Farmers Protest: ఆగిన రైతుల పోరు
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు ఎట్టకేలకు తమ ఇళ్లకు తిరిగి వెళ్లనున్నారు. వారి డిమాండ్లలో ముఖ్యమైన కొత్త సాగు చట్టాల రద్దును ఇప్పటికే
రైతుల మహోద్యమం తాత్కాలిక విరమణ
సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన
కేంద్రం హామీపత్రం అందిన వెంటనే నిర్ణయం
దిల్లీలోని సింఘు సరిహద్దులో గురువారం శిబిరాలను తొలగిస్తున్న అన్నదాతలు
దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు ఎట్టకేలకు తమ ఇళ్లకు తిరిగి వెళ్లనున్నారు. వారి డిమాండ్లలో ముఖ్యమైన కొత్త సాగు చట్టాల రద్దును ఇప్పటికే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మిగిలిన వాటి అమలుకూ లిఖితపూర్వకమైన హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు 40 రైతుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) గురువారం ప్రకటించింది. వాగ్దానాలను నెరవేర్చకుంటే మళ్లీ ఉద్యమిస్తామని రైతు నేతలు హెచ్చరించారు.
ఈ నెల 11వ తేదీ నుంచి దిల్లీలోని నిరసన శిబిరాలను ఖాళీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొద్ది రోజుల సమయం పట్టవచ్చని రైతు నేత రాకేశ్ టికాయిత్ అభిప్రాయపడ్డారు. సింఘూ సరిహద్దులోని ఆందోళనకారులు తమ తాత్కాలిక నివాసాలను (శిబిరాలను) గురువారమే తొలగించడం ప్రారంభించారు.
విజయ కవాతులతో తిరుగుముఖం...
‘రైతులు చరిత్రాత్మక విజయం సాధించారు. ఈ నెల 11 నుంచి వారు విజయ కవాతు చేసుకుంటూ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తార’ని కర్షక నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. దిల్లీ సరిహద్దుల్లోని ఆయా శిబిరాల నుంచి ఇవి ప్రారంభమవుతాయన్నారు. నిరసనల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రైతు నాయకుడు శివ్ కుమార్ కక్కా క్షమాపణలు చెప్పారు
అధికారిక హామీ పత్రం అందిన వెంటనే..
రైతుల నేతల డిమాండ్ మేరకు సవరించిన అధికారిక హామీ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం వారికి అందజేసింది. కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు సహా రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తర్ప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఈ విషయాలతో కూడిన హామీ పత్రం అందిన వెంటనే ఎస్కేఎం నేతలు సమావేశమై నిరసనల విరమణపై తుది నిర్ణయం తీసుకున్నారు. జనవరి 15న సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, ప్రభుత్వం హామీలను నెరవేర్చకుంటే నిరసనలు మళ్లీ కొనసాగిస్తామని రైతు నేత గుర్నాం సింగ్ స్పష్టం చేశారు.
గాజీపుర్ సరిహద్దులో గురువారం రైతుల సంబరాలు
కేంద్ర మంత్రి హర్షం
రైతుల నిరసనల విరమణ నిర్ణయంపై కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ హర్షం వ్యక్తం చేశారు. కర్షక సోదరులు స్వస్థలాలకు తిరుగుముఖం పట్టడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా భాజపా ప్రచారానికి ఇక అవరోధాలు తొలగిపోయినట్లేనని పశ్చిమ యూపీకి చెందిన ఈ జాట్ నేత పేర్కొన్నారు. వేల మంది రైతుల ధర్నాలు, పోలీసుల చెక్పోస్టులు, వాహనాల మళ్లింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు తాజా పరిణామంతో ఊపిరిపీల్చుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ లేఖలో ఏముంది?
రైతు నేతలకు కేంద్ర ప్రభుత్వం... వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ద్వారా ఒక లేఖను పంపించింది. పెండింగ్ డిమాండ్లు అన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించినందున నిరసనలను నిలిపివేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు ఆయన విజ్ఞప్తి చేశారు. సాగు చట్టాల రద్దు తర్వాత మిగిలిపోయిన అయిదు ప్రధాన డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.
1. పంటల మద్దతు ధరలను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో ప్రభుత్వ అధికారులు, నిపుణులతో పాటు ఎస్కేఎం సభ్యులకూ ప్రాతినిధ్యంపై హామీ
2. రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేసేందుకు ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు అంగీకరించాయి.
3. ఉద్యమంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు హరియాణా, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు సమ్మతించాయి.
4. విద్యుత్తు సవరణ బిల్లులో రైతులపై ప్రభావం చూపే అంశాలపై సంయుక్త కిసాన్ మోర్చా నేతలు, సంబంధీకులతో చర్చించిన తర్వాతే పార్లమెంటులో ప్రవేశపెడతాం.
5. సాగు వ్యర్థాల దహనాన్ని నేరంగా పరిగణించడాన్ని ఇప్పటికే నిలిపివేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు