మెరుగైన ఫలాలు అందించే వాటికి ప్రాధాన్యం
‘ప్రజాధనం వ్యయంలో సహేతుకమైన విధానం’ అవలంబించాలన్న యోచనలో భాగంగా..ప్రభుత్వం కొనసాగుతున్న పథకాలను సమీక్షించింది. ఫలితాలు అందించనివి, ఒకే ఉద్దేశంతో ఉన్న వాటిని విలీనం చేసింది.
రాష్ట్ర ఆర్థిక వ్యూహం ఇదీ..
ఈనాడు, హైదరాబాద్: ‘ప్రజాధనం వ్యయంలో సహేతుకమైన విధానం’ అవలంబించాలన్న యోచనలో భాగంగా..ప్రభుత్వం కొనసాగుతున్న పథకాలను సమీక్షించింది. ఫలితాలు అందించనివి, ఒకే ఉద్దేశంతో ఉన్న వాటిని విలీనం చేసింది. సమగ్ర సమీక్ష అనంతరం రాష్ట్రానికి ఉపయోగంగా ఉండే పథకాలనే కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విధానంలో ఈ విషయం స్పష్టం చేసింది. ప్రధానంగా తక్కువ ఉత్పాదకత ఉన్న పథకాలపై వ్యయాన్ని గుర్తించి, ఆ నిధులను మెరుగైన ఫలితాలు అందించేవాటిపై వెచ్చించడానికి ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పనులను చేపట్టడంకంటే కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. శాఖల మధ్య సమన్వయమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగానే గృహనిర్మాణ శాఖను ఆర్ అండ్ బీలో విలీనం చేయగా, రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత తీసుకువచ్చి అవినీతికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకుంది.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
2022-23లో పెట్టుబడి వ్యయం పెంచేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారం వేయకుండా సమర్థంగా పన్నుల వసూళ్లకు చర్యలు తీసుకుంది. విచక్షణాధికారాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శక విధానాలకు పెద్దపీట వేసింది. ఫలితంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల రాబడిని గణనీయంగా పెంచుకుంది. 2022-23లో సొంత పన్నులరాబడి రూ.1,10,592 కోట్లు కాగా, 2023-24లో పన్నులరాబడి రూ.1,31,029 కోట్లుగా పేర్కొంది. పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసేలా తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలించాయని వివరించింది.
జీఎస్డీపీలో 25 శాతం మించకుండా రుణాలు
15వ ఆర్థిక సంఘం అంచనాల కంటే తక్కువ మొత్తంలో రుణాలను తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో జీఎస్డీపీలో రాష్ట్ర అప్పులు 2023-24లో 33.1 శాతం, 2024-25లో 32.8 శాతం, 2025-26లో 32.5 శాతం ఉంటాయని అంచనా వేయగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో రుణాలపై వ్యవహరిస్తున్నట్లు బడ్జెట్ నివేదికల్లో పేర్కొంది. జీఎస్డీపీలో 25 శాతం.. అంతకంటే తక్కువ రుణాలు ఉండేలా దృష్టిసారించినట్లు వివరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో రుణాల శాతం 23.8 శాతమే అని వివరించింది. 2021-22లో జీఎస్డీపీలో రుణాల వాటా 24.69 శాతం కాగా, 2022-23లో సవరించిన అంచనాల మేరకు 24.33 శాతమని తెలిపింది.
కొత్త బడ్జెట్.. సంక్షేమానికి గీటురాయి
బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణమోహన్రావు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ కొత్త బడ్జెట్ సంక్షేమానికి గీటురాయిగా ఉందని, అభివృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తుందని బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు తెలిపారు. బడ్జెట్ రూపకల్పన, నిధుల కేటాయింపు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు అద్దంపడుతున్నాయని అన్నారు. మహిళా సంక్షేమానికి, దళితబంధుకు భారీగా నిధులను కేటాయించడంపై టీఎస్ఫుడ్స్ ఛైర్మన్ రాజీవ్సాగర్ శాసనసభలో మంత్రి హరీశ్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ దేశానికి ఆదర్శంగా ఉందని భారాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్ బిగాల, మైనారిటీ నేత బద్రుద్దీన్లు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్