Corona Update: 2.11 లక్షల కేసులు.. 3,847 మరణాలు
దేశంలో కొత్తగా 2,11,298 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 3,847 మంది మృతి చెందారు. ఈ మేరకు గురువారం నాటికి మొత్తం
90% దాటిన కొవిడ్ రికవరీ రేటు
ఈనాడు, దిల్లీ: దేశంలో కొత్తగా 2,11,298 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 3,847 మంది మృతి చెందారు. ఈ మేరకు గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2,73,69,093కి పెరగ్గా.. ఇంతవరకు మొత్తం 3,15,235 మంది మహమ్మారికి బలైపోయారు. క్రితం రోజుతో పోలిస్తే కరోనా రోజువారీ కేసులు 1.3% మేర పెరగ్గా.. మరణాలు 7.45% మేర తగ్గాయి. రోజువారీ మరణాలు 4 వేల దిగువకు తగ్గడం గత వారం రోజుల్లో ఇది మూడోసారి.
* దేశవ్యాప్తంగా బుధవారం 2,157,857 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపగా పాజిటివిటీ రేటు 9.79%గా నమోదైంది. ఇది క్రితం రోజు కంటే (9.42%) ఎక్కువ. వారం సగటు పాజిటివిటీ రేటు 10.93%కి చేరింది. ఇంతవరకు మొత్తం 33,69,69,353 పరీక్షలు నిర్వహించారు.
* ఒక్క రోజులో 2,83,135 మంది కోలుకున్నారు. వరుసగా 14వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. దీంతో రికవరీ రేటు 90.01%కి పెరిగింది. ఇంతవరకు 2,46,33,951 మంది కొవిడ్ను జయించారు.
* క్రియాశీలక కేసులు ఒక్కరోజులో 75,684 తగ్గాయి. దీంతో వాటి మొత్తం సంఖ్య 24,19,907 (8.84%)కి తగ్గింది. అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ, దిల్లీల్లో మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు నమోదవుతూ వస్తున్నాయి.
రాష్ట్రాల వద్ద 1.84 కోట్ల టీకా డోసులు
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.84 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. 3 రోజుల్లో అవి మరో 11,42,630 డోసులు అందుకోనున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఇంతవరకు ఉచిత, రాష్ట్రాలు నేరుగా సేకరించే కేటగిరీల కింద 22,16,11,940 టీకా డోసులను సమకూర్చినట్లు తెలిపింది. ఇందులో 20,17,59,768 డోసులను (వృథా అయినవాటితో కలిపి) వినియోగించినట్లు పేర్కొంది.
జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
కొవిడ్తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించే ప్రతిపాదనకు కేంద్రం గురువారం ఆమోదం తెలిపింది. వీరికి రూ.5 లక్షలు వంతున అందించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈమేరకు మొత్తం 67 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నట్లు పేర్కొంది.
ఆ లెక్కలన్నీ తప్పుడు అంచనాలు
- న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించిన కేంద్ర ప్రభుత్వందిల్లీ: భారత్లో కొవిడ్ మరణాలపై ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన ఓ కథనం నిరాధారమైందని కేంద్ర ప్రభుత్వం గురువారం తీవ్రంగా ఖండించింది. కొవిడ్ మరణాలను దాచిపెట్టడమన్న సమస్యే లేదని స్పష్టం చేసింది. అదంతా తప్పుడు సమాచారమని, వక్రీకరించిన అంచనాలతో ఆ కథనం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ ఆ కథనంలో.. భారత్లో కొవిడ్ మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయని పేర్కొంది. మూడు రకాల పరిస్థితులను అంచనా కడుతూ.. ఓ మోస్తరు విధానంలో 6 లక్షలు, మరో రకమైన పరిస్థితుల్లో 16 లక్షలు, మూడో రకం (అథమంగా) అంచనాలో 42 లక్షల మరణాలు ఉండొచ్చని పేర్కొంది. ఈ కథనం పూర్తిగా తప్పని, దీనికి ఎలాంటి ఆధారాల్లేవని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఖండించారు. దేశంలో మొత్తం కరోనా కేసులు, మరణాల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ కథనమంతా వక్రీకరించిన అంచనాలతో, తప్పులతో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. కథనంలోని అంచనాలపై అంశాలవారీగా వివరణ ఇస్తూ అవన్నీ ఎలాంటి ప్రాతిపదిక లేకుండా వేసిన అంచనాలని ఖండించారు. వాటిని అంగీకరించబోమని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?