Chinna Jeeyar Swamy: మా మాటలను వక్రీకరించారు
‘ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి సబబా, కాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. ఆదివాసీలకు.. మహిళలకు అగ్రాసనం ఉండాలన్న సంప్రదాయాల్లోంచి వచ్చిన వాళ్లం. అలాంటి వారిని చిన్నచూపు చూసేలా మాట్లాడే
సమ్మక్క-సారలమ్మలపై 20 ఏళ్ల క్రితం అన్న విషయమది
మధ్యలోంచి ఓ మాటను తెచ్చి ప్రచారం చేస్తున్నారు
ఎవరితోనూ విభేదాలు లేవు.. వారు పెట్టుకుంటే ఏమీ చేయలేం
విలేకరులతో చినజీయర్ స్వామి
ఈనాడు, అమరావతి: ‘ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి సబబా, కాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. ఆదివాసీలకు.. మహిళలకు అగ్రాసనం ఉండాలన్న సంప్రదాయాల్లోంచి వచ్చిన వాళ్లం. అలాంటి వారిని చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ అన్న నినాదంతో ముందుకెళ్తున్నాం. ఎప్పుడైనా ఒక మాట విన్నప్పుడు.. దానికి పూర్వాపరాలు చూడాలి. ఎక్కడో మధ్యలో ఒక మాటను తీసుకుని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీలనే కాదు, ఎప్పుడూ ఎవరినీ కించపర్చలేదు. 20 ఏళ్ల క్రితం సమ్మక్క సారలమ్మ దేవతలపై అన్న మాట గురించి ఇలా వచ్చిందని మావాళ్లు చెప్పారు. ‘ఆ దేవతలు స్వర్గం నుంచి దిగిరాలా. మనుషుల్లో నుంచే వచ్చారు. వారికి ఉండే గుణాల వల్ల దేవతలయ్యారు. అలాంటివారిని మధ్యలో పెట్టుకుని మనం అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించొద్దు’ అని మాత్రమే అన్నాం. అది తప్పా? విషయం తెలుసుకోకుండా అందులోని ఒక మాటను పట్టుకుని ఇప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గుంటూరు జిల్లా సీతానగరంలో విజయకీలాద్రిపై విలేకర్లతో మాట్లాడారు.
‘‘ఇటీవల సమతామూర్తి కార్యక్రమం జరిగింది. దీని గురించి యావత్తు ప్రపంచం మాట్లాడుకుంటోంది. అది సహించలేనివారే గ్రామ దేవతలను తూలనాడినట్లు, తద్వారా ఆదివాసీలను అవమానించినట్లు చెబుతున్నారు. గిరిజనుల కోసం పాఠశాలలు, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేశాం. జనాన్ని ప్రభావితం చేసే దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎన్నడూ ప్రోత్సహించం. ఆ పేరుతో జరిగే అరాచకాలను అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది. దీనిని అర్థం చేసుకోలేని వ్యక్తుల వివేచనకే వదిలేస్తున్నా. పనిగట్టుకుని దీన్నో పెద్దఅంశంగా చిత్రీకరించడం తగదు. సమాజహితంపై కాంక్ష ఉండేవారైతే వచ్చి మాట్లాడాలి.
జ్ఞానంలో ఉన్నతులైతే.. హరిజనులు, గిరిజనులు, అన్ని వర్గాల వారికీ గౌరవం ఇవ్వాలని రామానుజులు ఎప్పుడో చెప్పారు. 1938లోనే పెదజీయర్ స్వామి.. దేశంలోనే మొదటిసారిగా ఆదివాసీలకు పక్కా ఇళ్లతో కాలనీని మండపేట సమీపంలోని అర్తమూరులో నిర్మించారు. ఇదే స్ఫూర్తితో 2004లో ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు విద్య అందించేందుకు పాఠశాలను ప్రారంభించాం. మహిళల సమానతకు ప్రాధాన్యమిచ్చే సంప్రదాయం మాది’’ అని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు.
యాదాద్రి ప్రారంభోత్సవ ఆహ్వానంపై..
యాదాద్రి ప్రారంభోత్సవ ఆహ్వానంపై.. ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘మేం ఎందులోనూ పూసుకు తిరిగేవాళ్లం కాదు. అడిగితే సలహా చెప్పడం, చేసి పెట్టడం మా బాధ్యత. అలా బాధ్యత తీసుకుంటే నూటికి నూరుశాతం న్యాయం చేస్తాం. బాధ్యత కావాలని వెంటపడి పాకులాడే అలవాటు లేదు’’ అని బదులిచ్చారు.
* సమ్మక్క సారలమ్మకు సంబంధించి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని వీడియోలో మాట్లాడారు కదా.. మీరు సమతామూర్తి దర్శనానికి టికెట్ పెట్టారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘దర్శనానికి టికెట్ పెట్టలేదు. అదో పెద్ద ప్రాంగణం. రుసుము లేకపోతే అంతమందిని నియంత్రించడం కష్టమని.. సామాన్యులకూ అందుబాటులో ఉండాలనే రూ.150 ప్రవేశ రుసుముగా నిర్ణయించాం. అదీ నిర్వహణ కోసమే. ప్రసాదాలు, పూజలు... ఇలా లోపలన్నీ ఉచితమే’ అని అన్నారు.
* ఎక్కువగా రాజకీయ నేతలతో మసలుతున్నారు. మున్ముందు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. ‘మేం రాజకీయాలకు ఎప్పుడూ దూరమే. మేం భిక్షా సన్యాసులం. రాజకీయాల్లోకి వెళ్లాలని మనసులో ఎప్పుడూ లేదు. రాదు కూడా’ అని సమాధానమిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు...
‘‘మాకు ఎవరితోనూ విభేదాలు ఉండవు. వాళ్లు ఏమైనా పెట్టుకుంటే ఏమీ చేయలేం. మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగేవాళ్లం. అలా ఉంటాం కనకే ఇలాంటి విషయాలు మాట్లాడగలుగుతున్నాం. లేనిపక్షంలో వాళ్లకి, వీళ్లకి భయపడుతూ ఎక్కడో మూలకు నక్కి మాట్లాడతారు. సక్రమమైన మార్గంలో నడవడం లేదని భావిస్తే చెప్పడం మాలాంటి వాళ్ల బాధ్యత. సమాజానికి మేం కళ్ల లాంటి వారం. నువ్వు నడుస్తున్నప్పుడు కాలులో ఏం గుచ్చుకుంటుందో చెప్పడం మా బాధ్యత. దాన్ని గుర్తించకుండా వెళ్లి తొక్కుతాను అంటే.. రక్తం కారేది కాళ్లకే. కానీ.. కన్నీరు కార్చేది కళ్లే’’ అని చిన జీయర్స్వామి బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు