పరీక్షల గండం దాటేదెలా?
పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి ఈసారి అగమ్యగోచరంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఎట్టకేలకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై చదువులకు అలవాటుపడేలోపు కరోనా కేసులు అధికమవుతున్నాయని విద్యాసంస్థలను మూసివేశారు.
ప్రత్యక్ష తరగతులు లేకుండా కష్టం
పది, ఇంటర్ విద్యార్థులకైనా తరగతులను ప్రారంభించాలంటున్న నిపుణులు
పది పరీక్షలను జూన్కు వాయిదా వేసినా ఇబ్బంది లేదని సూచన
ఈనాడు - హైదరాబాద్
పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి ఈసారి అగమ్యగోచరంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఎట్టకేలకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై చదువులకు అలవాటుపడేలోపు కరోనా కేసులు అధికమవుతున్నాయని విద్యాసంస్థలను మూసివేశారు. కేవలం 40 రోజుల ప్రత్యక్ష తరగతులతోనే ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలు జరుపుతారా? అన్న ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. మరో వైపు ఎంసెట్, జాతీయ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ తదితర వాటిల్లో ర్యాంకుల ఒత్తిడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇంటర్ ప్రధాన పరీక్షలు మే 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, పదో తరగతి ప్రధాన పరీక్షలు మే 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయని గతంలోనే ఆయా బోర్డులు ప్రకటించాయి. ప్రత్యక్ష తరగతుల ద్వారా మాత్రం సిలబస్ సగం కూడా పూర్తికాలేదు. పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 మాత్రమే పూర్తయ్యింది. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఎఫ్ఏ-2ను ఏప్రిల్ 15వ తేదీలోపు పూర్తి చేయాలి. విద్యాసంస్థలను మూసివేసినందున దాన్ని ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇక నెల రోజులు కూడా వ్యవధి లేదు. కేవలం 40 రోజుల చదువులతో పరీక్షలు రాయడం ఎలా అన్నది లక్షలాది సాధారణ విద్యార్థులను వెంటాడుతున్న ప్రశ్న.
ఇక సిలబస్ తగ్గించే అవకాశాలు లేవు
మే నెలలో వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని 70 శాతం సిలబస్తో...50 శాతం ఛాయిస్ ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఫలితంగా ఇక సిలబస్ తగ్గించే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే పరీక్షలు నిర్వహిస్తే 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయి. అందుకనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాల్సిందే. టెన్త్ పరీక్షలను జూన్కు వాయిదా వేయవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కొందరు అధికారులు కూడా అది మంచి ప్రతిపాదనేనని అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. ఈసారి 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లు (ఆరు పరీక్షలు) అయినందున జవాబుపత్రాల మూల్యాంకనాన్ని 10 రోజుల్లో పూర్తి చేయవచ్చని, చివరి పరీక్ష నుంచి 20 రోజుల్లో ఫలితాలు ఇవ్వొచ్చని అధికారి ఒకరు చెప్పారు.
ఇంటర్ విద్యార్థులకు ఏదీ మార్గం?
ఆన్లైన్ తరగతులతో ఇంటర్ పరీక్షలు జరిపినా మెరిట్ విద్యార్థులకు ఇబ్బంది ఉండదని, సగటు విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యక్ష తరగతులకు మళ్లీ విద్యాసంస్థలను తెరవకుండా మే 1 నుంచి వార్షిక పరీక్షలు జరపడం ఎక్కువ మందిని కలవరపెడుతోంది. ఇంటర్ ప్రధాన సబ్జెక్టు మార్కులకు ఎంసెట్లో 25 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే పరీక్షలు తప్పనిసరి. వార్షిక పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తాజాగా ఇంటర్బోర్డు ప్రకటించినందున ప్రస్తుతానికి మే 1వ తేదీ నుంచి రాత పరీక్షలు జరుగుతాయనే భావించాలి. ఇక ప్రవేశ పరీక్షల్లో ఆశించిన ర్యాంకు వస్తుందో?రాదో? అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
టీకాలు వేగవంతం చేసి...తరగతులు నడపాలి
- ఆచార్య ఉపేందర్రెడ్డి, ఎస్సీఈఆర్టీఈసారి కూడా అంతర్గత పరీక్షల ద్వారా వార్షిక పరీక్షల గ్రేడ్లు ఇవ్వడం మంచిది కాదు. కరోనా టీకాలు వేగవంతం చేయాలి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు వాటిని శరవేగంగా ఇచ్చి... తరగతి గది బోధన ప్రారంభించొచ్చు. ఏపీలో మాదిరిగా జూన్కు పరీక్షలను వాయిదా వేయవచ్చు.
తరగతులు జరపకుండా పరీక్షలొద్దు
- జి.మల్లికార్జునశర్మ, రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షుడు
ప్రత్యక్ష తరగతులు జరపకుండా, పాఠాలు బోధించకుండా వార్షిక పరీక్షలు జరపడం మంచిది కాదు. 6-8 తరగతులకు ప్రత్యక్ష పాఠాలు మొదలుపెట్టడమే పెద్ద పొరపాటు. ఇప్పటికైనా మళ్లీ కనీసం 10, ఇంటర్ తరగతులు ప్రారంభించాలి. ఈనెల 15 నుంచి పదో తరగతి వారినైనా పిలవాలి. పరీక్షలను జూన్ మూడు లేదా నాలుగో వారానికి వాయిదా వేయవచ్చు.
గణితంలో మార్కులు తగ్గే అవకాశం
- అభినవ్, ఇంటర్ ఎంపీసీ విద్యార్థి
హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఈ ఏడాదిలో ఒక్కసారే రసాయనశాస్త్రంలో ప్రయోగాలు చేశా. 80 శాతం సిలబస్ మాత్రమే పూర్తిచేయగలిగాం. వార్షిక పరీక్షలకు సిద్ధమైనా గణితంలో వంద శాతం మార్కులు సాధించే అవకాశం లేకుండా పోయింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్ర విద్యార్థులమే వాట్సప్ గ్రూప్గా ఏర్పడి సందేహాలను తీర్చుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM