Covid Variant: కొత్త వేరియంట్ కలకలం
దక్షిణాఫ్రికాలో తాజాగా కొవిడ్ కొత్త వేరియంట్ బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ‘బి.1.1.529’గా గుర్తించిన ఈ రకానికి సంబంధించి ఇంతవరకు 22 కేసులు బయటపడ్డాయి. క్రమేపీ ఈ
దక్షిణాఫ్రికాలో 22 కేసులు
ఆందోళనకర రీతిలో ఉత్పరివర్తనాలు
లండన్/జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో తాజాగా కొవిడ్ కొత్త వేరియంట్ బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ‘బి.1.1.529’గా గుర్తించిన ఈ రకానికి సంబంధించి ఇంతవరకు 22 కేసులు బయటపడ్డాయి. క్రమేపీ ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతున్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. కరోనా నాలుగో ఉద్ధృతి (వేవ్) డిసెంబరు లేదా జనవరిలో వస్తుందని అంచనా వేశామని.. అయితే కొత్త వేరియంట్ కేసులు తాజాగా బయటపడుతున్నాయని ఆ శాఖ మంత్రి జో ఫాహ్లా తెలిపారు. కొత్త కేసులు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ కొత్త వేరియంట్ను బోట్స్వానా, హాంకాంగ్ల్లోనూ కనుగొన్నారు. దీనిపై ఇంపీరియల్ కాలేజి లండన్ వైరాలజిస్ట్ డాక్టర్ టామ్ పీకాక్ బ్రిటన్ను అప్రమత్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో ఈ వేరియంట్కు కొమ్ము భాగంలో ఉత్తరివర్తనాలు (మ్యుటేషన్లు) ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విస్తృతంగా వ్యాప్తి చెందడం, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి కోణాల్లో ఈ రకం తీరుతెన్నులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ‘ఆందోళనకర రకం’గా పరిగణించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డేటా పరిమితంగా ఉందని దక్షిణాఫ్రికా అంటువ్యాధుల జాతీయ సంస్థ (ఎన్ఐసీడీ) తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆడ్రియన్ పురేన్ చెప్పారు. దీనిపై తమ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా బి.1.1.529 రకానికి సంబంధించి రెండు ఉత్పరివర్తనాలను కనుగొన్నట్లు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం క్లినికల్ బయాలజీ ప్రొఫెసర్, భారత సంతతికి చెందిన రవి గుప్తా ‘ది గార్డియన్’కు తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్లో ఐటీసీ ‘కొవిడ్-19’ నాసల్ స్ప్రే
దిల్లీ: కొవిడ్-19ను నిరోధించేందుకు ఐటీసీ సంస్థ ముక్కులో వేసుకొనే నాసల్ స్ప్రేను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. బెంగళూరులోని ఐటీసీ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని రూపొందించారు. క్లినికల్ ట్రయల్స్ కోసం క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ- ఇండియా (సీటీఆర్ఐ) దగ్గర ఈ స్ప్రేను ఐటీసీ నమోదు చేసింది. ‘‘క్లినికల్ ట్రయల్స్లో ఉన్నందున దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రస్తుత సమయంలో ఇవ్వలేం’’ అని ఐటీసీ ప్రతినిధి పేర్కొన్నారు.
కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాలకు లేఖ
ఈనాడు, దిల్లీ: దక్షిణాఫ్రికాలో కొవిడ్ కొత్త వేరియంట్ (బి.1.1.529) బయటపడిన నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్వానాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త వేరియంట్ ప్రజారోగ్యానికి సవాల్ విసిరే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ముప్పు ఉన్నవారిగానే పరిగణించి వారికి కఠినమైన స్క్రీనింగ్ జరిపి, పరీక్షలు నిర్వహించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సూచించారు. పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వారి నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం పంపాలని సూచించారు.
539 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,119 మంది కొవిడ్-19 బారిన పడడంతో మొత్తం కేసులు సంఖ్య 3,45,44,882కు చేరుకుంది. క్రియాశీల కేసులు తగ్గుముఖం (1,09,940) పట్టాయి. 539 రోజుల్లో ఇదే కనిష్ఠం. తాజాగా వైరస్తో 396 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,66,980కు చేరుకుంది. రికవరీ రేటు 98.33%, పాజిటివిటీ రేటు 0.79%గా నమోదైంది. ఇప్పటివరకు దాదాపు 119.38 కోట్ల మంది వ్యాక్సిన్ డోసులు వేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..