సంక్షోభంలో ఐరాస విశ్వసనీయత
ఐక్యరాజ్య సమితి(ఐరాస) విశ్వసనీయత సంక్షోభంలో పడుతోందని, దాన్ని అధిగమించడానికి ఆ సంస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేటి పరస్పర అనుసంధాన ప్రపంచానికి ...
సంస్కరణలు అత్యవసరం
సర్వప్రతినిధి సభలో ప్రధాని మోదీ
కాలం చెల్లిన వ్యవస్థలతో మనం నేటి సరికొత్త సవాళ్లను ఎదుర్కొనలేం. ప్రస్తుత వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఐరాసను సంస్కరించుకోవాలి. ఈ లక్ష్యం కోసం సభ్యదేశాలతో కలసి పనిచేయడానికి భారత్ సంసిద్ధంగా ఉంది.
-ప్రధాని నరేంద్ర మోదీ
ఐరాస: ఐక్యరాజ్య సమితి(ఐరాస) విశ్వసనీయత సంక్షోభంలో పడుతోందని, దాన్ని అధిగమించడానికి ఆ సంస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేటి పరస్పర అనుసంధాన ప్రపంచానికి సంస్కరణలతో కూడిన బహుపాక్షిక విధానం అత్యవసరమని, అది అన్ని సభ్య దేశాల అభిప్రాయాలను గౌరవిస్తూ, సమకాలీన సవాళ్లను అధిగమిస్తూ, మానవాళి సంక్షేమానికి పాటుపడేలా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందులో మోదీ వీడియో ద్వారా ప్రసంగించారు. వచ్చే జనవరి నుంచి రెండేళ్ల పాటు ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ కొనసాగనున్న నేపథ్యంలో మోదీ దేశ ఆకాంక్షలను వినిపించారు. ఐరాస ఏర్పాటులో భారత్ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ‘‘75 ఏళ్ల క్రితం యుద్ధ భయానక పరిస్థితుల్లో ఉన్న ప్రపంచానికి ఓ కొత్త ఆశాకిరణం కనిపించింది. మానవాళి చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచ సంక్షేమం కోసం ఓ కొత్త వ్యవస్థ(ఐరాస) పురుడు పోసుకుంది. ఆ పవిత్ర లక్ష్యంలో భారత్ కూడా వ్యవస్థాపక భాగస్వామిగా ఉంది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని నమ్మే భారత్ ‘వసుధైక కుటుంబం’ సాధనకు కృషి చేసింది. ఐరాస వల్లే మన ప్రపంచం ఈరోజు ఉత్తమంగా ఉంది’’ అని మోదీ తెలిపారు. ఐరాస ద్వారా ఎన్నో సంక్షేమాలు సాధించినప్పటికీ దాని అసలు లక్ష్యాన్ని మాత్రం ఇంకా అందుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సంఘర్షణలను నివారించడం, అభివృద్ధికి ఊతమివ్వడం, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడం, అసమానతలను తొలగించడం, డిజిటల్ సాంకేతికతను పెంచడం తదితర లక్ష్యాల కోసం చేయాల్సిన కృషి ఇంకా ఉంది’’ అని మోదీ స్పష్టం చేశారు.
పాక్పై భారత్ మండిపాటు
ఈ సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తన ప్రసంగంలో జమ్మూ-కశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఖురేషి మాట్లాడుతూ ‘‘పాలస్తీనా, జమ్మూ-కశ్మీర్లు ఐరాసలో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాస్పద అంశాలు. జమ్మూ-కశ్మీర్ ప్రజలు తమ స్వయం ప్రతిపత్తి విషయంలో ఐరాస ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుతుందా అని ఇంకా ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఐరాస వేదికపైనే భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘‘పాక్ ఉగ్రవాద కేంద్రమని ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి శిక్షణ ఇస్తున్నట్లు ఆ దేశమే స్వయంగా ఒప్పుకుంది. ఐరాసలో పూర్తికాని లక్ష్యం ఏదన్నా ఉందీ అంటే అది ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, దాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి బుద్ధిచెప్ప
డం’’ అని భారత్ ఘాటుగా బదులిచ్చింది.
చైనానే జవాబుదారీ చేయాలి: ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి విషయంలో చైనానే జవాబుదారీగా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరాసలో డిమాండ్ చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ మనం మరో ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నాం. కంటికి కనిపించని ‘చైనా వైరస్’పై యుద్ధం చేస్తున్నాం. అది 188 దేశాల్లో లక్షలాది మందిని కబళించింది. ఈ మహమ్మారిని అరికట్టడంలో విఫలమైన చైనాను ఈ విపత్తుకు జవాబుదారీగా చేయాలి’’ అని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
కోల్డ్ వార్, హాట్ వార్ ఏదీ మాకొద్దు: జిన్ పింగ్
చైనాకు సరిహద్దుల్లో భారత్తో నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు అమెరికా నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఐరాస సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మేం విస్తరణ వాదాన్ని, ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ‘‘మాకు ఏ దేశంతోనూ కోల్డ్ వార్ కానీ, హాట్ వార్ కానీ చేసే ఉద్దేశం లేదు. ఇతర దేశాలతో ఉన్న విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం’’ అని తన ప్రసంగంలో చెప్పారు.
ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపాలి: ఐరాస
ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న రెండు దేశాలు ప్రపంచాన్ని విడగొడుతుంటే భవిష్యత్తును ఊహించలేం అని ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భద్రతా మండలి నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణకు ఉమ్మడిగా కృషి చేయాలి. అందుకు 100 రోజులు గడువుగా నిర్ణయించాం. దీంతోపాటు కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపాల్సిన అవసరముంది’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా టీకాలు తొలుత తమకే దక్కేలా కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలనూ గుటెర్రెస్ ఖండించారు. అలాంటి విధానాలు స్వీయ ఓటమిని కొనితెచ్చుకోవడమే అన్నారు. ఈ సమావేశంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనరొ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తదితరులు ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!