతలు అలుపెరగకుండా ప్రచారం చేశారు. ఆగస్టు 11న తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పార్టీ ప్రకటించింది. అంతకుముందు నుంచే తెరాస, భాజపాలు ప్రచారాన్ని చేపట్టాయి. అభ్యర్థుల ఖరారు అనంతరం ప్రచారం తారస్థాయికి చేరుకుంది. కాగా హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా ‘దళితబంధు’ పథకం చర్చనీయాంశమైంది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దీనిని నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బుల పంపిణీతో పాటు అధికార దుర్వినియోగం జరుగుతోందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది
పోస్టల్ ఓట్లతో తెరాసదే పైచేయి
హుజూరాబాద్ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లలో తెరాస ఎక్కువ దక్కించుకుంది. తెరాసకు 455 ఓట్లు రాగా, భాజపాకు 242 ఓట్లు, కాంగ్రెస్కు రెండు ఓట్లు వచ్చాయి.
రాత్రి 7 గంటల వరకు లెక్కింపు
కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. మొత్తం 14 టేబుళ్లపై ఈ ప్రక్రియను 22 రౌండ్లుగా చేపట్టారు. 306 పోలింగ్ బూత్లలో ఉన్న ఓట్లను లెక్కించేందుకు ప్రతి రౌండ్కు అరగంట నుంచి ముప్పావుగంట సమయం పట్టింది. 30 మంది అభ్యర్థులుండటం వల్ల ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండేసి ఈవీఎంలలో ఉన్న అభ్యర్థుల ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. దీంతో అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా ఫలితాలు బయటకు వచ్చాయి.
* కౌంటింగ్ కేంద్రానికి ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ వచ్చి ఓట్ల సరళిని చూసి వెళ్లిపోయారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి రాలేదు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఫలితం వెలువడిన తర్వాత లెక్కింపు కేంద్రానికి వచ్చి ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
27 మందికి 11,726 ఓట్లు
నోటాకు 1036 ఓట్లు
ఈనాడు, హైదరాబాద్: భాజపా, తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా మిగిలిన 27 మందికి 11,726 ఓట్లు పోలయ్యాయి. లెక్కించిన 2,05,965 ఓట్లలో భాజపా, తెరాస, కాంగ్రెస్లకు 1,93,203 ఓట్లు రాగా నోటాకు 1036 ఓట్లు పోలయ్యాయి. ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్, స్వతంత్ర అభ్యర్థి సాయన్నలు పలు రౌండ్లలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్కు 119 ఓట్లు రాగా శ్రీకాంత్కు 122 వచ్చాయి. ఏడో రౌండ్లో కాంగ్రెస్కు 94 రాగా.. ఆయనకు 98 ఓట్లు లభించాయి. ఎనిమిదో రౌండ్లో కాంగ్రెస్కు 89 ఓట్లు పోలవగా సాయన్నకు 118, శ్రీకాంత్కు 92 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లోనూ కాంగ్రెస్ కన్నా వారు ముందు నిలిచారు. 19, 20 రౌండ్లలో సాయన్న కాంగ్రెస్ కంటే ఎక్కువే సాధించారు. సాయన్న 1,942 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం