Viveka Murder Case: ఆ 3 రోజుల్లోనే వివేకాను హత్య చేయాలన్నారు
‘మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటివద్ద నైట్ వాచ్మన్గా పనిచేసే పి.రాజశేఖర్ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారు.
నైట్వాచ్మన్ మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నాడు..
సమాచారమిచ్చిన వివేకా పీఏ కృష్ణారెడ్డి
అతను తిరిగొచ్చేలోగానే హత్య చేయాలని గంగిరెడ్డి మాకు చెప్పారు
పులివెందుల కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో షేక్ దస్తగిరి వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటివద్ద నైట్ వాచ్మన్గా పనిచేసే పి.రాజశేఖర్ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆ మూడు రోజుల్లోనే వివేకాను చంపేయాలని, అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని గంగిరెడ్డి నాతోనూ, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డిలతోనూ చెప్పారు’ అని ఈ కేసులో నిందితుడు, అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి వెల్లడించారు. వివేకా హత్యకు 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ప్రణాళిక రూపొందిందని చెప్పారు. వివేకా ఇంట్లోకి వెళ్లటానికి నైట్వాచ్మన్ రాజశేఖర్, జిమ్మి అనే కుక్కే అడ్డంకిగా ఉంటాయని తాను ఎర్ర గంగిరెడ్డితో చెప్పానని పేర్కొన్నారు. అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డితో మాట్లాడి, వాచ్మన్ను అక్కడ లేకుండా చేస్తానని గంగిరెడ్డి చెప్పారన్నారు. తర్వాత 2019 మార్చి 1 నుంచి గంగిరెడ్డి వివేకా వెంటే ఉంటూ.. ఆయన ఆనుపానుల్ని సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డిలతో పాటు తనకూ చెప్పేవాడని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న సీఆర్పీసీలోని సెక్షన్ 306(4)(ఏ) కింద పులివెందుల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ ప్రతులు తాజాగా వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివీ..
మళ్లీ అనుమానం ఎందుకు?
వివేకాను చంపాలని గంగిరెడ్డి చెప్పిన రెండు, మూడు రోజుల తర్వాత సునీల్యాదవ్ ఓ రోజు నాకు రూ.కోటి ఇచ్చారు. ఇంత డబ్బెవరిచ్చారని అడిగాను. ‘దేవిరెడ్డి శివశంకర్రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డికి ఇస్తే ఆయన నాకు ఇచ్చాడు’ అని సునీల్ చెప్పాడు.తర్వాత వివేకానందరెడ్డిని హత్య చేయాలా?వద్దా? అనేది నిర్ధారించుకోవడానికి సునీల్ను సంప్రదించాను. అతను నన్ను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లి, శివశంకర్రెడ్డికి ఫోన్ చేశాడు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘గంగిరెడ్డి చెప్పింది చేయండి. మేం ఉన్నామని చెప్పాం కదా. మళ్లీ అనుమానం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
డబ్బులు కావాలంటే అడగమన్నారు..
వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లాక నేను, సునీల్, ఉమాశంకర్రెడ్డి.. ఈశ్వరయ్యతోటలో కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని కలిశాం. సీబీఐకి కేసు అప్పగించారు కదా.. మా పరిస్థితి ఏంటని అడిగాం. ‘మేం చూసుకుంటాం లే. ఇబ్బంది లేదు. డబ్బులేవైనా కావాలంటే అడగండి ఇస్తాం’ అని మాతో అన్నారు.
* 2020 మార్చి 3న దిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నాకు నోటీసిచ్చింది. దాన్ని పట్టుకుని బయపురెడ్డి ఇంట్లో శివశంకర్రెడ్డిని కలిశాను. ‘సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా మా పేర్లు బయటపెట్టకు. నీకు కావాల్సినంత డబ్బిస్తాం. జీవితం సెటిల్ చేస్తాం. నీతోపాటు భరత్యాదవ్ కూడా దిల్లీ వస్తాడు. సీబీఐ వాళ్లు నిన్ను ఏం అడుగుతున్నారో ఆ వివరాలు మాకు చెబుతాడు’ అని శివశంకర్రెడ్డి, బయపురెడ్డి, విద్యారెడ్డి నాతో చెప్పారు. నాలుగైదు రోజులపాటు భరత్ నాతో దిల్లీలోనే ఉన్నాడు.తర్వాత సీబీఐకి అనుమానం వస్తుందేమోనని పులివెందులకు వచ్చేశాడు. నేను దిల్లీలో రెండున్నర నెలలున్నా సీబీఐ అధికారులకు నిజం చెప్పలేదు. పులివెందులకు తిరిగొచ్చాక భరత్యాదవ్, బయపురెడ్డి నన్ను కలిసి సీబీఐ అధికారులతో ఏం చెప్పావు? అని ఆరా తీశారు. ఏమీ చెప్పలేదన్నాను.
వాంగ్మూలం ఏమిచ్చావని అడిగారు..
కడపలో సీబీఐ అధికారుల విచారణలో వారితో నిజం చెప్పాను. ప్రొద్దుటూరు కోర్టులో జడ్జి ఎదుట అదే విషయమై వాంగ్మూలం ఇచ్చాను. ఆ తర్వాత భరత్యాదవ్, శివశంకరెడ్డి నన్ను కలిశారు. వాంగ్మూలంలో ఏం చెప్పావని అడిగారు. ప్రాణభయంతో నిజం చెప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి తప్ప ఇంకేమీ చెప్పలేదన్నాను.
అవినాష్రెడ్డి రమ్మంటున్నారని పిలిచారు
కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి.. తోట దగ్గరకు రమ్మంటున్నారంటూ ఓరోజు భరత్ యాదవ్ నన్ను పిలిచాడు. నేను వెళ్లలేదు. తర్వాత భరత్, పులివెందులకు చెందిన న్యాయవాది ఓబుల్రెడ్డి నన్ను హెలిప్యాడ్ వద్దకు పిలిచారు. ఓబుల్రెడ్డి నాతో మాట్లాడుతూ.. ‘జడ్జి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం యథాతథంగా నాతో చెప్పు’ అని అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చెప్పానన్నాను.‘జాగ్రత్త. అనవసరపు మాటలు మాట్లాడకు’’ అని ఓబుల్రెడ్డి నన్ను హెచ్చరించారు. తర్వాత పులివెందులలో సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి తరఫు న్యాయవాదులు నా వాంగ్మూలాన్ని బహిర్గతం చేశారు. అప్పుడు భరత్ నా ఇంటికొచ్చి ‘నువ్వు వాళ్ల మీద చెప్పి.. చాలా పెద్ద తప్పుచేశావ్. వాళ్లు నిన్ను చంపేస్తారు. ప్రెస్మీట్ పెట్టి ఇప్పటి వరకూ చెప్పిందంతా అబద్ధమని చెప్పు. నీకు డబ్బు, ఇంకేం కావాలన్నా చేయిస్తాను’ అన్నాడు. నన్ను చంపేస్తామని ఈ రోజుకీ బెదిరిస్తున్నారు. భద్రత కల్పించాలని సీబీఐ ఎస్పీ, కడప ఎస్పీకి లేఖ రాశాను. అయినా పట్టించుకోవట్లేదు.
ఎన్నికల్లో గెలిస్తే నీకు డబ్బులిస్తానన్నారు
వివేకాను హత్య చేసిన రోజు రాత్రి గంగిరెడ్డి బెంగళూరు భూ వివాదం సెటిల్మెంట్కు సంబంధించిన డబ్బులివ్వాలని వివేకాను అడిగారు. ‘ఆ డబ్బులు ఎందుకు అడుగుతావ్. నీకు ఇచ్చేవైతే ఇచ్చేస్తాను కదా! ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. దానిలో పెడితే ఎక్కువ వస్తాయి. అందులో గెలిస్తే నీకు డబ్బులిస్తా’’ అని వివేకా గంగిరెడ్డితో అన్నారు. వివేకాను అంతమొందించాక వై.ఎస్.రాజారెడ్డి ఆసుపత్రిలోని బాత్రూమ్లోకి వెళ్లి నా దుస్తులపై పడిన రక్తపు మరకల్ని, ముఖం, కాళ్లూ, చేతులూ కడుక్కున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా