YS Viveka Murder Case: వివేకా హత్యకు పథక రచన జగన్దేనేమో!
ఎన్నికల్లో గెలిచేందుకు జగనే... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ‘2018లో జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది.
ఎన్నికల్లో గెలుపు కోసం కోడికత్తి కేసులానే దీన్నీ చేసుంటారు
అప్పట్లో జగన్కు చికిత్స చేసిన వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్రెడ్డి
ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్, కడప: ఎన్నికల్లో గెలిచేందుకు జగనే... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ‘2018లో జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది. జగన్ భుజానికి గాయమైంది. అది తన మెడపై తగలాల్సిందని, తాను వేగంగా స్పందించి చేయి అడ్డుపెట్టడం వల్ల చేతికి గాయమైందని జగన్ అప్పట్లో చెప్పారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకుని, హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తనకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు (డాక్టర్ సాంబశివారెడ్డిని మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్గా, డాక్టర్ చంద్రశేఖర్రెడ్డిని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా నియమించారు) ఇచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవహారాల్ని పర్యవేక్షించే బాధ్యతల్ని వారికి అప్పగించారు. ఆ దాడి లాగే, ఎన్నికల్లో గెలవడం కోసం మా మామ హత్యకూ జగనే పథక రచన చేసి ఉంటారు’ అని రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.వివేకా హత్యలో కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని అప్పట్లోనే సందేహించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్రెడ్డి ఓడిపోయేవారని అని అన్నారు.‘వివేకా చనిపోయాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేయడానికి 2019 మార్చి 23న నేను, సునీత సైబరాబాద్ పోలీసుస్టేషన్కు బయల్దేరాం. అంతలో వైఎస్ భారతి, విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి మా ఇంటికి వచ్చారు. వివేకా హత్యకు సంబంధించి మేం ఏ చేసినా సజ్జలకు చెప్పాలని భారతి సూచించారు. అప్పటికి మాకు కుటుంబ సభ్యులెవరిపైనా సందేహాల్లేవు. అప్పట్లోనే సందేహం వ్యక్తంచేస్తే జగన్, అవినాష్రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బంది పడేవారు’ అని పేర్కొన్నారు. ‘వివేకా హత్య జరిగిన రోజు.. జగన్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి పులివెందుల చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలో సజ్జలతో చర్చించారు. అప్పటికి వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ నాకు, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆ లేఖ గురించి ప్రస్తావించారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడటం మాకు నచ్చలేదు. అదే విషయాన్ని ఆ తర్వాత ఆయనకు చెప్పాను’ అని రాజశేఖర్రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు
‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వివేకాకు అసలు ఇష్టం లేదు. ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. జగన్ ఒత్తిడి మేరకే పోటీ చేశారు. అమెరికాలో ఉన్న నాకు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ చేసి... వివేకాను పోటీకి ఒప్పించాలని కోరారు. తెదేపా నాయకులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చేతులు కలిపారని, వివేకా అయితేనే గెలవగలరని చెప్పారు. ఆ ఎన్నికల్లో తనకంటే బలహీన అభ్యర్థి అయిన బీటెక్ రవిపై కేవలం 30 ఓట్ల తేడాతో వివేకా ఓడిపోయారు. అవినాష్రెడ్డి కుటుంబానికి ఎర్ర గంగిరెడ్డి దగ్గరయ్యాడని తెలిసింది. ఆ ఎన్నికల తర్వాత ప్రొద్దుటూరులో తన సోదరుడి పేరు మీద ఎర్ర గంగిరెడ్డి రూ.కోటి విలువైన వ్యవసాయ భూములు కొన్నాడు. ఆ ఎన్నికల్లో వివేకా కోసం కాకుండా, తన కోసం పనిచేసేందుకు శివశంకర్రెడ్డికి రూ.70 లక్షలిచ్చానని బీటెక్ రవి నాకు చెప్పారు. మా బంధువులైన భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలతో పాటు, శివశంకర్రెడ్డి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని ఓట్లు వివేకాకు పడకుండా చేయడం వల్లే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చడానికి మేం హైదరాబాద్లోని రెండు ఇళ్లు, ఒక ఫ్లాటు, హిమాచల్ ప్రదేశ్లోని జల విద్యుత్ కేంద్రంలో 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చింది’ అని వాంగ్మూలంలో రాజశేఖర్రెడ్డి వివరించారు.
వివేకాతో వారికి ఎప్పటి నుంచో విభేదాలు
‘వివేకానందరెడ్డికి, భాస్కర్రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. 2017లో ప్రభుత్వ భూమిని స్థానిక శ్రీకృష్ణ ఆలయ కమిటీకి కేటాయించేలా వివేకా ప్రయత్నించారు. అది అవినాష్రెడ్డికి ఇష్టం లేదు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. తాను కుటుంబసభ్యుల కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారు తనంటే అసూయతోనే ఉంటున్నారని చనిపోవడానికి 2, 3 నెలల ముందు వివేకా నాతో చెప్పి బాధపడ్డారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి బతికున్నప్పుడు... ఆయన, వివేకా ఒకరికి ఒకరు బాసటగా నిలిచేవారు. ఒకరు ఎంపీగా పోటీ చేస్తే, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అవసరాన్ని బట్టి అటూ ఇటూ మారేవారు. రాజశేఖర్రెడ్డి మరణించాక... ఆ స్థానం నుంచి పోటీకి భాస్కర్రెడ్డి పేరును జగన్ ప్రతిపాదించారు. కానీ వివేకాకు అది ఇష్టంలేదు. భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డిల అభిమతానికి విరుద్ధంగా వివేకా ఒక భూ వివాదం సెటిల్మెంట్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వారు మరింత కక్ష పెంచుకున్నారు’ అని తెలిపారు.
రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు
‘వివేకా హత్య జరిగిన రోజు కడప మాజీ మేయర్ సురేష్, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి ఒక కంప్లెయింట్ రాసుకుని వచ్చి, నా భార్య సునీతను సంతకం పెట్టాలన్నారు. దానిలో తెదేపా నాయకులు సతీష్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారు. ఆ ముగ్గురూ తెదేపా నాయకులు కావడంతో ఈ నేరం వారే చేశారనడానికి నిర్ధిష్టమైన ఆధారమేదీ లేకపోయినా, కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పుతున్నారని గుర్తించడంతో ఆమె సంతకం చేయలేదు’ అని రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
గుండెపోటు అని నేనెప్పుడూ చెప్పలేదు
‘2019 మార్చి 15న నేను సీఐ శంకరయ్యకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుగులో రాసి ఉన్న ఒక కాగితాన్ని నాకు సీబీఐ అధికారులు చూపించారు. ఆ రోజు నేను ఎలాంటి స్టేట్మెంటూ ఇవ్వలేదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి వేకువజామునే బయల్దేరామని, వివేకా హత్య గురించి కృష్ణారెడ్డి ఫోన్ చేసే సమయానికే మేం కర్నూలుకు చేరుకున్నామని రాసి ఉంది. ఆ రోజు ఉదయం 6.15కి కృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి హైదరాబాద్లోనే ఉన్నాం. 7.30కి హైదరాబాద్ నుంచి బయల్దేరాం. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని, మంచం మీద నుంచి కింద పడటం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయని నేను అన్నట్టుగా రాశారు. అదీ నిజం కాదు. నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2019 మార్చి 29న పులివెందుల ఎస్డీపీవో డి.నాగరాజాకి నేను మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అదీ నిజం కాదు. దాన్నీ సృష్టించారు. 2019 మార్చి 15న సీఐ శంకరయ్య నాకు నోటీసు ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. నాకు పోలీసులు ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. కేసును తప్పుదారి పట్టించేందుకే పోలీసులే ఆ తప్పుడు స్టేట్మెంట్లన్నీ సృష్టించారు’ రాజశేఖర్రెడ్డి అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)