IMF: పొంచి ఉంది పెద్ద ముప్పు
భారత్లో సాగుతున్న కొవిడ్ రెండో విజృంభణ.. త్వరలో వర్ధమాన దేశాల్లో కరోనా వికృత రూపం దాల్చబోతోందనడానికి నిదర్శనం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. కరోనా తాకిడికి గురికాని ఆఫ్రికాఖండంలోని దేశాలు సహా అల్ప, మధ్యాదాయ దేశాలకు ఇది హెచ్చరిక అని తెలిపింది.
భారత్లో కొవిడ్ విజృంభణే దీనికి నిదర్శనం
2021 చివరికి 35% కన్నా తక్కువ మందికే టీకా
ఐఎంఎఫ్ నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: భారత్లో సాగుతున్న కొవిడ్ రెండో విజృంభణ.. త్వరలో వర్ధమాన దేశాల్లో కరోనా వికృత రూపం దాల్చబోతోందనడానికి నిదర్శనం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. కరోనా తాకిడికి గురికాని ఆఫ్రికాఖండంలోని దేశాలు సహా అల్ప, మధ్యాదాయ దేశాలకు ఇది హెచ్చరిక అని తెలిపింది. ఈ మేరకు ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపినాథ్, ఆర్థికవేత్త రుచిర్ అగర్వాల్లు ఓ నివేదికను వెలువరించారు. భారత్లో వ్యాక్సినేషన్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి 35%కన్నా తక్కువ మందికే టీకా అందుతుందని చెప్పారు. నివేదికలోని ముఖ్యాంశాలివీ..
* బ్రెజిల్ విజృంభణ తర్వాత భారత్లో కొవిడ్ రెండో ఉద్ధృతి చెలరేగడాన్ని బట్టి చూస్తే వర్ధమాన దేశాల్లో మున్ముందు కరోనా విశృంఖలంగా మారొచ్చని అర్థమవుతోంది.
* మొదటి ఉద్ధృతిని భారత్లోని ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ బాగానే తట్టుకొంది. ఈసారి మాత్రం రోగుల సంఖ్య పెరగడంతో దీనిపై అమాంతం ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఆక్సిజన్, ఆసుపత్రి పడకలు, వైద్య పరిరక్షణ వంటివి దొరక్క అనేకమంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
* ప్రస్తుతం భారత్ సాగిస్తున్న టీకా కొనుగోళ్లు, ‘కొవాక్స్’ కింద అందుతున్న వ్యాక్సిన్లను పరిగణనలోకి తీసుకుంటే 2022 ప్రథమార్ధం నాటికి దేశ జనాభాలో 25 శాతం మందికే వ్యాక్సిన్ అందుతుంది. అదనపు ఉత్పత్తి ద్వారా ఈ లోటును పూడ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
* 60 శాతం మందికి టీకా ఇవ్వాలంటే భారత్ అదనంగా దాదాపు 100 కోట్ల డోసులకు తక్షణం ఆర్డర్లు ఇవ్వాలి. టీకా కంపెనీలు అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన పెట్టుబడులకు రాయితీలు ఇవ్వడం, వ్యాక్సిన్ సరఫరా వ్యవస్థను మెరుగుపరుచకోవడం ద్వారా వీటిని సాధించొచ్చు. ఈ దిశగా భారత ప్రభుత్వం టీకా కంపెనీలకు ఇటీవల దాదాపు 60 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామం.
* అయితే భారత అధికారులు మాత్రం ఈ ఏడాది చివరినాటికి 200 కోట్ల డోసులు లభ్యమవుతాయన్న అంచనాల్లో ఉన్నారు. దీన్ని సాధించాలంటే ఉత్పాదక సామర్థ్యం పెంపులో జాప్యం లేకుండా చూడాలి. ముడిపదార్థాల ఎగుమతుల్లో ఆంక్షల తొలగింపునకు అంతర్జాతీయ కసరత్తు జరగాలి.
* టీకా ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలను అమెరికా సడలించినప్పటికీ భారత్లో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కీలక ముడిపదార్థాలకు ఇంకా కొరత ఉంది. దీన్నిబట్టి అమెరికా తన ఆంక్షలను మరింత సడలించాల్సి ఉందని స్పష్టమవుతోంది.
* భారత్లో ప్రస్తుతం టీకా ఉత్పత్తిదారులు ఇవ్వజూపుతున్న ధరలు, దేశంలో యువ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే 18-44 ఏళ్ల మధ్యవారికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి అదనంగా అయ్యే ఖర్చు.. జీడీపీలో 0.25 శాతంగానే ఉంటుంది. అందువల్ల కేంద్రీకృతంగానే ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలి.
5వేల కోట్ల డాలర్లతో అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రణాళిక
ఈ ఏడాది చివరినాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40% మందికి, 2022 ప్రథమార్ధం నాటికి 60% మందికి కొవిడ్ టీకాలు వేసేలా 5వేల కోట్ల డాలర్లతో అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రణాళికను ఐఎంఎఫ్ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కొవాక్స్కు అదనపు గ్రాంట్లు, మిగులు టీకా డోసులను ధనిక దేశాలు విరాళంగా ఇవ్వడం, వ్యాక్సిన్లు, వాటి ముడి పదార్థాలు దేశాల మధ్య రవాణా అయ్యేలా వెసులుబాట్లు ఉండాలని సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జీవా పేర్కొన్నారు. అలాగే కరోనాలో కొత్త రకాలను ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసులు అవసరమవుతాయని, ఇందుకోసం టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 కోట్ల డోసుల మేర పెంచాలని జి20 కూటమి ఆర్థిక సదస్సులో పేర్కొన్నారు. టీకాల లభ్యత ఉన్న ధనిక దేశాలు, అవి అందుబాటులో లేని పేద దేశాల మధ్య ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో