మళ్లీ అమెరికను చేయాలని
మనవలు... మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడిపే వయసులో... జో బైడెన్ అమెరికా పునరుద్ధరణ భారం మోయబోతున్నారు! 46వ అమెరికా అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసే 78 ఏళ్ళ బైడెన్- ఉపాధ్యక్షురాలుగా
మనవలు... మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడిపే వయసులో... జో బైడెన్ అమెరికా పునరుద్ధరణ భారం మోయబోతున్నారు! 46వ అమెరికా అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసే 78 ఏళ్ళ బైడెన్- ఉపాధ్యక్షురాలుగా నల్లజాతి కలువ కమలా హారిస్తో కలసి అమెరికాను మళ్ళీ గాడిన పెట్టడానికి... ట్రంప్ హయాంలో అమెరికాపై ఇంటా బయటా పడ్డ మరకల్ని కడిగేయటానికి... నడుంబిగిస్తున్నారు. ఆ క్రమంలో ఎదురవుతున్న సవాళ్ళెన్నో!
ఇంట...
కొవిడ్: ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని, మళ్లీ సాధారణ పరిస్థితులను నెలకొల్పడం.
ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు 2.46 కోట్ల మంది అమెరికన్లు కరోనా బారిన పడగా... వీరిలో 4 లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.
వర్ణ వివక్ష: ప్రజల శరీర రంగు ఆధారంగా సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన నలుపు-తెలుపు జాతి వివక్ష (సిస్టమిక్ రేసిజం)ను రూపుమాపడం.
ఎన్నికలకు కొద్దినెలల ముందు జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు దారుణంగా హింసించి, ఆయన మృతికి కారణమవడంతో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి డెమొక్రాట్లు మద్దతు పలికారు.
పారిస్ ఒప్పందం: పారిస్ వాతావరణ ఒప్పందంలో మళ్లీ భాగస్వామిగా మారి, కాలుష్యాన్ని కట్టడి చేయడం.
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఉద్గారాలను కట్టడి చేయడం దీని లక్ష్యం. కీలకమైన ఈ ఒడంబడికలో అమెరికా తిరిగి చేరేలా చర్యలు తీసుకుంటామని బైడెన్ హామీ ఇచ్చారు. అయితే ఇందుకు భారీ మొత్తంలో నిధులు సమకూర్చాల్సి ఉంది.
ఆర్థిక పరిపుష్టి: తిరోగమనంలో కూరుకుపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పరిపుష్టం చేసి, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించడం.
ఓవైపు కరోనా మహమ్మారిని నియంత్రించడం... మరోవైపు సగటు ప్రజలు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు బైడెన్ కొద్దిరోజుల కిందటే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.
ఏకీకరణ: డెమొక్రాటిక్, రిపబ్లిక్ అన్న తేడా లేకుండా ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను, వాటి మద్దతుదారులందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి... తను నినాదమిచ్చినట్టు దేశాన్ని మళ్లీ అగ్రగామిగా నిలబెట్టడం.
తాను ఒక వర్గానికి మాత్రమే అధ్యక్షుడిగా ఉండబోనని, అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని బైడెన్ ప్రకటించారు.
బయట...
ముస్లిం వలసలు
ముస్లిం మెజారిటీ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వలసలపై ట్రంప్ సర్కారు ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఆంక్షలను ఎత్తివేస్తామని, తాను విభజించే అధ్యక్షుడిని కాదని బైడెన్ చెబుతున్నారు. ఇదే జరిగితే, వలసల ముసుగులో దేశంలోకి వచ్చే ఉగ్రవాదులను కట్టడి చేయడం డెమొక్రాటిక్ సర్కారుకు సవాలుగా మారుతుంది.
సెనెట్లో...
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా బైడెన్ వ్యవహరించడం మరీ అంత సులభం, సత్వరం కాకపోవచ్చు. ఎందుకంటే దిగువసభలో తీసుకున్న నిర్ణయాలను.. సెనెట్లో బలం బాగానే ఉన్న రిపబ్లికన్లు అడ్డుకునే అవకాశముంది. ప్రతి అంశాన్నీ వారు లోతుగా చర్చించే అవకాశముంది.
చైనాతో ఎలా..?
బైడెన్కు అత్యంత కఠిన పరీక్ష... చైనాతో వ్యవహారమే! ట్రంప్ హయాంలో అమెరికా-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డొనాల్డ్ ఓటమితో ఊపిరి పీల్చుకున్న డ్రాగన్ దేశం... అగ్రరాజ్యంతో సత్సంబంధాల కోసం తహతహలాడుతోంది. కానీ, ఇది అనుకున్నంత సులభం కాదు. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు చైనా వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాలను భారీగా తగ్గించడం కుదరకపోవచ్చు. దక్షిణ చైనా జలాల్లో ఆ దేశ ఆధిపత్యాన్ని నిలువరించాల్సిన సవాలు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ అంశాల్లో చైనాతో కలిసి ముందుకు వెళ్లడం బైడెన్కు పెద్ద సవాలే.
భారత్తో బంధం
అమెరికా అధ్యక్షునిగా బైడెన్ ఎన్నిక ఖాయం కాగానే ప్రధాని మోదీ ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే భారత విదేశీ వ్యవహారాలశాఖ, బైడెన్-కమలా హారిస్ బృందం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి.
భారత్-అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందనీ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం, టీకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు... దేశ, విదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలో కలిసి పనిచేస్తామని డెమొక్రాటిక్ వర్గాలు ప్రతినబూనాయి. జమ్మూ-కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి (ఆర్టికల్ 370) రద్దు, పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం, ఎన్జీవో సంస్థలపై ఆంక్షలు విధించడం వంటి మోదీ ప్రభుత్వ నిర్ణయాలపై బైడెన్-హారిస్లు గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘విదేశాల్లో ప్రజాస్వామ్య పరిపుష్టికి కృషి చేస్తా’మని బైడెన్ బృందం చెప్పడం మోదీ సర్కారుకు కాస్త ఇబ్బందికర పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘మోదీ జంటిల్మాన్, నా మిత్రుడు’ అంటూ ట్రంప్ పలుమార్లు చెప్పిన నేపథ్యంలో... బైడెన్ సర్కారుతో భారత్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రపంచ భద్రత, ఉగ్రవాదం, ప్రాంతీయ విభేదాలు, వాణిజ్యం వంటి అంశాల్లో కలిసి పనిచేస్తామని ఉభయ దేశాలు చెప్పడం ఆనవాయితీ. కానీ, వీటి కంటే రెండు దేశాలకూ ప్రధాన ముప్పుగా మారిన కొవిడ్-19ను ఎదుర్కోవడానికే నేతలిద్దరూ ప్రాధాన్యమివ్వడం విశేషం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ అనుకూల వైఖరిని బైడెన్ సర్కారు అనుసరిస్తుందా? అన్నదీ వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..