కేంద్రం కన్నెర్ర
రైతుల ఆందోళన కారణంగా దిల్లీలో తలెత్తిన ఉద్రిక్తతపై కేంద్రం కన్నెర్ర చేసింది. పెద్దఎత్తున హింస చెలరేగడంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా.. బుధవారం ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమై సమీక్షించారు. గణతంత్ర దినోత్సవం నాడు రణతంత్ర ర్యాలీ నిర్వహించి,
దిల్లీ ఘటనలపై 25 క్రిమినల్ కేసులు.. నిర్బంధంలోకి 200 మంది
టికాయత్, యోగేంద్ర సహా 37 మంది నేతలపై ఎఫ్ఐఆర్
ఉద్యమం నుంచి రెండు సంఘాలు వెనక్కి
1న పార్లమెంటుకు పాదయాత్ర రద్దు
పోరాటాన్ని ఆపేది లేదు: రైతు నేతలు
సరిహద్దులో యథావిధిగా నిరసనలు
దిల్లీ: రైతుల ఆందోళన కారణంగా దిల్లీలో తలెత్తిన ఉద్రిక్తతపై కేంద్రం కన్నెర్ర చేసింది. పెద్దఎత్తున హింస చెలరేగడంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా.. బుధవారం ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమై సమీక్షించారు. గణతంత్ర దినోత్సవం నాడు రణతంత్ర ర్యాలీ నిర్వహించి, ఎర్రకోటపై జెండాలు ఎగరేయడం, అనంతర పరిణామాలకు సంబంధించి 25 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సుమారు 200 మందిని పోలీసులు నిర్బంధంలో తీసుకున్నారు. రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్ టికాయిత్, యోగేంద్ర యాదవ్, మేధాపాట్కర్, దర్శన్పాల్, గుర్నాంసింగ్ చాదుని సహా 37 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు. దిల్లీ సరిహద్దుల్లోని దీక్షా స్థలాలకు రైతులు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. దీంతో సింఘు సరిహద్దులో మళ్లీ హడావుడి మొదలైంది. ఉద్యమం నుంచి వైదొలగుతున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. హింసకు తాము కారణం కాదని కర్షక నేతలు మరోసారి తేల్చిచెప్పారు. ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు.
విధ్వంసకారులపై పోలీసుల దృష్టి
హింసాత్మక ఘటనలకు కారకులను గుర్తించడంపై దిల్లీ పోలీసులు దృష్టి సారించారు. సీసీటీవీ దృశ్యాలను, వీడియోలను జల్లెడ పడుతున్నారు. హింసకు కారకులపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శాంతియుతంగా ట్రాక్టర్ల ర్యాలీ చేపడతామని, రైతునేతలు దానికి భిన్నంగా వ్యవహరించారని దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ చెప్పారు. తాము అత్యంత సంయమనం పాటించడం వల్ల ఏ ఒక్కరికీ ప్రాణనష్టం వాటిల్లలేదన్నారు. కొందరు నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తిందన్నారు. ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మంగళవారం నాటి ఘటనల్లో ఆరు బస్సులు, ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని గుర్తించారు. అనుమతి లేకుండా లుట్యెన్స్ ప్రాంతంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినందుకు ఒక ఎఫ్ఐఆర్; బ్యారికేడ్లను ధ్వంసం చేసి, బస్సును ఢీకొట్టి, పోలీసు సిబ్బందిపైకి ట్రాక్టర్లను నడపాలని ప్రయత్నించారంటూ మరో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఆందోళనకారుల చేతుల్లో 394 మంది పోలీసులు గాయాలపాలైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనలపై నాయకుల పాత్ర గురించి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడడం (సెక్షన్ 147, 148), హత్యాయత్నం (సెక్షన్ 307), నేరపూరిత కుట్ర (120బి) వంటి సెక్షన్ల కింద నేతలపై కేసులు పెడుతున్నారు.
భద్రత పెంపు
సమస్యాత్మకంగా మారిన దిల్లీలో పలుచోట్ల భద్రత బలగాలను మరింతగా మోహరించారు. ముఖ్యంగా ఎర్రకోట, రైతుల ఉద్యమ ప్రదేశాల్లో పారామిలిటరీ బలగాలను పెంచారు. కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఎర్రకోటను సందర్శించారు. పాక్షికంగా దెబ్బతిన్న మెటల్ డిటెక్టర్ ద్వారం, టికెట్ కౌంటర్ వంటివి పరిశీలించారు. కట్టడానికి కలిగిన నష్టంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దిల్లీలో అంతర్జాల సమస్య దృష్ట్యా ఎవరైనా న్యాయవాదులు వీడియో విచారణకు గైర్హాజరైతే వారు వాదించాల్సిన కేసుల్లో ప్రతికూల ఉత్తర్వులు ఇవ్వవద్దంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేను ‘సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్’ కోరింది.
పార్లమెంటుకు పాదయాత్ర వాయిదా
హింస తలెత్తిన నేపథ్యంలో ఆందోళన నుంచి వైదొలగుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(భాను), అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ప్రకటించాయి. తాజా పరిస్థితుల్లో.. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ నాడు జరపతలపెట్టిన ‘పార్లమెంటుకు పాదయాత్ర’ వాయిదా వేయాలని నేతలు నిర్ణయించారు. 30న దేశవ్యాప్తంగా సభలు, నిరాహార దీక్షలు కొనసాగించనున్నారు. నటుడు దీప్ సిద్ధు వంటి ‘‘సంఘ వ్యతిరేక శక్తులు’’ శాంతియుత ఆందోళనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, పోరాటాన్ని నీరుగార్చాలని ఎవరు ప్రయత్నించినా ఫలించబోవని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఎర్రకోట ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఘటనకు ప్రధాన బాధ్యులుగా భావిస్తున్న ఇద్దరికి నోటీసు పంపినట్లు సమాచారం.
సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు
రైతుల ఆందోళనలో అల్లర్లపై సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ను నియమించి విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హింసకు కారకులైన వారందరిపైనా కేసుల నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని దీనిని దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారీ కోరారు. తగిన ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ప్రకటించవద్దంటూ మీడియాను ఆదేశించాలని మరొకరు పిటిషన్ వేశారు. రైతుల పేరుతో రోడ్లపై బైఠాయించినవారిని తొలగించి, రాకపోకలకు వీలు కల్పించాలంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎర్రకోట వద్ద విధి నిర్వహణలో విఫలమైన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పిటిషన్దారుడు కోరారు.
హరియాణాలో 2000 మందిపై కేసు
చండీగఢ్: దిల్లీలోకి బలవంతంగా ప్రవేశించే ఉద్దేశంతో బ్యారికేడ్లను బద్దలుగొట్టే యత్నం చేశారంటూ 2000 మంది వ్యక్తులపై హరియాణాలోని పల్వాల్ జిల్లాలో కేసు నమోదైంది. ట్రాక్టర్లను అతి ప్రమాదకరంగా వారు నడిపినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM