Cyclone Tauktae: అలకల్లోలం
దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన ‘తౌక్టే’ అతి తీవ్ర తుపాను.. బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు గోవా తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపించింది. సోమవారం రాత్రి పొద్దుపోయాక ఇది గుజరాత్ వద్ద తీరాన్ని తాకిందని అధికారులు ప్రకటించారు. దీని ధాటికి అరేబియా సముద్రంలో రెండు నౌకలు (బార్జిలు) తమతమ లంగర్లను తెంచుకుని కొట్టుకుపోయాయి.
బీభత్సం సృష్టించిన తౌక్టే తుపాను
14 మంది మృత్యువాత
మహారాష్ట్ర, గుజరాత్లలో భారీ వర్షాలు
సముద్రంలో కొట్టుకుపోయిన 2 నౌకలు
వాటిలోని 410 మంది క్షేమం
12 మంది మత్స్యకారుల్ని రక్షించిన కోస్ట్గార్డ్
మూడు రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్
ముంబయిలో 55 విమాన సర్వీసుల రద్దు
ముంబయి: దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన ‘తౌక్టే’ అతి తీవ్ర తుపాను.. బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు గోవా తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపించింది. సోమవారం రాత్రి పొద్దుపోయాక ఇది గుజరాత్ వద్ద తీరాన్ని తాకిందని అధికారులు ప్రకటించారు. దీని ధాటికి అరేబియా సముద్రంలో రెండు నౌకలు (బార్జిలు) తమతమ లంగర్లను తెంచుకుని కొట్టుకుపోయాయి. తక్షణ సహాయక చర్యల ద్వారా వాటిలో ఉన్న 410 మందిని రక్షించగలిగారు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, రెండు పడవలు నీట మునిగి ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. కర్ణాటకలో మొత్తం 8 మంది చనిపోయారు. తుపాను ప్రభావం, సహాయక చర్యల తీరుతెన్నులపై గుజరాత్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతో, దమణ్ దీవ్ లెఫ్టినెంట్ గవర్నర్తో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. పౌర యంత్రాంగాలకు చేదోడువాదోడుగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలను ఆదేశించారు. నౌకలు, గజ ఈతగాళ్లు, సహాయక సామగ్రిని ఎక్కడెక్కడ మోహరించాలో నిర్దేశించారు.
గంటకు 185 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు
ఈ ఏడాదిలో తొలి తుపాను అయిన తౌక్టే.. గంటకు 185 కి.మీ. వేగంతో గాలులకు కారణమై తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఒక్క గుజరాత్లోనే రెండు లక్షలమంది లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలో దించారు. ముంబయిలో కుంభవృష్టి కురిసింది. గంటకు 20 కి.మీ. చొప్పున కదులుతూ వచ్చిన తుపాను సౌరాష్ట్ర తీరంలో రాత్రి 9.30 గంటలకు భూమిని తాకడం మొదలైందని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అహ్మదాబాద్ కేంద్రం ప్రకటించింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటడానికి 3 గంటల సమయం పడుతుందని తెలిపింది. పోర్బందర్లోని ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్న 17 మంది కొవిడ్ బాధితుల్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. ఈ తుపాను ముంబయికి సమీపానికి వచ్చినప్పుడు గాలుల వేగం గంటకు 114 కి.మీ. ఉంది. దీంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకల్ని ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నిలిపివేశారు. మొత్తం 55 సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తుపాను ఉద్ధృతికి ముందే గుజరాత్ నుంచి రెండు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు దిల్లీకి వెళ్లగలిగాయి. ముంబయిలో సబర్బన్ రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు.
స్పందించిన కేంద్రం
తుపాను కోరల్లో చిక్కుకున్న గుజరాత్కు కావాల్సిన సాయం అందిస్తామని కేంద్రం ముందుకు వచ్చింది. అవసరమైతే రంగంలో దిగడానికి సంసిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలకు ఆదేశాలు పంపింది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంబయి తీరంలో రెండు నౌకలు కొట్టుకుపోవడం వల్ల 410 మంది ప్రాణాలకు ప్రమాదం వాటిల్లబోతోందన్న సమాచారం అందుకున్నాక భారత నౌకాదళం మూడు యుద్ధ నౌకల్ని సహాయం కోసం పంపించింది. ఒక నౌక బాంబే హై ప్రాంతంలోని హీరా చమురు క్షేత్రం వద్ద కొట్టుకుపోగా.. దానిలో 273 మంది సిబ్బంది ఉన్నారు. మరో నౌకలో 137 మంది ఉన్నారు. ఈ రెండూ ఓఎన్జీసీ రిగ్గుల వద్ద సేవలందిస్తున్నాయి. షాపోర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన అఫ్కాన్స్ తరఫున సిబ్బంది వీటిలో పనిచేస్తున్నారు. లంగరు వేసి ఉంచినా పెనుగాలుల ధాటికి నౌకలు కొట్టుకుపోయాయి. రెండు నౌకల్లో ఉన్నవారికి ప్రాణాపాయం లేదని, అంతా సురక్షితంగా ఉన్నారని అఫ్కాన్స్ ప్రతినిధి ప్రకటించారు. కొచ్చి తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న 12 మంది మత్స్యకారులను భారత తీరగస్తీ దళం (ఇండియన్ కోస్ట్గార్డ్) రక్షించింది. తుపాను తీవ్రతకు గుజరాత్లో పెద్దఎత్తున చెట్లు నేలకూలాయి. భావ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఆదివారం రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ జిల్లాలోని ఘోఘా ఓడరేవులో 9వ నంబరు అతి ప్రమాద హెచ్చరిక జెండాను ఎగరవేశారు. అహ్మదాబాద్, సూరత్, రాజ్కోట్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకల్ని మంగళవారం సాయంత్రం వరకు రద్దు చేశారు. సూరత్లో రెండు మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి.
శంషాబాద్లో అత్యవసరంగా దిగిన 2 విమానాలు
శంషాబాద్, న్యూస్టుడే: ముంబయిలో దిగాల్సిన రెండు విమానాలను ప్రతికూల వాతావరణం కారణంగా దారి మళ్లించి శంషాబాద్లో సోమవారం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బ్యాంకాక్లో సరకులు నింపుకొని బయలుదేరిన ఎయిర్ ఏసియా ఎయిర్లైన్స్ ఎక్స్-1218 కార్గో విమానం, కోల్కతా నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానాన్ని ముంబయి నుంచి దారి మళ్లించి శంషాబాద్లో దించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్