Congress: మీరే నడిపించాలి
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా.. సోనియాగాంధీ నాయకత్వంపైనే కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి.. సీడబ్ల్యూసీ సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసింది. పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే అప్పగిస్తూ
సోనియాగాంధీ నాయకత్వంపైనే సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసిన సీడబ్ల్యూసీ
మా వల్లే పార్టీకి నష్టమంటే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న గాంధీ కుటుంబం
ఆగస్టు 20న పార్టీ అధ్యక్ష ఎన్నిక: సూర్జేవాలా
ఈనాడు, దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా.. సోనియాగాంధీ నాయకత్వంపైనే కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి.. సీడబ్ల్యూసీ సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసింది. పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. సంస్థాగత ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యేవరకు పార్టీకి మార్గనిర్దేశం చేయాలని నేతలంతా సోనియాను కోరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఆగస్టు 20న నిర్వహిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్దీప్సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు దారుణమైన ఫలితాలు ఎదురైన నేపథ్యంలో ఆదివారం సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ దాదాపు నాలుగు గంటలకు పైగా సాగింది. సోనియా ప్రారంభోపన్యాసం చేస్తూ.. ‘‘గాంధీ కుటుంబం కారణంగానే పార్టీ బలహీనపడుతోందని కొందరు అంటున్నారు. సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉంటే పార్టీ కోసం మేం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం’’ అని పేర్కొన్నారు. పరోక్షంగా రాజీనామాలకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు. దీనికి సీడబ్ల్యూసీ సభ్యులు అంగీకరించలేదు. పార్టీని సంస్థాగతంగా సోనియానే బలోపేతం చేయాలని కోరారు. సాధారణంగా సీడబ్ల్యూసీ భేటీలో ముఖ్యమైన 20 నేతలు మాత్రమే పాల్గొంటారు. ఈసారి మాత్రం శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మొత్తం 57 మందికి ఆహ్వానం పలికారు. ఇందులో ఎక్కువ మంది గాంధీ కుటుంబ విధేయులైన సభ్యులే అత్యధికులు ఉండడం విశేషం. అనారోగ్య కారణాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కొవిడ్తో మాజీ రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ హాజరు కాలేదు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, జీ-23 కూటమిలోని నేతలైన గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్లతో పాటు ప్రముఖ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల చెప్పిన విషయాలను సోనియా శ్రద్ధగా ఆలకించారు. వారు కోరినట్లు సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదివరకు ఉత్తర్ప్రదేశ్ ఇన్ఛార్జిలుగా పనిచేసిన సీనియర్ నేతలు ఆజాద్, దిగ్విజయ్సింగ్లు తమ అనుభవాలను పంచుకున్నట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు. చర్చలు ఆరోగ్యకరంగా, నిర్మొహమాటంగా జరిగాయని పేర్కొన్నారు. రాహుల్గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా బదులిస్తూ.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా రాహుల్గాంధీని అధ్యక్ష బాధ్యతలు చేపట్టమని కోరుతున్నారని, ముందు సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని, తర్వాత అధ్యక్ష ఎన్నిక ఆగస్టు 20న జరుగుతుందని తెలిపారు.
అందుకే ఓడిపోయాం
భాజపా ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లో సరిగా ప్రచారం చేయకపోవడం వల్లే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాలు చవిచూసిందని వర్కింగ్ కమిటీ సమావేశానంతరం కె.సి.వేణుగోపాల్ తెలిపారు. ‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. వ్యూహలోపం కారణంగా నాలుగు రాష్ట్రాల్లోని భాజపా ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టలేకపోయామని, పంజాబ్లో నాయకత్వ మార్పిడి చేసినా, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయామని పార్టీ అంగీకరించింది. తాజా ఎన్నికల ఫలితాలను సవినయంగా అంగీకరిస్తూనే ప్రభావశీలమైన ప్రతిపక్షపాత్రను ఇకముందు కూడా బలంగా పోషిస్తామని పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజలకు హామీ ఇస్తోంది. 2022, 2023 అసెంబ్లీ ఎన్నికలతోపాటు, 2024 లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ పూర్తిస్థాయిలో సమాయత్తమవుతుంది. సోనియాగాంధీ నాయకత్వంపై పూర్తిస్థాయి విశ్వాసాన్ని సీడబ్ల్యూసీ వ్యక్తం చేస్తూనే పార్టీని ముందుండి నడిపించాలని ఆమెను అడగడంతో పాటు, సంస్థాగత బలహీనతలను పరిష్కరించాలని కోరింది. రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విధంగా సంస్థాగతంగా సమగ్ర మార్పులు చేయాలి’’ అని సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వేణుగోపాల్ వెల్లడించారు.
వారే ఆ పార్టీలోకి వెళ్లిపోయారు: ఆజాద్
కాంగ్రెస్ను బలోపేతం చేయాలని మాట్లాడితే కొందరు తమను భాజపా ఏజెంట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆవేదనగా మాట్లాడారు. ‘మేం మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నాం, మమ్మల్ని భాజపా ఏజెంట్లని చెప్పినవారే ముందుగా ఆ పార్టీలోకివెళ్లిపోయారు’ అని ఆయన అన్నట్లు సమాచారం.
రాజస్థాన్లో చింతన్ శిబిరం!
తాజా ఐదు రాష్రాల ఎన్నికల వైఫల్యంపై, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి పార్లమెంటు సమావేశాలు అయిన వెంటనే విస్తృతస్థాయి చింతన్ శిబిరం నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. ఇది రాజస్థాన్లో జరిగే అవకాశం ఉంది. అలాగే ఈనెలాఖరులోగా మరోసారి సమావేశం కావాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.
రాహుల్కే పగ్గాలివ్వాలి: నేతల డిమాండ్
ఈనాడు, దిల్లీ: సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్.. గాంధీ కుటుంబానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సాగిస్తున్న పోరాటం అద్భుతమని కితాబిచ్చారు. ప్రధాని తన ప్రసంగాల్లో రాహుల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీన్ని బట్టి నాయకుడిగా అతని సత్తాను అర్థం చేసుకోవచ్చని అన్నారు. ‘‘నాయకత్వ పగ్గాలు రాహులే చేపట్టాలని పార్టీలో మేమందరం భావిస్తున్నాం’’ అని గహ్లోత్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ కూడా పార్టీ పూర్తిస్థాయి పగ్గాలను రాహుల్ చేపట్టాలని అన్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ముందు భారీస్థాయిలో దిల్లీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని రాహుల్, గాంధీ కుటుంబానికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రస్తుతం దేశంలోని విపక్షాల్లో కాంగ్రెస్సే అత్యంత విశ్వసనీయ పక్షమని అని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భాజపాకు 1400కు పైగా ఎమ్మెల్యేలుంటే, కాంగ్రెస్కు 753 మంది శాసనసభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. కాబట్టి పార్టీని సంస్కరించుకొని, పునరుజ్జీవం చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?