బెంగాలి మావైపే
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ కుదుపు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సువేందు అధికారి సహా.. వివిధ పార్టీల నాయకులు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో భాజపాలో భారీగా చేరారు. ఆరుగురు తృణమూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బర్ధమాన్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న
సువేందు సహా 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిక
2021లో అధికారం మాదే
200 సీట్లకు పైగా గెలుస్తాం
అమిత్ షా ధీమా
చివరకు తృణమూల్కు మిగిలేది మమత ఒక్కరేనని వ్యాఖ్య
కోల్కతా, ఖరగ్పూర్ - న్యూస్టుడే
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ కుదుపు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సువేందు అధికారి సహా.. వివిధ పార్టీల నాయకులు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో భాజపాలో భారీగా చేరారు. ఆరుగురు తృణమూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బర్ధమాన్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎంపీ సునిల్ మండల్ కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సీపీఐ. సీపీఎం, కాంగ్రెస్ నుంచి ఒక్కో ఎమ్మెల్యే భాజపాలో చేరడం విశేషం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వలసలు.. బెంగాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా నందిగ్రామ్ ఉద్యమంతో పేరు తెచ్చుకున్న సువేందు అధికారి భాజపాలో చేరడం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ పార్టీకి ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. జంగల్ మహల్ ప్రాంతంలో సువేందు కుటుంబానికి దాదాపు 35 నుంచి 40 నియోజకవర్గాల్లో పట్టుంది. సువేందు తండ్రి శిశిర్ అధికారి, సోదరుడు దివ్యేందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. ఇంకో దగ్గరి బంధువు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతానికి పార్టీ మారనప్పటికీ.. వెనుక నుంచి సువేందుకు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవికి సువేందు రాజీనామా చేసినప్పుడు.. అతన్ని పార్టీలో ఉంచేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నించారు. అందుకే శనివారం జరిగిన మిద్నాపుర్ సభలో ‘‘తృణమూల్ నుంచి నాయకులు వీడుతున్న వేగం చూస్తుంటే ఎన్నికల సమయానికి పార్టీలో మమత ఒక్కరే ఒంటరిగా మిగులుతారేమో’’ అని షా అన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 200పైగా సీట్లతో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలు కాంగ్రెస్కు, 27 ఏళ్లు కమ్యూనిస్టులకు. పదేళ్లు తృణమూల్కు అధికారమిచ్చిన బెంగాల్ ప్రజలు.. భాజపాకు ఓ ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బెంగాల్ను సోనార్ బంగ్లా (బంగారు బంగ్లా)గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
చక్రం తిప్పిన షా
మమతా బెనర్జీ తర్వాత కీలకమైన నేతగా భావించే సువేందును పార్టీలోకి తీసుకురావడంలో అమిత్షా కీలక పాత్ర వహించారని బెంగాల్ భాజపా వర్గాలు చెబుతున్నాయి. సువేందు కూడా తాను కొవిడ్-19కు గురైనపుడు సొంత పార్టీ వ్యక్తులు పట్టించుకోకపోయినా, షా తనను ఆత్మీయంగా పలకరించారని చెప్పారు. ‘‘నేను తొలిసారి 2014 లోక్సభ ఎన్నికల సమయంలో అమిత్ షాను కలిశాను. తర్వాత కొవిడ్-19 సోకినప్పుడు సొంత పార్టీ నాయకులే పట్టించుకోలేదు. అమిత్ షా రెండు సార్లు ఫోన్ చేశారు. నా బాగోగులు తెలుసుకున్నారు’’ అని మిద్నాపుర్ సభలో సువేందు చెప్పారు.
రైతు ఇంట్లో భోజనం
రెండు రోజల పర్యటన కోసం శనివారం కోల్కతా చేరుకున్న అమిత్ షా ఉదయం స్వామి వివేకానంద పుట్టిన ప్రదేశాన్ని దర్శించారు.అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరాం బోస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యాహ్నం మిద్నాపుర్లో బెలిజూరి గ్రామంలోని సనాతన్ సింగ్ అనే రైతు ఇంట్లో భోజనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా