భారత్కు సాయపడండి
మహమ్మారి వైరస్ విజృంభణతో భారత్లో వైద్య సేవల రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతూ సంక్షోభంలో చిక్కుకుందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ పేర్కొంది. అత్యధిక కేసుల భారంతో అల్లాడుతున్న దేశాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం కదలిరావాలని తాజా సంచిక(మే 14)లో ‘ఎ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్’ పేరుతో రాసిన ప్రత్యేక వ్యాసంలో
అంతర్జాతీయ సమాజానికి లాన్సెట్ జర్నల్ పిలుపు
కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై 8 సూచనలు చేసిన నిపుణుల బృందం
ఈనాడు, దిల్లీ: మహమ్మారి వైరస్ విజృంభణతో భారత్లో వైద్య సేవల రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతూ సంక్షోభంలో చిక్కుకుందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ పేర్కొంది. అత్యధిక కేసుల భారంతో అల్లాడుతున్న దేశాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం కదలిరావాలని తాజా సంచిక(మే 14)లో ‘ఎ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్’ పేరుతో రాసిన ప్రత్యేక వ్యాసంలో లాన్సెట్ నిపుణులబృందం పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ముందుకొచ్చి కరోనా సంక్రమణాన్ని అష్ట దిగ్బంధనం చేయాలని పేర్కొంది. భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్తో పొరుగు దేశాలకూ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. మానవతా దృష్టితో కొవిడ్ కట్టడికి కలిసిరావాలని, పెద్ద ఎత్తున వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చడమే కాకుండా నిపుణుల సేవలను, నిరుపేదలకు ఆహారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ 8 సూచనలు చేసింది.
1.అత్యవసరంగా భారత్లో వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేయాలి. పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, టీకాలు, నాణ్యమైన పీపీఈ కిట్లు, పరీక్ష కిట్లు విరాళంగా ఇవ్వాలి. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంపుతో పాటు ఆక్సిజన్ రవాణాకు అవసరమైన వస్తువులను పంపించాలి. అవసరమైన వారిని ఇంట్లోనే ఏకాంత వాసంలో ఉండేలా ప్రోత్సహించడానికి పేదలు, మురికివాడల్లో నివసించే వారికి పల్స్ ఆక్సీమీటర్లు, నాణ్యమైన మాస్కులు, ఆహారం, ఆర్థిక చేయూత అందించాలి.
2. అధిక మొత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవడానికి అంతర్జాతీయ సమాజం తోడ్పడాలి. మిగులు కొవిడ్ టీకాలను కలిగి ఉన్న ధనిక దేశాలు వాటిని భారత్కు పంపించాలి. వ్యాక్సిన్లకు సంబంధించిన అన్ని మేధోసంపత్తి హక్కులను రద్దు చేయాలి. ముడిసరకుల సరఫరాకున్న అవరోధాలను తొలగించాలి. టీకాల ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ బదిలీ చేయాలి. మేధో సంపత్తి హక్కులను అమెరికా రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం.
3. పరీక్షలు పెంచడానికి, వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి అంతర్జాతీయ సమాజం మద్దతివ్వాలి. ప్రజలు ఇంట్లోనే పరీక్షలు చేసుకొనేలా టెస్టు కిట్లు, మొబైల్ వ్యాన్లను అందించడం ఎంతో అవసరం. ప్రస్తుతం బి.1.617, బి.1.1.7 రకం వైరస్లు భారత్లో విస్తరిస్తున్నందున వాటి జన్యు పరిణామక్రమ విశ్లేషణను పెంచాల్సి ఉంది. ఇందుకోసం పరిశోధన, విద్యా సంస్థలు, లేబొరేటరీలు ముందుకొచ్చి సాయపడాలి.
4. భారత్లోని వైద్యులు, వైద్య సహాయకులు నిరంతరంగా పనిచేస్తూ అలసిపోయారు. ఇలాంటి సమయంలో వారికి సాయం అందించేలా సుశిక్షితులైన సిబ్బందిని జోడించడం చాలా ముఖ్యం. టెలీమెడిసిన్, టెలీమానిటరింగ్ నైపుణ్యంతో కొవిడ్ నియంత్రించే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సమాజం తమ సేవలను విస్తరించి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించవచ్చు.
5.. అంతర్జాతీయ సమాజం స్థానిక ప్రభుత్వాలతో కలిసి మౌలిక వసతులపరంగా మద్దతు ఇవ్వొచ్చు. క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల ఏర్పాటు, ఐసోలేషన్, క్వారెంటైన్ సెంటర్లను అభివృద్ధిచేయడానికి, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలను మెరుగుపరచడానికి సహాయం అందించవచ్చు. మానవతా సంస్థలు వైద్య సిబ్బందిని భారత్కు పంపి రోగులకు సేవలందించేలా చూడాలి. గుర్తింపు పొందిన సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన విదేశీ వైద్య నిపుణులు భారత్లో పనిచేసేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేయాలి.
6. వ్యాక్సిన్లు, జనరిక్ మెడిసిన్లు, యాంటీరెట్రోవైరల్స్, టీబీ మందుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్నందున ప్రపంచ దేశాలకు వాటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందువల్ల అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి భారత్కు చేయూతనందించి అత్యవసర మందుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సాయం చేయాలి. లేదంటే ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాల రోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
7.. భారత్లో ప్రబలిన కొవిడ్ దక్షిణాసియాకూ విపత్తుగా పరిణమించింది. అందువల్ల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, భారత్ నుంచి తిరిగి వచ్చే వారికి తప్పనిసరిగా క్వారెంటైన్ అమలుచేయడం ద్వారా సరిహద్దు దేశాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.
8.. భారత్లో కొవిడ్ను అరికట్టడానికి శాస్త్రీయ ఆధారిత చర్యలు తీసుకోవడానికి అంతర్జాతీయ నేతలు కలిసి పనిచేయాలి. కొవిడ్ కేసులు, మరణాలు కచ్చితంగా నమోదయ్యేలా చూడాలి. మరణానికి కారణాలు, ఏ సమయంలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది అన్న వివరాలను నమోదుచేయాలి. వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ముఖ్యం. కేసులపై పర్యవేక్షణ, డేటా సేకరణ కోసం దీర్ఘకాల వ్యూహాలు అమలు చేయాలి. రీ ఇన్ఫెక్షన్ వివరాలు తెలుసుకోవడానికీ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సమస్యను విశ్లేషించి, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా వ్యూహాలు అమలు చేయడం కోసం పరిశోధకులకు డేటాను రియల్టైంలో అందుబాటులోకి తేవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!