వీడని పీఠముడి
ఉత్కంఠ వీడలేదు. అనిశ్చితి తొలగిపోలేదు. అమెరికా తదుపరి అధ్యక్షుడెవరన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. కీలకమైన మిషిగన్ను దక్కించుకోవడం ద్వారా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ తాజాగా మరో 16 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా అధ్యక్ష పీఠానికి మరింత చేరువయ్యారు. అయితే- ట్రంప్కూ ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
డెమొక్రాట్ల వశమైన మిషిగన్
అధికారానికి 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్
ట్రంప్కూ మిగిలి ఉన్న విజయావకాశాలు
పెన్సిల్వేనియా కోర్టులో ఆయనకు అనుకూల తీర్పు
అమెరికా వ్యాప్తంగా ఉభయపక్షాల నిరసనలు
వాషింగ్టన్: ఉత్కంఠ వీడలేదు. అనిశ్చితి తొలగిపోలేదు. అమెరికా తదుపరి అధ్యక్షుడెవరన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. కీలకమైన మిషిగన్ను దక్కించుకోవడం ద్వారా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ తాజాగా మరో 16 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా అధ్యక్ష పీఠానికి మరింత చేరువయ్యారు. అయితే- ట్రంప్కూ ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతున్న రాష్ట్రాలన్నింటిలో విజయం సాధిస్తే.. అధ్యక్ష పదవిలో మరో నాలుగేళ్లపాటు ఆయనే కొనసాగుతారు. దీంతో తుది ఫలితం ఎలా ఉంటుందోనని అమెరికన్లతోపాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు- ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతున్నవేళ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. కౌంటింగ్ను నిలిపివేయాలంటూ ట్రంప్ అనుకూల వర్గాలు, ప్రతి ఓటునూ లెక్కించాలంటూ బైడెన్ అనుకూల వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించాయి. ఇక ఓట్ల లెక్కింపులో మోసం జరుగుతోందంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ట్రంప్కు పెన్సిల్వేనియా కోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. జార్జియా, మిషిగన్లలో మాత్రం చుక్కెదురైంది. బైడెన్ నెగ్గానని చెప్పుకొంటున్న అన్ని రాష్ట్రాల్లోనూ న్యాయ పోరాటం చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసి రెండు రోజులవుతున్నా అమెరికా నూతన అధ్యక్షుడెవరో ఇంకా తేలలేదు. ఈ దఫా ఎన్నికల్లో 10 కోట్లకుపైగా పోస్టల్ బ్యాలెట్లు రావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. బుధవారం ఆధిపత్యం దోబూచులాడిన మిషిగన్ చివరకు డెమొక్రాట్ల సొంతమైంది. దీంతో బైడెన్ ఖాతాలోని ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 264కు పెరిగింది. ట్రంప్కు 214 ఓట్లున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు విషయంలో ట్రంప్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ‘కౌంటింగ్ను నిలిపివేయండి’ అంటూ ట్వీట్ చేశారు. మిషిగన్లో కౌంటింగ్ను నిలిపివేయాలంటూ ట్రంప్ బృందం బుధవారమే దావా దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. జార్జియాలోనూ కౌంటింగ్ను నిలిపివేసేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. నెవాడాలోనూ ట్రంప్ వర్గీయులు కోర్టును ఆశ్రయించారు. విస్కాన్సిన్లో రీకౌంటింగ్ నిర్వహించాలని వారు ఇప్పటికే కోర్టుకెక్కారు. విస్కాన్సిన్ రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రం. అక్కడ తాజాగా ట్రంప్కు 48.8% ఓట్లు రాగా, బైడెన్ 49.4% ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. ఇద్దరి మధ్య అంతరం 1% కంటే తక్కువగానే ఉంది కాబట్టి రీకౌంటింగ్ను కోరే హక్కు ట్రంప్నకు ఉందని న్యాయ నిపుణులు తెలిపారు. మరోవైపు ‘విశ్వాసముంచండి. మనం గెలవబోతున్నాం’ అని తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చాక పారిస్ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరుతుందన్నారు.
పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్కు అనుకూల తీర్పు
కౌంటింగ్ను ఆరు అడుగుల దూరం నుంచి చూసేందుకు పార్టీలకు చెందిన ఎన్నికల పర్యవేక్షకులను అనుమతించాలంటూ కామన్వెల్త్ కోర్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా తాజాగా ఆదేశించింది. బ్యాలెట్లను తెరిచి, లెక్కించే ప్రక్రియను దగ్గరి నుంచి పరిశీలించేలా పర్యవేక్షకులను అనుమతించకపోవడంపై ట్రంప్ బృందం తొలుత స్థానిక కోర్టును ఆశ్రయించింది. అక్కడ అనుకూల తీర్పు రాకపోవడంతో పైకోర్టుకు వెళ్లిన సంగతి గమనార్హం. తాజా తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘పెన్సిల్వేనియాలో న్యాయపరమైన భారీ విజయం’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్ ముందంజలో ఉన్నా..లెక్కింపు సాగేకొద్దీ ఆయన ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇప్పటివరకూ పూర్తయిన కౌంటింగ్ను సమీక్షించేందుకూ తమకు అనుమతి వచ్చినట్లేనని ట్రంప్ బృందం తెలిపింది. పెన్సిల్వేనియాలో బ్యాలెట్ల లెక్కింపులో జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టునూ ట్రంప్ కోరినట్లు వార్తలొస్తున్నాయి.
* అమెరికాలో నెలకొన్న పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. అగ్రరాజ్యాధినేతగా ఎవరు ఎన్నికైనా వారితో సత్సంబంధాలను కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తామని చైనా స్పష్టం చేసింది.
ఆ 4 రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. 45 రాష్ట్రాల్లో ఫలితాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. నెవాడా, నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా, అలస్కాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఈ ఐదే అగ్రరాజ్య తదుపరి అధినేత ఎవరో తేల్చబోతున్నాయి. మూడు ఎలక్టోరల్ ఓట్లున్న అలస్కాలో బైడెన్పై ట్రంప్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ ఆయన విజయం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది.మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది.
నార్త్ కరోలినా: పోలైన ఓట్లలో 95% లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతానికి బైడెన్ (48.7%)పై ట్రంప్ (50.1%)ది పైచేయిగా ఉంది. ఈ నెల 12 వరకూ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించనున్నారు. కాబట్టి అభ్యర్థుల మధ్య అంతరం స్వల్పంగానే కొనసాగితే.. తుది ఫలితం తేలేందుకు ఇంకొన్ని రోజులు పడుతుంది. రాష్ట్రంలో 15 ఎలక్టోరల్ ఓట్లున్నాయి.
పెన్సిల్వేనియా: 89% ఓట్ల లెక్కింపు పూర్తయింది. బైడెన్ (48.2%)పై ట్రంప్ (50.5%) ఆధిక్యంలో ఉన్నారు. 20 ఎలక్టోరల్ ఓట్లున్న ఈ రాష్ట్రంలో శుక్రవారం కల్లా కౌంటింగ్ దాదాపుగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.
నెవాడా: సాధారణ ఓట్లతోపాటు 86% పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయింది. ట్రంప్ (48.7%)పై బైడెన్ (49.3%) ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే బైడెన్ మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంటారు.
జార్జియా: ఇక్కడ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. దాదాపు 96% ఓట్ల లెక్కింపు పూర్తవగా, బైడెన్పై ట్రంప్ కేవలం 0.4% ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 16.
పెల్లుబికిన నిరసనలు
ఫలితాలపై అనిశ్చితి కొనసాగుతున్నవేళ అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. ‘ప్రతి ఓటునూ లెక్కించాలి’ అని నినదిస్తూ న్యూయార్క్లో డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు ఆందోళనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధులు ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ హాలు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము వీధుల్లోకి వచ్చినట్లు వారు తెలిపారు. ట్రంప్ వెళ్లిపోవాలన్న డిమాండ్తో షికాగోలో భారీఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. ఒరేగాన్లోని పోర్ట్లాండ్లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. మిన్నియాపొలిస్, మాన్హటన్లలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లికన్లకు పట్టున్న అరిజోనాలో బైడెన్ గెలవడంతో ట్రంప్ మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ‘వుయ్ లవ్ ట్రంప్’ అంటూ నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్-1 పరిధిలో ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు