Agnipath: ఆర్మీలో ఉద్యోగం ఇక కల్ల..!
వారంతా ఆర్మీ ఉద్యోగప్రయత్నంలో సగం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారే. తమ పరీక్షను రద్దు చేశారని ఆవేశంలో చేసిన తప్పిదం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితిలో ఇరుక్కున్నారు. సికింద్రాబాద్
రైల్వేస్టేషన్ విధ్వంస కారకులపై 14 సెక్షన్లు
ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణ శిక్ష
ఈనాడు, హైదరాబాద్ : వారంతా ఆర్మీ ఉద్యోగప్రయత్నంలో సగం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారే. తమ పరీక్షను రద్దు చేశారని ఆవేశంలో చేసిన తప్పిదం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితిలో ఇరుక్కున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసరచనకు పూనుకున్న వారిపై జీఆర్పీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇరుక్కుంటే ఆర్మీ ఉద్యోగాలు చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకూ ఇబ్బందులు తప్పవు. ఈ ఘటనలో నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరు ఇదివరకటిలా పరుగెత్తడం.. హైజంప్, లాంగ్జంప్ లాంటివి చేయడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. పైగా రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినందుకు.. వీరిపై మాత్రం ఐపీసీ, భారతీయ రైల్వే చట్టం(ఐఆర్ఏ)లోని 14 సెక్షన్లను ప్రయోగించారు. ఐఆర్ఏ సెక్షన్లు చాలా కఠినంగా ఉంటాయి. ఇవి చాలా వరకు నాన్బెయిలబుల్ సెక్షన్లే. ఐఆర్ఏ 150(హానికరంగా రైలును ధ్వంసం చేయడం) సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!