CM KCR: కేంద్రంతో చి‘వరి’గా తేల్చుకుంటాం
అన్ని రాష్ట్రాల నుంచి సేకరించినట్లే తెలంగాణ నుంచి వార్షిక ధాన్యం సేకరణ లక్ష్యం ఎంతో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆలస్యమైతే రైతుల్లో అయోమయం నెలకొంటుందని.
ధాన్యంపై ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించలేదు
మంత్రులు, ఎంపీలు, అధికారులతో నేడు దిల్లీకి....
ప్రధానిని, కేంద్రమంత్రిని కలిసి స్పష్టత కోరతాం
వ్యవసాయ చట్టాల రద్దు రైతుల అద్భుత విజయం
ఆ ఉద్యమ అమరుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున సాయం
కనీస మద్దతు ధర చట్టాన్నీ తీసుకురావాలి
వానాకాలంలో పండిన ప్రతిగింజా కొంటాం: సీఎం కేసీఆర్
సాగు చట్టాలపై కేంద్రానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావడం సంతోషం. విద్యుత్ చట్టం సవరణ బిల్లు విషయంలోనూ వెనక్కి తగ్గాలి. లేకపోతే ఉద్యమాలు తప్పవు.
రైతుల విషయంలో కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించినా.. అయిదు రాష్ట్రాల ఎన్నికల స్టంట్ అనుకుంటున్నారు తప్ప దేశంలో ఎవరూ నమ్మడం లేదు. ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున అందజేస్తాం. కేంద్రం రూ.25 లక్షల చొప్పున వారికి సాయం చేయాలి.
ఈనాడు, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల నుంచి సేకరించినట్లే తెలంగాణ నుంచి వార్షిక ధాన్యం సేకరణ లక్ష్యం ఎంతో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆలస్యమైతే రైతుల్లో అయోమయం నెలకొంటుందని.. చివరి ప్రయత్నంగా ఆదివారం మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందంతో తాను దిల్లీకి వెళ్తున్నానని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రిని, ప్రధాని మోదీని కలుస్తామని.. తాను రెండు, మూడు రోజులు దిల్లీలోనే ఉండి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనేది లేదని చెప్పినట్లు గాలి వార్త వచ్చిందని.. అది అధికారికమా అనే విషయమూ తేల్చుకుంటామన్నారు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత యాసంగి పంటపై ప్రకటన చేస్తామన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు.. రైతుల అద్భుత విజయంగా సీఎం అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పంటలకు కనీస మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో వానాకాలంలో పండిన ప్రతి గింజనూ కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. శనివారం సీఎం కేసీఆర్ తెలంగాణభవన్లో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విలేకరులతో మాట్లాడారు.
‘‘ఒత్తిళ్లు, కేసులు, ప్రకృతి విపత్తులను తట్టుకొని దిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైతాంగ పోరాటవీరులకు అభినందనలు. పోరాడిన వారిపై వేల కేసులు పెట్టారు. బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి సంఘీభావంగా ట్వీట్ చేస్తే దేశద్రోహం కేసులు పెట్టారు. శషభిషలు లేకుండా ఇలాంటి కేసులు తక్షణమే ఎత్తేయాలని మేం ప్రధానిని డిమాండ్ చేస్తున్నాం.
అమరులకు నివాళులు..
ఉద్యమంలో 700 మందికిపైగా రైతులు మరణించారు. వారందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాం. ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పారు. అలాగని క్షమాపణలతో చేతులు దులుపుకోవద్దు. వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి. మంత్రులు, అవసరమైతే నేనే స్వయంగా వెళ్లి వారి కుటుంబాలకు పరిహారం అందిస్తాం. అవమానాలు, నిర్బంధాలు తట్టుకొని జరిగిన సుదీర్ఘపోరాటంలో ఆత్మార్పణం చేసుకున్న అమరులకు నివాళులర్పిస్తున్నాం.
విద్యుత్తు చట్టం సవరణ బిల్లు విషయంలోనూ వెనక్కి తగ్గాలి
కొత్త విద్యుత్తు చట్టం సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే దశలో ఉన్నాయి. అదే జరిగితే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు మొదలవుతాయి. వాటిపైనా కేంద్రం వెనక్కి తగ్గాలి. అమలు చేయని రాష్ట్రాలకు నిధులు నిలిపేస్తామని ఒత్తిడి తెస్తున్నారు. ఇది నియంతృత్వ వైఖరి. అవసరమైతే మీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అమలు చేసుకోండి. అందరిపై రుద్దే ప్రయత్నం చేయొద్దు. జబర్దస్తీగా బావులకు, బోర్లకు మీటర్లు పెట్టాలనడం దుర్మార్గ చర్య. పార్లమెంటులో తెరాస తరఫున వ్యతిరేకిస్తాం. పోరాటం చేస్తాం.
తీర్మానాల ఆమోదానికి ఎందుకీ జాప్యం?
శాసనసభలో ప్రజల ఆకాంక్షలకు సంబంధించి చాలా తీర్మానాలు చేశాం. తెలంగాణ ఏర్పాటయ్యాక గిరిజనుల శాతం పెరిగింది. తమిళనాడులా రిజర్వేషన్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని అడిగితే.. కాలరాశారు. 2017 నుంచి ఇప్పటివరకు 50 లేఖలు రాశాం. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం. దాన్నీ పెండింగ్లో పెట్టారు. వీటన్నింటినీ తేల్చకపోతే హక్కుల సాధనకు ఉద్యమం చేస్తాం.
ఆత్మనిర్భర్ కృషి అవసరం
గతంలో కరోనాకు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానికి కుండబద్దలు కొట్టిచెప్పాం. భారత్ గురించి మాట్లాడితే ఆత్మనిర్భర్ కృషి అవసరమని స్పష్టంచేశాం. అన్నింటికన్నా ముందు తినడానికి తిండి, తాగడానికి నీరు అవసరమని ప్రధానికి చెప్పాను. కనీస మద్దతు ధర చట్టం తేవాలి. దేశంలో ప్రజలకు ఆహార సరఫరా బాధ్యత కేంద్రానిదే. వరిధాన్యం సేకరణ కేంద్రం చేయాల్సిందే. పీడీఎస్ కింద తెలంగాణకే 25 లక్షల టన్నుల బియ్యం ఇస్తారు. రాష్ట్రంలో పండే వరిధాన్యంలో 60 లక్షల టన్నులు మనకే అవసరం పడుతుంది. ప్రైవేటులో మరో 10 లక్షల టన్నులు అవసరం. అందుకే వార్షిక లక్ష్యం సరిగా ఇవ్వాలని.. ఆప్రకారం పంటలు వేసుకుంటామని చెప్పాం.
నీటి వాటాలకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి
సెక్షన్ 3 కింద కొత్త రాష్ట్రాలకు అన్ని వాటాలు రావాలి. ఎనిమిది ఏళ్లు కావొస్తున్నా.. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటా తేల్చడం లేదు. ఈ సారి దిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర జల్శక్తి మంత్రిని, అవసరమైతే ప్రధానిని దీనిపై కలిసి డిమాండ్ చేస్తాం. ట్రైబ్యునల్ను ఏర్పాటుచేసి 3-4 నెలల సమయంలోనే వాటాలను తేల్చేలా కాలపరిమితి విధించాలి. లేకపోతే కచ్చితంగా ప్రజాఉద్యమాలు లేవదీస్తాం. పార్లమెంటులో ఇతర రాష్ట్రాలను కలుపుకొని కొట్లాడతాం.
* బీసీ జనగణన బ్రహ్మపదార్థం కాదు. ఇది సున్నిత సమస్య అని చెప్పడం తెలివి తక్కువతనం. దేశంలో కులాలున్నాయి.. వాటికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు.. అలాంటప్పుడు దాచిపెట్టడం ఎందుకు..? రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్