Black Fungus: మోతాదుకు మించి స్టిరాయిడ్ల వినియోగం
కొవిడ్ బారిన పడిన వారిలో ఇష్టారాజ్యంగా స్టిరాయిడ్లు వాడటం వల్లే మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా తాము జరిపిన అధ్యయనంలో 63 శాతంమంది రోగుల్లో స్టిరాయిడ్లు అవసరానికి మించి ఇచ్చినట్లు
6 ఎంజీకి బదులు 30 ఎంజీ వరకు ఇస్తున్నారు
బ్లాక్ ఫంగస్ విజృంభణకు ఇదే ప్రధాన కారణం
నెలా రెండు నెలల్లో తగ్గే అవకాశం ఉంది
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ప్రొ. అరుణ్లోక్ చక్రవర్తి
ఎం.ఎల్.నరసింహారెడ్డి, ఈనాడు - హైదరాబాద్
కొవిడ్ బారిన పడిన వారిలో ఇష్టారాజ్యంగా స్టిరాయిడ్లు వాడటం వల్లే మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా తాము జరిపిన అధ్యయనంలో 63 శాతంమంది రోగుల్లో స్టిరాయిడ్లు అవసరానికి మించి ఇచ్చినట్లు తేలిందని చండీగఢ్లోని పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (పీజీఐ చండీగఢ్) ప్రొఫెసర్ అరుణ్లోక్ చక్రవర్తి తెలిపారు.
పీజీఐ చండీగఢ్లో మెడికల్ మైక్రోబయాలజీ విభాగాధిపతిగా ఉన్న అరుణ్లోక్ చక్రవర్తి ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పరిశోధనలు చేస్తున్నారు. బ్లాక్ ఫంగస్పై 2017లోనే విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ఆధ్వర్యంలోని యాంటీఫంగల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నెట్వర్క్కు అంతర్జాతీయ కో ఆర్డినేటరైన చక్రవర్తి ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఇవి..
ప్రస్తుతం బ్లాక్ఫంగస్ తీవ్రరూపం దాల్చడానికి కారణమేంటి?
స్టిరాయిడ్స్ వాడకంలో సమతుల్యం లేకపోవడం ప్రధాన కారణం. దీనిపై తాజాగా దేశంలోని 16 కేంద్రాల్లో 350 మంది రోగులపై అధ్యయనం చేశాం. దీనిలో కొవిడ్ బాధితులకు విచక్షణరహితంగా స్టిరాయిడ్స్ ఇచ్చినట్లు గుర్తించాం. రోజుకు 6 ఎంజీ ఇవ్వాల్సి ఉంటే 30 ఎంజీ వరకు కూడా ఇచ్చారు. అవసరం లేనివారికీ వినియోగించారు. రెండో ముఖ్య కారణం రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండటం. ఆశ్చర్యమేంటంటే చాలామందికి కొవిడ్ వచ్చాక చేసిన పరీక్షల్లోనే మధుమేహం ఉన్నట్లు తెలిసింది. సుమారు 25 శాతంమందిలో షుగర్స్థాయి 300 - 400 వరకు ఉండగా కొందరిలో కంట్రోల్ కాని స్థితికి వెళ్లింది. కొవిడ్ వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గి ఊపిరి తీసుకోవడంలో సమస్యలొచ్చాయి. అదే సమయంలో స్టిరాయిడ్స్ మోతాదుకు మించి ఇవ్వడంతో షుగర్ లెవల్స్ 600 నుంచి 800 వరకు పెరిగిన కేసులు కూడా ఉన్నాయి. అటు కొవిడ్ వల్ల, ఇటు స్టిరాయిడ్స్ వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గింది. ఈ కారణంగా బ్లాక్ ఫంగస్ దాడి పెరిగింది. కొందరిలో ఐరన్, జీవక్రియలోనూ తేడాలొచ్చాయి ఇలాంటి పలు కారణాల వల్ల బ్లాక్ ఫంగస్ విజృంభించింది. ఆక్సిజన్ సరఫరా పైపులు, హ్యుమిడిఫయర్స్ వల్ల ఫంగస్ పెరిగినట్లు ఎక్కడా తేలలేదు.
ఈ సమస్య మనదేశంలోనే ఎక్కువగా ఉందా?
మనదేశంలో ఇది అసాధారణమైందేమీ కాదు. సాధారణంగానే ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్లో ఈ కేసులు 70 రెట్లు ఎక్కువ. కొవిడ్కు ముందు లక్షకు 14 కేసులు వచ్చేవి. 2016 జనవరి నుంచి 2017 సెప్టెంబరు వరకు దేశంలోని 12 కేంద్రాల్లో 465 మంది రోగులపై అధ్యయనం చేశాం. ఇందులో 315 మందిలో అంటే 67.7 శాతంలో ఇది మామూలుగానే వచ్చింది. 62 శాతం మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. చాలామందిలో (73.5 శాతం) అప్పటికే మధుమేహం ఎక్కువగా ఉంది. ఇతర తీవ్ర సమస్యలతో బాధపడేవారూ ఉన్నారు. అధ్యయనం చేసిన రోగుల్లో 90 రోజుల్లో 242 మంది (52 శాతం) మరణించారు.
ఈ వ్యాధి ప్రధాన లక్షణాలేంటి? ఎప్పటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది?
ముఖంలో ఒకవైపు నొప్పి, వాయడం. ముక్కుకు అడ్డుపడటం, ముక్కులోంచి నల్లగా లేదా గోధుమ రంగు ద్రవం కారడం, పండ్లు వదులు కావడం ముందుగా కనిపించే లక్షణాలు. మెడికల్, సర్జికల్ ట్రీట్మెంట్ సంయుక్తంగా చేయాలి. 2017లో అధ్యయనం చేసినపుడు 82 శాతం రోగులకు యాంఫోటెరిసిన్-బి వాడారు. 465 మందిలో 107 మందికి సర్జరీలు చేశారు. కొందరు ఆసుపత్రి ఖర్చులు భరించలేక ముందుగానే వెళ్లిపోయారు. స్టిరాయిడ్ విచ్చలవిడి వినియోగం, మధుమేహం అదుపునకు చర్యలు తీసుకోనంత వరకు బ్లాక్ఫంగస్ ఉద్ధృతి కొనసాగుతుంది. ఇప్పుడు పలు ప్రత్యామ్నాయ మందులు వచ్చాయి. వైద్యులకు ఇప్పటికే ఈ సమస్య తీవ్రత అర్థమైంది కాబట్టి నెల, రెండు నెలల్లో కొంత తగ్గే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం