Telangana News: హైదరాబాద్లో అన్నారు.. జామ్నగర్కు మార్చారు
తెలంగాణకు దక్కాల్సిన ప్రతిష్ఠాత్మక సంస్థ కేంద్రం నిర్ణయంతో చేజారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నెలకొల్పాలని సంకల్పించిన ‘అంతర్జాతీయ సంప్రదాయ
అంతర్జాతీయ సంప్రదాయ వైద్యకేంద్రం ఏర్పాటుపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
స్థల పరిశీలన దశలో అనూహ్య నిర్ణయం
కేంద్రానిది పక్షపాత బుద్ధి: మంత్రి హరీశ్
ఈనాడు - హైదరాబాద్: తెలంగాణకు దక్కాల్సిన ప్రతిష్ఠాత్మక సంస్థ కేంద్రం నిర్ణయంతో చేజారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నెలకొల్పాలని సంకల్పించిన ‘అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం (గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్)’ గుజరాత్లోని జామ్నగర్కు తరలుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వైద్యసంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆయుష్ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దానిపై రాష్ట్రసర్కారు కసరత్తు చేస్తుండగానే.. కేంద్రం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తొలిదశ ముగిసిన అనంతరం 2020 డిసెంబరులో అన్ని రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో తొలిసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వైద్యానికి పెరిగిన ప్రాధాన్యత దృష్ట్యా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విభాగంలో అంతర్జాతీయ కేంద్రాన్ని నెలకొల్పాలని భావిస్తోందని తెలిపారు. భారత్లో స్థాపనకు ఆసక్తి చూపిస్తోందని వెల్లడించారు. దీంతో ఈ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వివరించారు. హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకమైన సీసీఎంబీ, సీఎస్ఐఆర్, ఐఐటీ, డీఆర్డీఓ తదితర సంస్థలున్నాయని, అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం పరిశోధనలకు అనువుగా ఉంటుందని వివరించారు. సానుకూలంగా స్పందించిన ప్రధానమంత్రి మోదీ ఆ మేరకు కేంద్ర ఆయుష్శాఖకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం 2021 జనవరిలో కేంద్ర ఆయుష్శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ వచ్చింది. ఆ వెంటనే రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ దీనిపై ప్రతిపాదనలు రూపొందించింది. ఈ సంస్థ ఏర్పాటుకు 40-50 ఎకరాలు అవసరమవడంతో తొలుత దానిపై దృష్టిపెట్టింది. రంగారెడ్డి జిల్లా హిమాయత్సాగర్ గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదన వచ్చినా.. ఆ స్థలాన్ని ఇప్పటికే ‘బయోసిన్ మెడికల్ బొటానికల్ పార్క్’కు కేటాయించి ఉండడంతో ఆ ప్రతిపాదన వాయిదాపడింది. అనంతరం హైదరాబాద్ ఐడీపీఎల్ సంస్థలోని ఖాళీ స్థలం కేటాయింపుపై పరిశీలన జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి త్వరగా స్థలాన్ని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఐడీపీఎల్ స్థలం గ్రీన్జోన్గా పరిగణనలో ఉండడంతో.. ఇదే విషయాన్ని చెబుతూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఈ నెల 2న కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాశారు. మరో అనువైన ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి సహకారాన్నైనా అందివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ సైతం ఇవే విషయాలను వివరిస్తూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శికి అధికారికంగా లేఖ రాశారు. ఇలా ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతుండగానే.. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని గుజరాత్కు తరలిస్తూ కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తెలంగాణకు మరోసారి మొండిచేయి
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి పక్షపాత బుద్ధిని ప్రదర్శించిందని, అన్ని విషయాల్లోనూ మొండిచేయి చూపుతోందని రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలో అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం స్థాపనకు స్థలం, వసతులు తదితర ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినా.. గుజరాత్కు తరలించడం.. తెలంగాణకు చేసిన ద్రోహమేనని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వరుస అన్యాయాలపై భాజపా నేతలు నిలదీయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!