Bandi Sanjay: రైతుల జీవితాలతో సీఎం చెలగాటం
‘‘ధాన్యం దిగుబడి అధికంగా వచ్చే పశ్చిమబెంగాల్, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లేని కొనుగోళ్ల వివాదం ఇక్కడే ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రీ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వానాకాలం పంటకొంటారో, కొనరో స్పష్టంగా చెప్పాలి.
ప్రశ్నిస్తే మమ్మల్ని వెంటాడి.. వేటాడతారా?
ధాన్యంపై ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య ఇక్కడే ఎందుకు?
ఫాంహౌస్ నుంచి సీఎంను ధర్నాచౌక్కు తీసుకువస్తున్నాం
కేసీఆర్ చలవతో 88 అసెంబ్లీ సీట్లకు చేరుకుంటాం: బండి సంజయ్
విలేకరులతో మాట్లాడుతున్న బండి సంజయ్. పక్కన ఎమ్మెల్యే రాజాసింగ్
ఈనాడు, హైదరాబాద్: ‘‘ధాన్యం దిగుబడి అధికంగా వచ్చే పశ్చిమబెంగాల్, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లేని కొనుగోళ్ల వివాదం ఇక్కడే ఎందుకు వస్తోంది? ముఖ్యమంత్రీ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వానాకాలం పంటకొంటారో, కొనరో స్పష్టంగా చెప్పాలి. ధాన్యం కొనుగోళ్లు జరుగుతుంటే ఆరుగురు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? రైతుల సమస్య గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని వెంటాడతారా? వేటాడతారా? మీ బెదిరింపులు మానుకోవాలి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం సాయంత్రం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు... ‘‘ముఖ్యమంత్రిని బయటకు తీసుకువస్తామని చెప్పినట్లుగానే చేశాం. ప్రజల్లోకి రాకుండా ఫాంహౌస్లో ఉండే సీఎంను ప్రగతిభవన్కు, ఇప్పుడు రోడ్ల్లపైకి తీసుకువచ్చాం. ధర్నాచౌకే అవసరం లేదన్న ఆయనను అక్కడికే తీసుకువస్తున్నాం. ఇది ప్రజల, భాజపా విజయం. ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం ధాన్యం కొనుగోళ్లపై లేని సమస్యను సృష్టిస్తున్నారు. వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి? కొనడానికి డబ్బుల్లేవా?’ ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. మీరు, మేం కలిసి రైతుల్ని ఆదుకుందాం. వానాకాలం పంటను వెంటనే కొనుగోలు చేయాల్సిందే.
సమస్యలు సృష్టించే సీఎం అవసరమా?
‘‘బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఎం దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఉద్యోగాల భర్తీ, దళితులకు మూడెకరాల భూమి, తెలంగాణ అంతటా దళితబంధు కోసం పోరాడుతాం. మమ్మల్ని, యువతను, ప్రజలను వేటాడతావా? ఇలా భయపెట్టే, సమస్యలు సృష్టించే సీఎం రాష్ట్రానికి అవసరమా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా పర్యటన విజయవంతమైంది. సీఎం భాష మార్చుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నా. బెంగాల్లో కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో 88 సీట్లు గెలుచుకున్నాం. సీఎం నోటి చలవవల్ల తెలంగాణలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలున్న భాజపా బలం 88 సీట్లకు పెరుగుతుంది. వరి వేస్తే ఉరి అన్నోళ్లకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం దేనికి సంకేతం? ప్రధానికి లేఖ రాయడం సంతోషం. రాళ్లతో కొట్టించింది ఎవరు? రైతులతో నేను మాట్లాడుతుంటే తెరాస కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. పేదల కోసం దాడులు ఎదుర్కొనేందుకు మేం సిద్ధమే. మా కార్యకర్తలు పది మంది తలకాయలు పగిలాయి. 77 మంది వరకు గాయపడ్డారు. చేతుల్లో కట్టెలు, రాళ్లతో ఉన్నవాళ్లు రైతులా? సీఎం సమాధానం చెప్పాలి. మాపై తెరాస కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తెరాస పోలీసింగ్ అయ్యింది’’ అని సంజయ్ విమర్శించారు.
అధిష్ఠానానికి నివేదిక
ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి తెలుసుకోవడానికి బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా జరిగిన ఘటనలపై భాజపా రాష్ట్ర శాఖ నివేదిక రూపొందించి జాతీయ పార్టీకి పంపించింది. ఘటనలకు సంబంధించి ఫొటోలు, వీడియో క్లిప్పింగ్లను జతచేశారు.
బండి సంజయ్ సహా భాజపా, తెరాస కార్యకర్తలపై కేసులు
వేములపల్లి, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా భాజపా, తెరాస కార్యకర్తలపై మరో కేసు నమోదైంది.సంజయ్ ఈ నెల 15న నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో ఓ రైస్మిల్లు వద్దకు వచ్చారు. ఆ సమయంలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీనిపై సంజయ్ను ఏ1గా చేర్చుతూ భాజపా, తెరాస కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు వేములపల్లి ఎస్సై డి.రాజు తెలిపారు.
* స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించీ బండి సంజయ్పై కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట నుంచి చివ్వెంల వరకు భారీ కాన్వాయ్తో వెళ్లినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాసు తెలిపారు. ఇదే తరహాలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, ఆత్మకూర్ (ఎస్), తిరుమలగిరి, మద్దిరాల తదితర మండలాల్లోనూ కేసులు నమోదైనట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి